
Today Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో మొదలయ్యాయి. గతవారం లాభాలతో ముగిసిన సూచీలు.. ఈరోజు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 65,500 వద్ద, నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 19,497 వద్ద కొనసాగుతున్నాయి.
దివిస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి. ఇక అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజస్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్స్గా పయనిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)