చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్‌ గోపి ఆగ్రహం | Suresh Gopi slams media for sensationalising Me Too allegations | Sakshi
Sakshi News home page

చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్‌ గోపి ఆగ్రహం

Published Tue, Aug 27 2024 3:52 PM | Last Updated on Tue, Aug 27 2024 4:07 PM

Suresh Gopi slams media for sensationalising Me Too allegations

మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్‌ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీలో మీ టూ ఆరోప‌ణ‌లపై మంత్రి స్పందిస్తూ... కోర్టే స‌మాధానం ఇస్తుంద‌న్నారు. చిత్ర ప‌రిశ్ర‌మలో ఆరోప‌ణ‌లు మీడియాకు ఆహారంగా మారింద‌ని అన్నారు. ‘మీరు ఆ వార్త‌లతో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చుకానీ ఓ పెద్ద వ్య‌వ‌స్థ‌ను నేల‌కూలుస్తున్నారు. మేక‌లు కొట్టుకునేలా చేసి, ఆ త‌ర్వాత మీలాంటి వాళ్లు వాటి ర‌క్తాన్ని తాగుతారు. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను మీడియా త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.

తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నాన‌ని, మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్ర‌శ్న‌లు కేవ‌లం ఆ ఆఫీసును విజిట్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే అడ‌గాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి.  మ‌ల‌యాళం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న‌ట్లు హేమ క‌మిషన్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement