విధుల్లో బాధ్యతతో పనిచేయండి
– కలెక్టర్ను కలిసిన నూతన అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : విధుల పట్ల బాధ్యతతో పనిచేసి ప్రజలకు మేలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నూతన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం పలు శాఖల నూతన అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయా శాఖల్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చెన్నయ్య, నగరి డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజీజ్ కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం కాసేపు పలు అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment