No Headline
రేపల్లె నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి రాగానే నగరం మండలం దాసరిపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ నేత నున్నా భూషయ్యను దారుణంగా హత్యచేశారు. ఆధిపత్యం కోసమే పచ్చనేతలు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
● కూటమి అధికారంలోకి వచ్చాక వేమూరు నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. వందలాది మంది వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి ఊర్లు వదిలేలా చేశారు. అక్రమ కేసులు పెట్టారు.
● భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని తగులబెట్టారు. నిలదీసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్బాబుపై అక్రమ కేసులు పెట్టారు.
● తాజాగా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడన్న కక్షతో శ్రీనివాసరావు 20 ఏళ్లుగా నడుపుకుంటున్న చికెన్ దుకాణాన్ని కూలగొట్టారు.
● పర్చూరు నియోజకవర్గంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై పచ్చనేతలు అక్రమకేసులు పెట్టడంతోపాటు రౌడీషీట్లు తెరిపించి వేధిస్తున్నారు.
● బాపట్ల, చీరాల యోజకవర్గాల్లోనూ కూటమి నేతలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ,చిరుద్యోగులను
వెంటాడి వేధిస్తున్నారు.
అనగాని అడ్డాలో దారుణాలు
Comments
Please login to add a commentAdd a comment