వైఎస్సార్‌సీపీలో చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరికలు

Published Fri, May 10 2024 6:05 PM

వైఎస్

పోలవరం రూరల్‌: పోలవరం మండలం గూటాల గ్రామంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. గురువారం గూటాల గ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకులు చిన్నం రామకోటయ్య, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ గ్రామానికి చెందిన సుమారు 100 మంది పార్టీలో చేరగా అత్యధిక శాతం మహిళలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మెచ్చి పార్టీలోకి చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్యం పట్టివేత

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ సర్కిల్‌ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 100 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ వై.పట్టాభిచౌదరి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం బైపాస్‌ రోడ్డు బైనేరు వంతెన వద్ద గురువారం తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో స్కూటీపై ఓ వ్యక్తి 100 మద్యం సీసాలు తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. అతనిని అరెస్టు చేసి, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, స్కూటీని సీజ్‌ చేసినట్లు చెప్పారు. దాడుల్లో ఎస్‌ఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరికలు
1/1

వైఎస్సార్‌సీపీలో చేరికలు

Advertisement
 
Advertisement