కాంగ్రెస్‌లో కౌన్సిలర్ల చేరిక | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కౌన్సిలర్ల చేరిక

Published Mon, May 6 2024 11:55 PM

కాంగ్రెస్‌లో కౌన్సిలర్ల చేరిక

బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంగ్రెస్‌ పార్టీలో కౌన్సిలర్ల చేరికల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగా తాజాగా సోమవారం మరో ఐదుగురు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు షేక్‌ అఫ్సర్‌, షేక్‌ ఆస్మా, కొక్కెర చంద్రశేఖర్‌, గడ్డం అశోక్‌గౌడ్‌, చిట్యాల లక్ష్మీ, బీఆర్‌ఎస్‌ శ్రేణులు గురుండ్ల సత్యనారాయణ, చిట్యాల మధు, బీఆర్‌ఎస్‌ మైనార్టీసెల్‌ పట్టణ అధ్యక్షుడు ఎండి.ఎజాజ్‌, టీఆర్‌ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ యూనిస్‌ ఉన్నారు. వీరికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, మాజీ కేంద్రమంత్రి ఎస్‌.వేణుగోపాలచారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 
Advertisement
 
Advertisement