రత్నవజ్రఖచిత సింహాసనం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రత్నవజ్రఖచిత సింహాసనం సిద్ధం

Published Sat, Sep 28 2024 1:16 AM | Last Updated on Sat, Sep 28 2024 1:16 AM

రత్నవజ్రఖచిత సింహాసనం సిద్ధం

మైసూరు: మైసూరు రాజవంశీకులు శరన్నవరాత్రుల్లో భాగంగా నిర్వహించే ప్రైవేట్‌ దర్బార్‌ నిర్వహణకు అత్యవసరమైన రత్నవజ్రఖచిత సింహాసనాన్ని జోడించే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు నవగ్రహ పూజ, గణపతి హోమం, చాముండేశ్వరి పూజ, శాంతి హోమాలు నెరవేర్చారు. అనంతరం ప్యాలెస్‌ నేలమాళిగలోని స్ట్రాంగ్‌ రూం నుంచి పోలీసు బందోబస్తు, భద్రత మధ్య సింహాసనపు విడిభాగాలను దర్బార్‌ హాల్‌కు తరలించారు. రాజమాత ప్రమోదాదేవి మార్గదర్శనంలో సింహాసనం జోడింపు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య ఆసనం, మెట్లు, బంగారపు ఛత్రి అనే మూడు భాగాలను జోడించి పూజలు చేశారు. ఈ సింహాసనాన్ని శనివారం నుంచి ప్రజల వీక్షణకు అనుమతిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement