భూత్పూర్: మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ శివారులో గల భూవివాదం కేసులో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రాఘవేంద్రరాజు, శ్రీనివాస్గౌడ్ అమిస్తాపూర్ శివారులోని 205, 196 సర్వేనంబరులో 2.1 ఎకరాల భూమి 2015లో ఇద్దరి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధరణిలో శ్రీనివాస్గౌడ్, రాఘవేంద్రరాజులపై పొలం సమభాగాలుగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. శ్రీనివాస్గౌడ్ తనకు వచ్చిన సగభాగం భూమిని విక్రయించాడు. తన ప్రమేయం లేకుండా భూమి విక్రయించాడని శ్రీనివాస్గౌడ్, రాంప్రసాద్, శివప్రకాష్లపై రాఘవేంద్రరాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment