Vijayawada Floods: వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు | YS Jagan Visit Vijayawada Flood Areas, Krishna Lanka Retaining Wall | Sakshi
Sakshi News home page

రిటైనింగ్‌ వాల్‌తోనే తప్పిన పెనుముప్పు.. జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు

Published Mon, Sep 2 2024 12:06 PM | Last Updated on Mon, Sep 2 2024 5:42 PM

YS Jagan Visit Vijayawada Flood Areas, Krishna Lanka Retaining Wall

సాక్షి, తాడేపల్లి: విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. సింగ్‌నగర్‌ సహా బాధిత ప్రాంతాలను మధ్యాహ్నం మూడు గంటలకు పరీశీలించనున్నారు.

ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్‌ జగన్‌. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

రిటైనింగ్‌ వాల్‌ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌..  వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని బాధితులకు భరోసానిచ్చారు.  

కృష్ణా నదికి రిటైనింగ్‌ వాల్‌.. వరదల నుంచి కోట వంటి రక్షణ
గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు.  కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.

గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్‌ ప్రాంతాలు నీటమునిగేవి. వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది.

ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్‌ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్కును అభివృద్ధి చేశారు. వైఎస్‌ జగన్‌ దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement