శరవేగంగా ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు

Published Sat, Sep 7 2024 2:48 AM | Last Updated on Sat, Sep 7 2024 2:48 AM

శరవేగ

పలమనేరు: చైన్నె– బెంగళూరు ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నాయి. అలైన్‌మెంట్‌ మేరకు మట్టిరోడ్డు పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం జల్లి పరచి తారు వేస్తున్నారు. చైన్నె–బెంగళూరు మహా నగరాల మధ్య బైరెడ్డిపల్లె వద్ద నిర్మించే జంక్షన్‌ పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే మూడు దశల్లో నిర్మాణం సాగుతుండగా ఇప్పటికే కర్ణాటకలో 70శాతం పనులు పూర్తయ్యాయి. రెండో దశలోని పలమనేరు నియోజకవర్గంలోనూ 50 శాతం పనులు చేశారు. మొత్తంగా డిసెంబర్‌ నాటికి పూర్తిచేసేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు తీసుకుంటోంది.

పది ప్యాకేజీల్లో నిర్మాణ పనులు చకచకా...

చైన్నె సమీపంలోని శ్రీపెరంబూదూర్‌ నుంచి బెంగళూరు సమీపంలోని హోస్‌కోట వరకు 283.5 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ( నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా) భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.16,730 కోట్లతో 2021నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 90మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంలో భాగంగా మూడు దశల్లో పనులు సాగుతున్నాయి. తొలి దశలో కర్ణాటకలో 71కిలోమీటర్లు, రెండు, మూడు దశల్లో భాగంగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో పనులు జోరుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 91కి.మీల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తారురోడ్లు, కల్వర్టులు, అండర్‌పాస్‌ బ్రిడ్జిల నిర్మాణాలు సైతం దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి.

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సంబంధించిన వివరాలు

చైన్నె నుంచి బెంగళూరుకు రోడ్డు దూరం : 283.5కి.మీ

ఇది కర్ణాటకలో 77కి.మీ, ఏపీలో 91కి.మీ, తమిళనాడులో 93కి.మీ

గతంలో బెంగళూరు–చైన్నె ప్రయాణ సమయం 6 గంటలు

ఎక్స్‌ప్రెస్‌ హైవేలో అయితే కేవలం 2.15 గంటలు మాత్రమే

ఈ రహదారిలో సాధారణ వేగం గంటకు 120 కి.మీ

ఎక్స్‌ప్రెస్‌ హైవేలో మొత్తం బ్రిడ్జిలు : 162

రైల్వే క్రాసింగ్‌లు: 4 కల్వర్టులు : 143

పెడిస్ట్రిన్‌ అండర్‌ పాస్‌లు: 52, వాహనాల అండర్‌పాస్‌లు : 41

మొత్తం ఫ్లైఓవర్లు : 17

కర్ణాటకలో ఇప్పటికే 70శాతం పూర్తయిన నిర్మాణం

ఏపీలో 50 శాతం సాగిన పనులు

పలు చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు, అండర్‌ పాస్‌ల నిర్మాణాలు

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు మూడు రాష్ట్రాల్లో రోడ్డు కనెక్ట్‌ కానున్న పట్టణాలు

ఈ రోడ్డు కర్ణాటక రాష్ట్రంలో హోస్‌కోట, మాలూరు, బంగార్‌పేట, కేజీఎఫ్‌, ఏపీలోని చిత్తూరు జిల్లాలో వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బలిజపల్లె, గుడిపాల, తమిళనాడులో రాణిపేట్‌, వాలాజ, శ్రీపెరంబూదూర్‌ మీదుగా ఈ రోడ్డు చైన్నె వరకు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
శరవేగంగా ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు 1
1/1

శరవేగంగా ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement