మహిళా కార్మికుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

మహిళా కార్మికుల ధర్నా

Published Sat, Sep 7 2024 2:50 AM | Last Updated on Sat, Sep 7 2024 2:50 AM

మహిళా కార్మికుల ధర్నా

నాయుడుపేటటౌన్‌ : మండలంలోని మేనకూరు సెజ్‌లో ఉన్న లాయల్‌ టెక్స్‌టైల్స్‌ వద్ద శుక్రవారం మహిళ కార్మికులు ధర్నాకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ లాకౌట్‌ ప్రకటించడంపై ఆందోళన చేపట్టారు. కంపెనీ ప్రతినిధులు ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా లాకౌట్‌ ప్రకటించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సైతం ధర్నాకు సంఘీబావం ప్రకటించారు. సీఐటీయూ నేత ముకుందా మాట్లాడుతూ లాయల్‌ పరిశ్రమలో మొత్తం 600 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దారు గీతావాణి అక్కడకు చేరుకుని పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, అలవెన్సు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్మికుల పట్ల సానుకూలంగా వ్యహరించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement