నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

Published Wed, May 8 2024 11:50 PM

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

దహెగాం(సిర్పూర్‌): వానాకాలం సీజన్‌ సమీపిస్తున్నందున ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంతోపాటు ఐనం, బీబ్రా, ఒడ్డుగూడ, చినరాస్పెల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాలను బుధవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే యూరియా అధిక ధరలకు విక్రయించినా లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం లగ్గాం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ శాతం 17 కంటే మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఏవో వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement