కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుల చేరిక | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుల చేరిక

Published Sun, May 5 2024 3:30 AM

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుల చేరిక

తాండూర్‌: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాదారం ఎంపీటీసీ సభ్యుడు సూరం రవీందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు మురళీధర్‌రావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ వేల్పుల రాజు, మాజీ ఉపసర్పంచ్‌ రాజేశం, టీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రసిడెంట్‌ చీకటి వెంకటేశంగౌడ్‌, నాయకులు మల్లేష్‌, తిరుపతి, మొండిగౌడ్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement