
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మేజర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో హీరో అడివి శేష్ ప్రేక్షకులకు గుడ్న్యూస్ అందించాడు.
చదవండి: ఒటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్?
ఇది మన సినిమా అని అందుకే అందరికి అందుబాటు ధరల్లో మేజర్ను తీసుకువస్తున్నట్లు అప్డేట్ ఇస్తూ.. టికెట్ ధరల పట్టికను షేర్ చేశాడు. ఈ మేరకు శుక్రవారం అడివి శేష్ ట్వీట్ చేస్తూ ‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్ ధరలను నిర్ణయించాం’అని పేర్కొన్నాడు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ టికెట్ రేట్స్ ఇలా ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్: తెలంగాణ-రూ. 150 కాగా ఏపీ- రూ. 147; మల్టీప్లెక్స్: తెలంగాణ-రూ. 195, ఏపీ-రూ. 177గా ఉండనున్నాయి.
చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్పై సామ్ ఏమన్నదంటే..
ఇదిలా ఉంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లో మేజర్ రిలీజ్ కానుంది. కాగా మహేశ్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
Comments
Please login to add a commentAdd a comment