● ఐస్క్రీమ్ బండి నిర్వాహకుడే స్టార్ క్యాంపెయినర్ ● జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ బైక్పై ప్రచారం
యడ్లపాడు: సాధారణ ప్రజలే వైఎస్సార్ సీపీకి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. నవరత్నాలు పథకాలతో తమకు ఎంతో ఇచ్చిన సీఎం జగనన్నకు అందులో కొంతైనా తిరిగివ్వాలని నిర్ణయించుకున్నారు. తమ ఊరి బడి రూపురేఖలు మార్చి, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం తెచ్చిన.. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇలా బండి కట్టుకుని ఉప్పరపాలేనికి చెందిన విప్పర్ల జాన్సన్ ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తను ఐసీక్రీమ్ బండి నిర్వహిస్తూ జీవిస్తున్నానని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక తన బిడ్డల చదువులకు భరోసా లభించిందని చెప్పుకొచ్చాడు. ఇంకా కొన్ని జాన్సన్ మాటల్లోనే...‘ మా గ్రామంలోని పాఠశాలకు ఐదేళ్ల కిందట ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. నాడు–నేడు కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలు మారాయి. ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఉన్నారు. మా పిల్లలే కాదు ఊరిలోని పేదలందరి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివే గొప్ప అవకాశం కలిగింది. ఇవన్నీ నాకు స్ఫూర్తిని రగిల్చాయి. నేను ఎందుకు వైఎస్సార్ సీపీ స్టార్ క్యాంపెయినర్ కాకూడదని భావించాను. అందుకే నా సొంత వాహనానికి ప్రచార సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాను. సమావేశాలు, సభలకు, నామినేషన్ల సమయంలో విస్తృతంగా పాల్గొన్నా.. సీఎం జగన్ పథకాలు, వివిధ సభల్లోని ఆయన ప్రసంగాలను ఊరూరా వినిపిస్తున్నాను. చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్కుమార్ యాదవ్ను ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాను.’