‘దదా.. గుర్తెట్టుకో.. ఈ పాలి యేట.. గురి తప్పేదెలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో నాగచైతన్య చెప్పే డైలాగ్తో మొదలవుతుంది ‘తండేల్’ గ్లింప్స్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతోంది. ‘ఎసెన్స్ అఫ్ తండేల్’ అంటూ శనివారం గ్లింప్స్ను రిలీజ్ చేశారు.
‘మా నుంచి ఊడపోసిన ఓ ముక్కా.. మీకే అంతుంటే ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంతుండాలి’, ‘తేరే పాకిస్తాన్కే అడ్డా మే బైట్కే బతా రహ్ తా హూం. భారత్ మాతా కీ జై’ అంటూ నాగచైతన్య చెప్పిన మరికొన్ని డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. ‘‘వాస్తవ ఘటనలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ భారత మత్స్యకారుని కథే ఈ సినిమా ప్రధానాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.