సింగరేణి చూసొద్దామా? హైదరాబాద్ నుంచి ప్యాకేజీలు ఏమున్నాయంటే? | Sakshi
Sakshi News home page

సింగరేణి చూసొద్దామా? హైదరాబాద్ నుంచి ప్యాకేజీలు ఏమున్నాయంటే?

Published Fri, Mar 31 2023 1:54 AM

Singareni Darshan from Hyderabad - Tourist packages - Sakshi

విద్యానగర్‌ (కరీంనగర్‌) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరేణి దర్శన్‌ పేరిట కోల్‌ మైన్స్‌ టూరిజం ప్యాకేజీని ప్రారంభించినట్లు ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ ఖుస్రో షా ఖాన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్‌, కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి సింగరేణి దర్శన్‌ టూర్‌ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ టూర్‌ ప్యాకేజీలో అండర్‌ గ్రౌండ్‌ బొగ్గుగనులు, ఓపెన్‌ కాస్ట్‌ గనులు, గనుల రెస్క్యూ స్టేషన్లు, విద్యుత్‌ ప్లాంట్ల వద్ద విద్యుత్తు తయారీని చూడవచ్చని, జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి వచ్చే పర్యాటకులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు, కరీంనగర్‌ నుంచి రూ.వెయ్యి టికెట్‌ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్‌సెట్‌ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలని తెలిపారు. టూర్‌కు వచ్చేవారు 18 ఏళ్లకు పైబడి, ఆరోగ్యవంతులై ఉండాలని, మహిళలు కుర్తా, జీన్స్‌, పైజామా వంటి వస్త్రాలు ధరించి షూ వేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement