నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక

Published Sun, May 5 2024 1:40 AM

నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక

రాజోళి: గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని వాటర్‌గ్రిడ్‌ ఎస్‌ఈ జగన్‌మోహన్‌ అన్నారు. మండలంలోని ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. తుమ్మిళ్లలో నది నుంచి గ్రామానికి నీరు సరఫరా చేస్తున్న మోటార్లు, నీటి లభ్యత గురుంచి అధికారులను అడిగారు. అనంతరం పెద్ద తాండ్రపాడులో పర్యటించిన ఆయన గ్రామంలో నీటి ట్యాంకులు ఎన్ని ఉన్నాయి వాటి సామర్థ్యం ఎంత అనే విషయాలను అడిగారు. నీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యలేంటని అడిగారు. గ్రామంలో ఉన్న బోర్ల ద్వారా గ్రామంలో ఎద్దడి రాకుండా ఎలాంటి ప్రణాళిక అవలంభించాలనే అంశాలను అధికారులకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ తేజవర్ధన్‌, ఎంపీఓ ఖాజా మెయినుద్దీన్‌ తదిదరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement