10న ప్రధాని మోదీ రాక | Sakshi
Sakshi News home page

10న ప్రధాని మోదీ రాక

Published Wed, May 8 2024 3:35 AM

10న ప్రధాని మోదీ రాక

నారాయణపేట: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈసందర్భంగా భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌తో కలిసి ఎస్‌పీజీ డీఐజీ జియాకుమార్‌, ఏఎస్పీ ప్రవీణ్‌ నౌటియల్‌ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎర్రమన్నుగుట్ట వద్ద హెలిప్యాడ్‌ స్థలం, పబ్లిక్‌ మీటింగ్‌ నిర్వహించనున్న మినీ స్టేడియాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. మినీ స్టేడియంలో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు, మీడియా పాయింట్‌ వద్ద బారికేడ్స్‌ ఏర్పాటు, పబ్లిక్‌ ఎంట్రన్స్‌, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వారి వెంట డీఎస్పీ ఎన్‌.లింగయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ మహేష్‌, ఆర్డీఓ మధుమోహన్‌, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌ పాండురంగారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన

పోలీసు అధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement