10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక | Sakshi
Sakshi News home page

10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక

Published Mon, May 6 2024 6:20 AM

10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 10న నిర్వహించే సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి విష్ణునాథ్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇ స్తామని హామీ ఇచ్చి ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, జహీరాబాద్‌ ఎంపీగా సురేశ్‌ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, డీసీసీ అధ్యక్షు డు కైలాస్‌ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement