ఏరియా ఆస్పత్రిలో కార్మికుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఏరియా ఆస్పత్రిలో కార్మికుల నిరసన

Published Sat, Sep 7 2024 2:50 AM | Last Updated on Sat, Sep 7 2024 2:50 AM

ఏరియా

పలమనేరు: పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి చెందిన పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరసన తెలిపారు. ఆరునెలలుగా తమకు వేతనాలందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వంద పడకలుగా మారినా తమ సిబ్బంది మాత్రం పెరగలేదన్నారు. అయినప్పటికీ కష్ట పడుతున్నామని అయితే తమ కుటుంబాల పోషణ కోసం వేతనాలు రాకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపై ఓ వినతి పత్రాన్ని ఆస్పత్రి సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ వీణాకుమారికి అందజేశారు. వీరికి సీఐటీయూ నాయకులు గిరిధర్‌, ఓబుల్‌రాజు మద్దతు తెలిపారు. ఇందులో దేవా, లోకేష్‌, గీత, శ్యామల, బుజ్జమ్మ పాల్గొన్నారు.

మూడు దుకాణాలు

అగ్నికి ఆహుతి

బైరెడ్డిపల్లె: చెక్‌పోస్టు కూడలిలో మూడు చిల్లర దుకాణాలు శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతయ్యాయి. రహదారికి పక్కనే పూల వ్యాపారి కన్నయ్య, చెప్పుల వ్యాపారి వెంకటరమణ, ప్రొవిజన్స్‌ వ్యాపారి శ్రీనివాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున దుకాణాల్లో మంటలు చెలరేగడంతో రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో మిగిలిన దుకాణాల్లో మంటలు చెలరేగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ఏరియా ఆస్పత్రిలో కార్మికుల నిరసన 1
1/1

ఏరియా ఆస్పత్రిలో కార్మికుల నిరసన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement