గద్వాల క్రైం: కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల ఎకై ్సజ్, టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం కేటీదొడ్డి మండలం పాతపాలెంలోని ఓ కల్లు దుకాణంపై దాడులు చేపట్టారు. ఈ క్రమంలో నిషేధిత సీహెచ్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డ్రగ్ నిర్మూలన దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టాస్క్ఫోర్స్ బృందం విస్తృతంగా కల్లు విక్రయ దుకాణాలపై నిఘా ఉంచి నిత్యం దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే పాతపాలెంలో కల్తీ కల్లు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్స్ బృందం దుకాణంలో సోదాలు చేపట్టారు. ఇందులో కేజీకి పైగా సీహెచ్ కలిగిన పాకెట్ను గుర్తించి సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దుకాణంలో ఉన్న కల్లును ధ్వంసం చేసి 24 సీసాలను సీజ్ చేశారని, వాటిని పరీక్షించేందుకు ల్యాబ్కు పంపినట్లు సమాచారం. దాడులు జరిగిన విషయం తెలిసిన ప్రధాన విక్రయదారుడు పరారైనట్లు తెలిసింది.
వివరాలు వెల్లడించేందుకు
ఎకై ్సజ్ అధికారుల వెనుకంజ
ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణం
పరారీలో కల్తీకల్లు విక్రయదారుడు
దాడులు వాస్తవమే..
కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నిషేధిత కల్లు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం మేరకు శనివారం ఉదయం కల్లు దుకాణంలో తనిఖీ చేపట్టాం. కల్లు కల్తీదా అనే విషయంపై ఆరా తీస్తున్నాం. అక్కడి కల్లు దుకాణం నుంచి 24 సీసాలను సీజ్ చేసి ల్యాబ్కు పంపిస్తున్నాం. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– సైదిరెడ్డి, ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment