రేపు బాన్సువాడకు రాజ్‌నాథ్‌సింగ్‌ రాక | Sakshi
Sakshi News home page

రేపు బాన్సువాడకు రాజ్‌నాథ్‌సింగ్‌ రాక

Published Wed, May 8 2024 6:10 AM

-

బాన్సువాడ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం బాన్సువాడకు రానున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ ప్రభారి పెద్దోల్ల గంగారెడ్డితో కలిసి బాన్సువాడలోని వీక్లీ మార్కెట్‌లో పర్యటించి, సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. గాడిద గుడ్డు అంటూ తనను తాను కించపరచుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ సభకు బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలనుంచి ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్‌, పైడిమల్‌ లక్ష్మీనారాయణ, కోనాల గంగారెడ్డి, పాశం భాస్కర్‌రెడ్డి, ప్రసాద్‌, అశ్విన్‌, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement