రాజధానిలో అక్రమ కట్టడాలకు చెక్
బనశంకరి: బెంగళూరు నగరంలో అక్రమంగా నిర్మించిన నాసిరకం కట్టడాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. శనివారం విదానసౌధలో సీఎం సిద్దరామయ్య తో కలిసి డీకేశి విలేకరులతో మాట్లాడారు. వర్ష నష్టంపై సమావేశంలో చర్చించామని దీంతో పాటు అక్రమ కట్టడాల అడ్డుకట్టకు సిద్ధమయ్యామని తెలిపారు. గత సర్కారు అధికారుల చేతులు కట్టేసిందని, తమ ప్రభుత్వం బీబీఎంపీ, బీడీఏ, బీఎంఆర్డీఏ అధికారులకు ఇందులో పూర్తి అధికారాలను ఇస్తామన్నారు. తక్షణం ఇలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిలిపివేస్తామని, అలాగే ఆక్రమణల పట్ల దృష్టిసారిస్తామని తెలిపారు. ఇటీవలి వర్ష నష్టాలపై స్పందిస్తూ కెంగేరి వద్ద చెరువులో ఇద్దరు బాలలు మునిగి మృతి, బాబుసాబ్పాళ్య నాసిరకం కట్టడం దురంతం మినహా ఇతర దుర్ఘటనలు జరగలేదన్నారు. అనేక ప్రాంతాలలో నిర్వాసితులకు పునరావాసం కల్పించినట్లు చెప్పారు. ఒకేసారి రాజకాలువల నిర్మాణం చేపడతామని, కాలువకు అటు ఇటు 50 అడుగుల స్థలం వదిలిపెట్టి అక్కడే రోడ్డు నిర్మిస్తామని, దీనివల్ల రక్షణ, స్వచ్ఛత కు దోహదపడుతుందన్నారు. మొదటి దశలో 300 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేస్తామని తెలిపారు.
డిప్యూటీ సీఎం డీకేశి
Comments
Please login to add a commentAdd a comment