ఏడాదికి రెండు, మూడుసార్లు | - | Sakshi
Sakshi News home page

ఏడాదికి రెండు, మూడుసార్లు

Published Mon, Aug 26 2024 11:02 AM | Last Updated on Mon, Aug 26 2024 11:02 AM

-

హబూబ్‌నగర్‌ టీటీడీ ఆధ్వర్యంలో భజన మండళ్లు నెలనెల క్రమంలో తిరుమల వెళ్తాయి. టీటీడీ ఉమ్మడి జిల్లా ధర్మ ప్రచార పరిషత్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉత్తరాపల్లి రామాచార్యులు ఐదు జిల్లాల్లోని భజన మండళ్లను ఆర్గనైజ్‌ చేస్తారు. భజన చేయాల్సిన తేదీని సభ్యులకు 15 రోజుల ముందే టీటీడీ నుంచి సమాచారం వస్తుంది. వారు ఒక రోజు ముందు తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ భజనమండళ్లకు టీటీడీ అన్నిరకాల వసతులు కల్పిస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం లేదా సాయంత్రం వీరికి సమయం ఇస్తారు. రెండు గంటల పాటు తమకు కేటాయించిన అఖండ హరినామస్మరణ మండపంలో భజన చేయాలి. తిరిగి 12 గంటల తర్వాత మరోసారి మరో 2 గంటల పాటు భజన చేస్తారు. మొదటిసారి భజన అయ్యాక వారికి స్వామి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దీంతో పాటు రవాణా చార్జీలు కూడా ఇస్తారు. భజన చేసిన వారి ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబర్‌ తీసుకొని ఎవరి డబ్బులు వారికి టీటీడీనే నేరుగా జమ చేస్తుంది. ఇలా ప్రతి మండలికి ఏడాదిలో రెండు, మూడుసార్లు భజన చేయడానికి అవకాశం కల్పిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement