మోదీ చరిష్మా.. నాపై నమ్మకమే.. | Sakshi
Sakshi News home page

మోదీ చరిష్మా.. నాపై నమ్మకమే..

Published Fri, May 10 2024 2:00 PM

-

ర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, బలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, కోవిడ్‌ మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యలు, విదేశాలకు సైతం కరోనా వ్యాక్సిన్లు అందజేయడం, భారత్‌లో జీ–20 సదస్సు నిర్వహణ ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పలు విప్లవాత్మక కార్యక్రమాలు ప్రజలను మోదీకి, పార్టీకి దగ్గర చేశాయి. ప్రచారం నిమిత్తం ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మోదీ చరిష్మా నాకు కలిసి వస్తుంది. ప్రజలకు సేవ చేస్తాననే ప్రజల్లో నాపైన ఉన్న నమ్మకం నన్ను గెలిపిస్తుంది. కేంద్రంలో మోదీ, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో నన్ను గెలిపించాలని ప్రజలు ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement