బీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

Published Sun, May 5 2024 2:40 AM

బీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

వెంకటాపురం(ఎం): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని మాజీ రాష్ట్రమంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మండల పరిధిలోని వెంకటాపురం, లక్ష్మీదేవిపేట గ్రామాలలో బీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడారు. ఎంపీగా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమిలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపించి కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం నల్లగుంట గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు పోరిక హర్జినాయక్‌ తండ్రి వాగ్యానాయక్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ అభ్యర్థి కవిత, బీఆర్‌ఎస్‌ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, నాయకులు పోరిక గోవింద్‌నాయక్‌, మల్క రమేష్‌, అశోక్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.

మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌

Advertisement
Advertisement