అశేష జనవాహిని వెంటరాగా.. వైఎస్సార్ సీపీ రేపల్లె, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ ఈవూరి గణేష్, పానెం చిన హనిమిరెడ్డి తమ నామినేషన్లను సోమవారం దాఖలు చేశారు. ఎండను సైతం లెక్కచేయని అభిమాన నీరాజనం ఎన్నికల్లో వారి విజయాన్ని సగం ఖరారు చేసింది. భారీ బైక్ ర్యాలీలు, తీన్మార్ డ్యాన్స్లు, గజమాలల ఘన స్వాగతం, జన జాతరతో రేపల్లె మురవగా.. అద్దంకి అదరిపోయింది. ఈవూరి వెంట ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, హనిమిరెడ్డి వెంట బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
– అద్దంకి, రేపల్లె రూరల్