● మూడు వాహనసేవల్లో మురిపించిన ముగ్ధమనోహరుడు ● ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథోత్సం, రాత్రి గజవాహనంపై మలయప్ప
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. బుధవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. దేవదేవుని దివ్యమంగళరూపా న్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉదయం హనుమంత వాహనంలోనూ భక్తుల సందడి కనిపించింది. సాయం సంధ్యవేళ స్వర్ణ రథోత్స వంలో వేలాది మంది భక్తులు స్వామివారి ని దర్శించుకుని, తన్మయత్వం పొందారు. రాత్రి గజవాహనం కూడా భక్తుల కోలాహలం మధ్య సాగింది. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజ న బృందాల సందడి కనిపించింది. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. భద్రతా సిబ్బంది హడావుడి ఏమాత్రం తగ్గలేదు. తిరుమలలో పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు, టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనశాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఫొటో ఎగ్జిబిషన్కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
స్వర్ణరథం
శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment