MeToo
-
అలాంటి డైరెక్టర్తో అవకాశం.. వెంటనే తిరస్కరించా: బాలకృష్ణ హీరోయిన్
ఇటీవల మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక కుదిపేసింది. మాలీవుడ్లో నటీమణులపై లైంగిక వేధింపులను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దీంతో పలువురు మహిళా నటీమణులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే గతంలోనూ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్ సైతం వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సైతం మీటూ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తనుశ్రీ మీటూ అంశంపై మరోసారి స్పందించింది. 2018లో తనకు ఓ పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే ఆ మూవీ డైరెక్టర్ మీటూ నిందితుడు కావడంతో వెంటనే ఆఫర్ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు తనుశ్రీ పేర్కొంది. గతేడాది కూడా కోల్కతాకు చెందిన ఓ దర్శకుడి నుంచి తనకు ఆఫర్ వచ్చిందని నటి తెలిపింది. అదే కారణంతో మళ్లీ తిరస్కరించానట్లు వివరించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ దర్శకుడు తనను ఎంపిక చేశారని భావించినట్లు తనుశ్రీ పేర్కొంది.తనుశ్రీ మాట్లాడుతూ..'అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడు? తన సినిమాలో నేను నటిస్తే.. తన ఇమేజ్ని మార్చుకోవాలనుకున్నాడు. నేను ఆ సినిమా చేస్తే మీటూ నిందితుడికి సపోర్ట్ చేస్తున్నట్టే. అందుకే సున్నితంగా తిరస్కరించా. ఇందులో ఓ ఏజెన్సీ ప్రమేయం కూడా ఉంది. నేను సినిమాని వదిలేయాలనుకుంటున్నాను అని వారితోనే చెప్పా. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మా నాన్నను కూడా సంప్రదించా. ఒక నిందితుడితో సినిమా చేయడం నైతికంగా సరైనది కాదని నాన్న సలహా ఇచ్చాడని' తెలిపింది. కాగా.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. -
ఇండస్ట్రీలో ఇలా జరగడం దురదృష్టకరం: ఉప్పెన భామ
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా మలయాళ చిత్రం ఏఆర్ఎమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. హేమ కమిటీ నివేదిక తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కృతి శెట్టి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చాలా దురదృష్టకరమని హీరోయిన్ పేర్కొంది. అయితే వీటి వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన వస్తుందని కృతి శెట్టి అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.(ఇది చదవండి: ఏఆర్ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి)కృతి శెట్టి మాట్లాడుతూ..'ఇలాంటి విషయాలు కచ్చితంగా ఎక్కువ స్థాయిలో మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరూ మా పరిశ్రమ మాత్రమే చెడ్డదని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేను మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్. మహిళలపై వేధింపులు లాంటి విషయాలను తలచుకుంటే నిజంగానే ఆందోళనకు గురవుతా. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం నటిగా మాత్రమే ఉండాలని కోరుకుంటా. కానీ ఎవరైనా కొత్తగా నటనలో అడుగుపెట్టాలనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తా' అని అన్నారు. -
'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్పై మండిపడ్డ సింగర్!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్-1 చూశామని.. ఇప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.తమిళంలో ఆ పరిస్థితి లేదు..జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్మయి రిప్లై.. కోలీవుడ్లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. I really do not understand how they are saying sexual harassment does not exist in Tamil Industry.HOW?! https://t.co/sm9qReErs0— Chinmayi Sripaada (@Chinmayi) September 1, 2024 -
చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్ గోపి ఆగ్రహం
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది. -
MeToo Case: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్
కర్ణాటక: నటి శుత్రి హరిహరన్ మీటూ కేసు కొత్త మలుపు తిరిగింది. బీ రిపోర్ట్ ప్రశ్నిస్తూ శ్రుతికి కోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతికి నోటీసు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులకు సూచించింది. 2018లో బహుభాష నటుడు అర్జున్పై నటి శుత్రి హరిహరన్ మీటూ ఆరోపణలు చేసింది. కేసుకు సంబంధించి అర్జున్పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు బీ రిపోర్టు సమర్పించారు. దీంతో కోర్టు శ్రుతికి, పోలీసులకు నోటీసులు ఇచ్చారు. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
స్టార్ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’
ఓ స్టార్ హీరోపై నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. భోజ్పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్పై నటి యామిని సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ సింగ్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భోజ్పూరి నటి అయిన యామిని సింగ్ అక్కడ స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె పవన్ సింగ్ లేటెస్ట్ మూవీ బాస్లో నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల సెట్పై వెళ్లిన ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే సడెన్గా ఆమెను ఈ సినిమా నుంచి తొలగించినట్లు ఇటివల వార్తలు వచ్చాయి. చదవండి: నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్ ఆమె తీరు నచ్చకే ఈ సినిమాలో నుంచి తొలగించారంటూ రకరకాలు పుకార్లు వినిపించాయి. తాజాగా తనపై వస్తున్న రూమార్స్పై యామిని సింగ్ స్పందించింది. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పవన్ సింగ్తో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్కు సరైన పాత్రలు ఉండవని చెప్పింది. అదే విధంగా ‘పవన్ సింగ్ తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలోనే అందరు అనుకుంటున్నారు. చదవండి: కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్ కానీ అది నిజం కాదు. బాస్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే. ఈ సినిమా నుంచి నన్ను ఎవరు తీసేయలేదు. నేనే తప్పుకున్నా. పవన్ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడు అసలు స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయ్యింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు సినిమా చేయాలని ఉందా? లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను’ అంటూ యామిని చెప్పుకొచ్చింది. -
Actress Ashita: అందుకు ఒప్పుకోలేదు.. శాండిల్వుడ్కు దూరమయ్యా
బెంగళూరు: కన్నడ చిత్ర సీమను మీటూ వేధిస్తోందని నటి అశిత ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. తాను శాండిల్వుడ్కు దూరం కావటానికి కారణాలను పేర్కొంది. కన్నడ చిత్రాలలో నటించాలంటే పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలి, అందుకు తాను సహకరించలేదు. సహకరించి ఉంటే నటించే అవకాశం వచ్చేది. దీంతో తాను శాండిల్ వుడ్కు దూరం అయ్యాయని ఆ చానల్లో పేర్కొంది. అయితే ఆమె ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటూ ఆరోపణలు చేశారు. చదవండి: (Arohita: ఆమ్ ఆద్మీలో చేరిన సినీ నటి) -
మీటూపై అనుచిత వ్యాఖ్యలు, 'టార్గెట్ చేయాలనుకోలేదు, సారీ'
తనకు పది మంది మహిళలతో శారీరక సంబంధం ఉందని, అదే మీటూ అయితే దాన్ని కొనసాగిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మలయాళ నటుడు వినాయకన్. ఒరుతె సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మీటూపై అడ్డగోలుగా మాట్లాడినందుకు జర్నలిస్టులు అతడిని ఏకిపారేశారు. ఈ పరిణామంతో వెనక్కు తగ్గిన వినాయకన్ సదర జర్నలిస్ట్కు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్బుక్లో నోట్ షేర్ చేశాడు. 'ఒరుతె ప్రమోషనల్ ఈవెంట్లో ఓ జర్నలిస్ట్ సిస్టర్ అవమానకరంగా భావించిన భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను ఏరకంగానూ టార్గెట్ చేయాలనుకోలేదు. ఆమెకు అసౌకర్యం కలిగించేలా మాట్లాడినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ వినాయకన్' అని రాసుకొచ్చాడు. చదవండి: అదే ‘మీటూ’ అయితే, నేను దానిని కొనసాగిస్తాను -
ఆయన్ను తొలగించండి: పంజాబ్ సీఎంకు మీటూ సెగ
చండీగఢ్: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా ఇంకా పూర్తి బాధ్యతలు చేపట్టకముందే ఛన్నీపై గతంలో చెలరేగిన మీటూ వివాదాల సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. 2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆందోళన చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ (సోనియా గాంధీ) నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి, బాధిత మహిళ స్టేట్మెట్ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్మధ్య మధ్య నెలరోజుల పాటు సాగిన సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరు కావడం గమనార్హం. కాగా 2018లో తనకు చరణ్జీత్ అసభ్య మెసేజ్లు పంపారంటూ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణలు గుప్పించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసినట్టు అంతా భావించారు. Today, he has been made Punjab CM by a party that is headed by a woman. It is betrayal. He is a threat to women safety. An enquiry should be conducted against him. He is not worthy to be CM. I urge Sonia Gandhi to remove him from the CM post: NCW Chairperson Rekha Sharma (1/2) pic.twitter.com/56kjw4XG7F — ANI (@ANI) September 20, 2021 -
లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. హారిస్బర్గ్: హాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్మెంట్ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆండ్రియాతో మొదలు.. టెంపుల్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఆండ్రియా కాన్స్టాండ్.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్లో కోస్బీకి శిక్ష విధించింది. అమెరికన్ డాడ్ స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్ను అలరించారు. 1984లో టెలికాస్ట్ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్ డాడ్’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్!. గుండెపగిలి.. -
అత్యాచారం చేశాడు.. పిచ్చిదాన్నైపోయా!
లేడీ గాగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న సింగర్. హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్ సింగర్ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో.. తన గతానికి సంబంధించి కొన్ని చేదు విషయాల్ని బయటపెట్టి కంటతడి పెట్టుకుంది. పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్ కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ భయానక అనుభవాన్ని పంచుకుంటూ లేడీ గాగా ఏడ్చేసింది. అయితే గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడింది. ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మధనపడ్డానని చెప్పిన లేడీ గాగా.. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా అభివర్ణించింది. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. యాపిట్ టీవీ ఫ్లస్ ఫ్లాట్ ఫామ్ వారి ‘ది మీ యూ కాంట్ సీ’ డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్ అయ్యింది. కాగా, గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా. -
‘మీటూ’కి కొత్త వెర్షన్!
‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది. పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్ ప్రావిన్స్ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు. దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్ని ‘లైఫ్ డిసిప్లిన్ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్ అనే మాటతో సరిపెట్టేసింది. ∙∙ వాంగ్ మొదట ఝౌ కు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్. ఝౌ కూడా మెసేజ్తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్! బాస్ తన క్యాబిన్లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్ల రూపంలో ఈమె ఫోన్లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్ చేసి చెబుతోంది. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ బాస్కి సపోర్ట్గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్గా తీసుకుని సీట్లోంచి తొలగించింది. తుడిచే కర్రతో బాస్ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్) -
మీ టూ వల్ల తప్పించుకున్నాను!
‘మీ టూ’ అంటూ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎప్పట నుంచి అయితే బయటకు చెబుతున్నారో అప్పటి నుంచి ఓ మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి. అందుకు ఓ ఉదాహరణ సాయి పల్లవి చెప్పిన ఒక విషయం. ఇటీవల ఓ సందర్భంలో ‘మీ టూ’ ఉద్యమం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘కథలో భాగంగా హీరోతో పెదవి ముద్దు సన్నివేశంలో నటించాలని ఒక దర్శకుడు అడిగారు. అలాంటి సన్నివేశాలు చేయడం నాకు అసౌకర్యంగా ఉంటుందన్నాను. ఇంతలో, హీరో కలగజేసుకొని ‘మీరు బలవంతపెడితే ‘మీ టూ’ ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉంద’ని దర్శకుడితో అన్నారు. దాంతో లిప్ లాక్ సీన్ని ఆ దర్శకుడు విరమించుకున్నారు. ‘మీ టూ’ వల్ల నేను ఆ సీన్ నుంచి తప్పించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే అది ఏ సినిమా? హీరో ఎవరు? లిప్ లాక్ చేయమన్న దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం సాయి పల్లవి బయటపెట్టలేదు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించిన ‘లవ్స్టోరీ’లో ముద్దు సీన్ ఉంది. ట్రైన్ లో చైతూతో ట్రావెల్ చేస్తున్న సీన్లో సాయి పల్లవి, చైతూకి ముద్దుపెడతారు. అయితే ఇది లిప్ లాక్ కాదు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నారామె. మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్స్టాగ్రామ్లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్లో వైన్స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్గా నా కెరీర్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా
ముంబై : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు మోపిన నటి పాయల్ ఘోష్పై రూ.కోటి పది లక్షల పరువు నష్టం దావా వేశారు రిచా చద్ధా. 2013లో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు ఈ ఆరోపణలపై మరోనటి రిచా చద్దా స్పందించి పాయల్కు లీగల్ నోటీసులు పంపించారు. పాయల్ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు. చదవండి: దర్శకుడిపై అత్యాచారం కేసు దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్ కశ్యప్ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్లు సైతం కశ్యప్కు బాసటగా నిలిచారు కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. -
రూపా దత్తా తప్పులో కాలేశారా?
సాక్షి, ముంబై: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణల అనంతరం బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. అయితే ఇక్కడే తీవ్ర గందరగోళం ఏర్పడింది. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ దీనికి సంబంధించిన అనురాగ్ సఫర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మరోవైపు కశ్యప్కు స్త్రీల పట్ల ఏ మాత్రం గౌరవం లేదంటూ పాయల్ ఘోష్ ఆరోపణలను గట్టిగా సమర్ధించారు రూపా. అంతేకాదు ఆయన డ్రగ్స్ కూడా తీసుకుంటారని, కఠినంగాశిక్షించాలని కోరారు. ఎన్సీబీ తనిఖీలు చేపట్టాలని ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై రూపా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన) అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన రూపా దత్తా ... అనురాగ్ సఫర్ 2014 నాటి ఛాటింగ్ షేర్ చేయడం సరికొత్త వివాదాన్ని రేపింది. ఐర్లాండ్ కు చెందిన అనురాగ్ సఫర్ 2010, సెప్టెంబరు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. తాను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కాదని తనకూ అనురాగ్ కశ్యప్ కు సంబంధం లేదనే ఆ సమాచారాన్ని ట్వీట్ చేశాడు. అనురాగ్ సఫర్కి గతంతో అనురాగ్ కశ్యప్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉండేదని, పలు మీడియా సంస్థలు కూడా అతడిని కశ్యప్ గా భావించడంతో ఈ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. అయితే మీరు గొప్ప స్త్రీవాది అంటూ తాప్సీ పన్ను కశ్యప్కు కితాబివ్వడం విశేషం. ఈ ఆరోపణలు రుజువైతే కశ్యప్తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని తాప్సీ ప్రకటించారు. మీటూ ఉద్యమానికి చెడ్డపేరు తేవద్దంటూ నటి స్వర భాస్కర్ కూడా రూపాను తప్పుబట్టారు. అలాగే సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా తోపాటు, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కూడా కశ్యప్కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలను అనురాగ్ ఇప్పటికే ఖండించారు. अनुराग कश्यप ख़ुद बोल रहा है मैं अनुराग कश्यप नहीं हूँ चैटिंग में।वाह ! पायेल घोष के साथ अश्लील हरकते करने के बाद भी बोल रहा है मैंने कुछ नहीं किया।गुनहगार गुनह करके स्वीकार नहीं करता ये स्वाभाविक है।अरेस्ट के बाद उसका भी तरीक़ा है गुनह कुबूलने की।चिन्ता ना करे सच सामने आएगा। — Rupa Dutta (@iamrupadutta) September 22, 2020 Pl Excuse me friends!!! I am not film director or producer Anurag Kashyap. I am another Anurag. Please do not bug me considering him. — Anurag Safar (@anurag_safar07) September 15, 2010 अनुराग कश्यप के नज़रों में किसी भी औरत का कोई इज्ज़त नहीं है।जो मुझे उसे जानने के बाद पता चला।इसीलिए पायेल घोष का इल्ज़ाम बिलकुल सही है।अनुराग कश्यप को कठोर से कठोर सज़ा मिलनी चाहिए।और यह ड्रग भी लेता है।अपने आर्टिस्ट को भी सप्लाई करता है NCB जांच करे कृपा।#arrestanuragkashyab pic.twitter.com/ckK5ZfUDOW — Rupa Dutta (@iamrupadutta) September 19, 2020 -
సాయం చేయండి: మోదీకి పాయల్ ట్వీట్
ముంబై: ‘ఇప్పుడు మహిళల కోసం నిలబడాల్సిన సమయం, ప్లీజ్ వారి వాదన వినండి’ అంటూ నటి పాయల్ ఘోష్ ప్రజలను కోరారు. అంతేగాక దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్పై వల్ల తనకు ప్రమాదం ఉందని, సాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె తాజాగా ట్విట్ చేశారు. అనురాగ్ తనను బలవంతం చేయబోయాడని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పాయల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. ‘‘అనురాగ్ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడు. దయతో అతడిపై చర్య తీసుకోండి. ఈ సృజనాత్మక వ్యక్తి వెనుక రాక్షసుడు ఉన్నాడు. అది ప్రజలంతా గ్రహించాలి. దయ చేసి నాకు సాయం చేయండి’’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే అనురాగ్పై లైంగిక ఆరోపణలు చేసిన అనంతరం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు, నటీనటులు పాయల్వి అసత్య ఆరోపణలని, అలాంటి వాడు కాదంటూ ఆయనకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కశ్యప్పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు) ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ సోమవారం ఓ ట్వీట్ చేస్తూ.. ‘ప్రజలు ప్రతి విషయంలో మహిళలనే నిందిస్తూ మాతృస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు. ఇది మహిళల కోసం నిలబడే సమయం. వారి గొంతు వినండి. మహిళలు అణచివేతకు గురయ్యే కాలం పోయింది. ఇప్పుడు 2020లో ఉన్నాం అంటూ #metoo హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. పాయల్ తనపై చేసిన ఆరోపణలను అనురాగ్ ఖండించారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, ఇవి పూర్తిగా తప్పుడు వ్యాఖలుగా అనురాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందరూ పాయల్కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. అనురాగ్ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) People blame women for everything and post smash the patriarchy. It's time to stand with the women. Let them be heard. A voice suppressed is a generation of women oppressed. It's 2020. Come on, India! #MeToo — Payal Ghosh (@iampayalghosh) September 21, 2020 -
నా పేరెందుకు వాడారు?: నటి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్పై లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తన పేరు వాడిన మూడవ వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్పై నటి పాయల్ ఘోష్ శనివారం లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడారు. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయపరమైన పోరాటానికి తాను సిద్దంగా ఉన్నట్లు రిచా ప్రకటించారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) ‘అనురాగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడవ వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్ రిచా చద్దా పేరు తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు ఆయన అన్నారు. ‘‘నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో లేవనెత్తి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దేబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మీ టూ: అనురాగ్కు మాజీ భార్య మద్దతు) View this post on Instagram 💪🏼 A post shared by Richa Chadha (@therichachadha) on Sep 20, 2020 at 3:42pm PDT సినిమా చాన్స్లు కావాలంటే ప్రతి నటి తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని దర్శకుడు అనురాగ్ తనతో చెబుతూ లైంగిక దుష్పవర్తనకు పాల్పడినట్లు నటి పాయల్ ఓ ఇంటర్యూలో ఆరోపించింది. దీనికి తాను అనురాగ్తో ‘మీరు రిచా చద్దాకు అవకాశం ఇచ్చారు. మహీ గిల్, హుమా ఖురేషిలకు సినిమా ఛాన్స్లు ఇచ్చారు. వారు చాలా నార్మల్గా కనిపించే అమ్మాయిలే అయినప్పటికీ మీరు వారికి మీ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసలు దర్శకులేవరు అలాంటి అమ్మాయిలకు అవకాశం ఇవ్వరూ కానీ మీరు గొప్ప పని చేశారు అని చెప్పి మానసికంగా నేను దీనికి సిద్దంగా లేను’ అని కశ్యప్తో చెప్పానన్నారు. అనురాగ్ కశ్యప్ 2012లో తన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో రిచా చద్దా.. నాగ్మా ఖటూన్ పాత్రలో నటించారు. హుమా ఖురేషి కూడా అదే ప్రాజెక్ట్ ఓ పాత్రలో కనిపిచారు. 2009లో కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దేవ్ డి’లో మహీ గిల్ నటించారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) -
హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు
అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ పలు హిట్లను తన ఖాతాలో వేసుకొని అటు టాలీవుడ్ ఇటు కోలివుడ్లో ఫుల్ బిజీ నటిగా మారారు. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస లవర్’ చిత్ర ఫలితం ఎలా ఉన్నా సువర్ణ పాత్రలో ఐశ్యర్య నటను అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం నాని చిత్రంలో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని ఓ స్టార్ డైరెక్టర్ కించ పరచే విధంగా మాట్లాడాడు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు. అయితే ఈ అవమానాలేవి నన్ను ఆపలేదు. నేనుబోల్డ్గా ఉంటాను. ఆ లక్షణమే నన్ను నిలబెట్టిందనుకుంటాను. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. అందుకే.. బాధల్ని ఓర్చుకున్నాను’ అంటూ ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యానించారు. ఇక ఐశ్వర్య రాజేశ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేశ్ అప్పట్లో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేశ్ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నటికి కూడా లైంగింక వేదింపులు, వర్ణ వివక్ష తప్పకపోవడం గమనార్హం అని పలువురు వాపోతున్నారు. చదవండి: త్రివిక్రమ్ డైరెక్షన్.. వెంకీ, నాని హీరోలు! యూట్యూబ్ ట్రెండింగ్లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాపాడమని లాయర్ దగ్గరకు వెళ్తే..
బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన తరుఫున వాదించేందుకు నితిన్ సత్పుటే అనే ఓ లాయర్ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’) సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్.. ప్రత్యర్థి మహిళా లాయర్తో కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. తననేదో రక్షిస్తాడని ఓ లాయర్ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు పడింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్స్పిరేషన్ #తనూటూ..!) -
వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్ నటి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్కు చెందిన కల్కి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?) ‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఉంటాయి. ఒక సారి హాలీవుడ్లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే. -
వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ పాటల రచయిత వైరముత్తుపై సంచలన గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ప్రముఖనటుడు, మక్కళ్ నీదిమయ్యం పార్టీ అద్యక్షుడు కమలహాసన్పై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చిన్మయి గతంలో కూడా వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాలనే సృష్టించాయి. ఫలితంగా తనూ నష్టపోయారు. దీంతో సయయం వచ్చినప్పుడల్లా చిన్మయి వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కమల్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత దర్శకుడు కే.బాలచందర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్తో పాటు వైరముత్తు పాల్గొన్నారు. దీంతో గాయనీ చిన్మయి వైరముత్తుపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన జీవితం నశించిపోతుంది. ఇక బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేరు. ఇలాంటి వారిని కార్యక్రమాలకు అతిధులుగా ఎలా ఆహ్వానిస్తారు?అని ఆరోపించారు. మీటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు ఈ ఏడాది పలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లోనూ అతిధిగా పాల్గొన్నారు. ఆయనకు జరిగిన నష్టం ఏమీలేదు అయితే బాధింపుకు గురైన నేను మాత్రం నిషేధానికి గురైయ్యాను. ఇదే సినీరంగంలో పెద్దల ద్వారా నాకు లభించిన న్యాయం. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు బహిరంగ వేదికలపై తమ ఇమేజ్ను ఎలా కాపాడుకోవాలన్నది బాగానే తెలుసుకున్నారు. అలాంటి వారిలో కొందరు రాజకీయనాయకులూ ఉన్నారు. వారిని చూస్తుంటే భయం కలుగుతోంది’ అని చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాఫిక్గా మారింది. -
సెక్స్ వేధింపులపై ఇదో ‘ఫేస్బుక్’ ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీటూ’ ఉద్యమంలాగా బ్రిటన్లో మరో ఉద్యమం మొదలయింది. అయితే ఇది ‘ఫేస్బుక్’ వేదికగా కొనసాగుతోంది. తమకు మాజీ జీవిత భాగస్వాముల నుంచి ఎదురైన చేదు అనుభవాలను మహిళలు వరుస క్రమంలో ఇందులో వివరిస్తున్నారు. వీటిలో ఎక్కువగా లైంగిక వేధింపులే ఉంటున్నాయి. మాజీ జీవిత భాగస్వాములైన పురుష పుంగవులు తమను ఎలా లైంగికంగా, మానసికంగా లోబర్చుకున్నారో, వేధించారో, రేప్లు చేశారో, తమను మోసం చేసి పరాయి స్త్రీలతో ఎలా కులికారో, తిరిగారో వివరిస్తూ ‘ప్రిక్ అడ్వైజర్’ ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ల మీద పోస్ట్లు పెడుతున్నారు. మాజీ భాగస్వాముల పేర్లను, ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రూపులో లక్ష మంది బ్రిటన్ మహిళలు చేరిపోయారు. ‘క్లేర్స్ లా విషయంలో బ్రిటన్ అధికారులు చూపిస్తున్న అలసత్వం వల్లనే ఈ ఉద్యమం పుట్టుకొచ్చిందని ‘ప్రిక్ అడ్వైజర్ గ్రూప్’లోని ఒక అడ్వైజరయిన సమంతా రైట్ మీడియాకు వివరించారు. ‘క్లేర్స్ లా’ అనే చట్టం అప్పటి బ్రిటన్ హోం మంత్రి థెరిసా మే చొరవ మేరకు 2014, మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చిన మగవాళ్ల గృహ హింసకు సంబంధించిన నేర చరిత్రను తెలుసుకోవాలంటే వారిని పెళ్లి చేసుకోబోతున్న మహిళలను ఈ చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. ఈ మేరకు పోలీసులిచ్చే సమాచారాన్ని చూసి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భర్తల విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. బ్రిటన్లో ఏటా 13 లక్షల మంది మహిళలు భర్తల చేతుల్లో లైంగిక వేధింపులు, గృహ హింసకు గురై విడిపోతుంటే వారిలో 18 శాతం మంది బాధితులే పోలీసు అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వారి భర్తలకు సంబంధించిన నేర చరిత్ర మాత్రమే పోలీసుల వద్ద నిక్షిప్తమై ఉంటోంది. మిగతా వారి గురించి తెలియడం లేదు. అందుకనే ఈ ‘ప్రిక్ అడ్వైజర్’ గ్రూప్ పేజీ పుట్టుకొచ్చింది. ఈ గ్రూపులో చేరిన మహిళలంతా మాజీ భర్తల నుంచి ఎదురైన అనుభవాలను వారి భార్యల పోస్టింగ్ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. వాటిలో తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పురుష పుంగవులు ఎవరైనా ఉంటే వారి జాతకాలు చేతికి చిక్కినట్లే. ఈ ఫేస్బుక్ గ్రూప్పై మాజీ భర్తలు మాత్రం లబోదిబోమని గొడవ చేస్తున్నారు. ఈ పేరిట అమాయకులైన మగవారి జీవితాలను బలిచేసే ప్రమాదం ఉందని, పోస్టింగ్ల ఆధారంగా మాజీ భర్తలపై పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే....కలిసి కాపురం చేస్తున్నప్పుడు కాల్చుకుతిన్న భార్యలు భవిష్యత్తులో తాము మరో పెళ్లి చేసుకోకుండా ఇలా జీవితాలను నాశనంచేస్తున్నారని ఇంకొందరు వినిపిస్తుంటే, బతికితిమిరా దేవుడా ! అనుకుంటూ విడాకులు తీసుకుంటే ఈర్శాసూయలతోని, మానసిక రుగ్మలతోని మాజీ భార్యలు ఇలాగా కూడా వేధిస్తారా?....అంటూ గగ్గోలు పెడుతున్నవారూ లేకపోలేదు. అయితే ఏదీ తాము శ్రుతిమించనీయమని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ‘ఫేస్బుక్’ యాజమాన్య వర్గాలు తెలియజేస్తున్నాయి. -
భయపడి ఛస్తున్నారు
ఇరవై ఏళ్ల నాటి ‘టాయ్ స్టోరీ 2’ చిత్రాన్ని మళ్లీ హోమ్ వెర్షన్గా విడుదల చేస్తూ.. ‘మీటూ’ భయంతో అందులోని ఒక బ్లూపర్ని డిస్నీ పిక్చర్స్ తొలగించింది! హాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతున్నట్లుగా ఆ బ్లూపర్ ఉండడమే అందుకు కారణం. థియేటర్లో ఆడుతున్న సినిమాకు ఇంట్లోని వాళ్లంతా ఒకేసారి కలిసి వెళ్లేందుకు వీలు కాకపోవచ్చు. ఆఫీస్లు ఉంటాయి.. అలసిపోయి వస్తారు. స్కూళ్లు ఉంటాయి.. స్కూల్బ్యాగ్ నిండా చేయవలసిన హోమ్ వర్క్ ఉంటుంది. కాలేజీలు ఉంటాయి.. ఆ వయసు పిల్లల ఆసక్తులు కలివిడికి భిన్నంగా ఉంటాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల కన్నా ఎక్కువ.. ఇల్లు! ఎప్పుడూ తెమలని పని ఉంటుంది. సెలవురోజు అందరూ కలిసి వెళ్లడం కుదరొచ్చు కానీ, రాకరాక వచ్చిన సెలవుని బయటికి వెళ్లి వృధా చేసుకోవడం ఎందుకన్న ఆలోచన కూడా ఉంటుంది. అందుకే సెలవు రోజున ఇల్లంతా టీవీలో మళ్లీ మళ్లీ వస్తుండే హిట్ సినిమాకు (మోస్ట్లీ సినిమా) అంటుకుని ఉంటుంది. సోఫాలోనో, కుర్చీల్లోనో ఒకళ్ల మీద ఒకళ్లు పడుతూ సినిమా చూస్తుంటారు. అలా చూస్తున్నప్పుడు ఎవరో కనిపెడతారు.. ‘అరె! ఈ సీన్ లేదేమిటి?’ అని! ఆ సీన్ ఎందుకులేదో కనిపెట్టినవారు మౌనంగా ఉంటారు. థియేటర్లో చూసిన సినిమాల్లోని కొన్ని సీన్లు టీవీలో అందరూ కలిసి చూస్తున్నప్పుడు కట్ అయి ఉండటానికి కారణం.. ఇళ్లలోకి అలాంటి సీన్లు వెళ్ల కూడదని చానల్ వాళ్లు అనుకోవడం. డిస్నీ పిక్చర్స్ కూడా తాజాగా ఇళ్లకు విడుదల చేసిన వెర్షన్లోని ‘టాయ్ స్టోరీ 2’ చిత్రంలో ఒక ‘బ్లూపర్’ని తొలగించింది! ఇరవై ఏళ్ల నాటి ఆ చిత్రంలోని చిన్న ముక్కను డిస్నీ ఇప్పుడు తీసేయడం ఏమిటి? పైగా అది బ్లూపర్. సినిమాకు ఏమాత్రం సంబంధం లేనిది. షూటింగ్ జరుగుతున్నప్పుడు నవ్వు తెప్పించే తప్పులు కొన్ని జరుగుతుంటాయి. అవే బ్లూపర్స్. వాటిని సినిమా చివర్లో క్లోజింగ్ క్రెడిట్స్తో కలిపి ప్రేక్షకులకు కొసరు సినిమాగా చూపిస్తుంటారు. క్లోజింగ్ క్రెడిట్స్ అంటే స్క్రీన్పై నెమ్మదిగా పైకి జరుగుతూ కనిపించే తారాగణం తరహా వివరాలు. ఆ వివరాల్లోంచి ఆ బ్లూపర్ను తొలగించింది డిస్నీ. టాయ్ స్టోరీ సిరీస్లో ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు వచ్చాయి. టాయ్ స్టోరీ 4 గత నెలలో రిలీజ్ అయింది. మొదటి చిత్రం 1995లో వచ్చింది. రెండోది 1999లో. మూడోది 2010లో. ఈ సిరీస్ అన్నీ తయారవుతున్నది ‘పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్’లో. డిస్నీ 2006లో పిక్సర్ని కొనేసింది. తర్వాత నుంచి టాయ్ స్టోరీస్ని రెండు సంస్థలూ కలిసే నిర్మిస్తున్నాయి. కంప్యూటర్ ఏనిమేటెడ్ అడ్వంచర్ కామెడీ ఫిల్మ్స్ ఇవన్నీ. ‘పిక్సర్’ సంస్థకు ఓ అలవాటు ఉంది. ప్రతి సినిమాకూ కొన్ని బ్లూపర్స్ని జత చేస్తుంది. సరదాగా చూస్తారు కదా అని. అలాగే టాయ్ స్టోరీ 2 లోనూ ఒక బ్లూపర్ని చూపించింది. అయితే అది నిజమైన బ్లూపర్ కాదు. కల్పితం. పైగా ‘క్యాస్టింగ్ కౌచ్’ బ్లూపర్. అందులో ఒక ప్రొడ్యూసర్.. సినిమాల్లో నటించడానికి వచ్చిన బార్బీ డాల్స్లాంటి ఇద్దరు అమ్మాయిలతో.. ‘మీకు టాయ్ స్టోరీ 3లో చాన్స్ ఇప్పిస్తాను. యాక్టింగ్లో టిప్స్ కూడా. ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉంటాను సరేనా’ అంటాడు. అంటూ వారిలో ఒక అమ్మాయి చేతిని నిమురుతాడు. అతడి ఉద్దేశం అర్థమై ఆ ఇద్దరూ వెళ్లిపోతారు. ఈ ముక్కనే డిస్నీ ఇప్పుడు కట్ చేసింది. ఇంకా అలాంటి ముక్కలు సిరీస్లో ఎక్కడైనా ఉన్నాయేమోనని వెతికిస్తోంది. ఇంతగా డిస్నీ జాగ్రత్త పడడానికి కారణం.. అది ఫేక్ బ్లూపర్ అని కాదు. ‘మీటూ’ ఎఫెక్ట్! ఆ బ్లూపర్ని సెన్సార్ చెయ్యకుండా అలాగే ఉంచేస్తే హాలీవుడ్లో ‘క్యాస్టింగ్ కౌచ్’ (ఇవ్వడం కోసం పొందడం) ఉన్నమాట వాస్తమేనని అంగీకరించినట్లు అవుతుందని డిస్నీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఉండటం వేరు. ఉందని అంగీకరించడం వేరు. రెండేళ్లుగా ‘మీటూ’ ఉద్యమం హాలీవుడ్ను వణికిస్తోంది. పెద్ద పెద్ద వాళ్ల స్థానాలు మారిపోయాయి. ఎవరి కారణంగానైతే హాలీవుడ్లో ‘మీటూ’ రగులుకుందో ఆ మూవీ మొఘల్ హార్వీ వైన్స్టీన్పై వందకు పైగా కేసులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు ధారపోసి ఒక్కో కేసు నుంచి బెయిల్ తెచ్చుకుంటున్నారు ఆయన. చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉండగా చేసేసి ప్రాజెక్టుల్లోకి వెళ్లి చిక్కుకోవడం ఎందుకు అని డిస్నీ కూడా అనుకున్నట్లే ఉంది. అలా కాకున్నా ఆ పర్టిక్యులర్ బ్లూపర్ని తీసి పడేయడం అన్నది డిస్నీకి తప్పని నిర్ణయం. టాయ్ స్టోరీ 2 ని డైరెక్ట్ చేసింది జాన్ లస్సెటర్. ‘పిక్సర్ ఏనిమేషన్ స్టూడియోస్’కి కో–ఫౌండర్ కూడా. పిక్సర్ని డిస్నీ కలుపుకున్నాక గత ఏడాది చివరి వరకు వాల్ట్ డిస్నీ కంపెనీ యానిమేషన్ చీఫ్గా ఉన్నారు. ఇంకా ఉండేవారే. తన దగ్గర పని చేసే అమ్మాయిలతో ఆయన మిస్ బిహేవ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ‘‘నా మనసులో చెడేమీ లేకపోవచ్చు. కానీ అవతలి వాళ్లకు చెడు కనిపించినప్పుడు వాళ్లకు నేను క్షమాపణ చెప్పవలసిందే’ అని నోట్ పెట్టి మౌనంగా వెళ్లిపోయారు లస్సెటర్. ఈ మధ్య విడుదలైన టాయ్ స్టోరీ 4 కూడా వివాదాలకు అతీతంగా ఏమీ లేదు. ఆ సినిమాకు రైటర్గా పని చేస్తూ చేస్తూ ‘తాత్విక విభేదాలను’ కారణంగా చూపి మధ్యలోనే క్విట్ అయ్యారు రిషీదా జోన్స్. అసలు కారణం మాత్రం ఆడవాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై వివక్ష. టాయ్ స్టోరీ సిరీస్.. ‘పిక్సర్’కి, ‘డిస్నీ’కి మంచి పేరు తెస్తున్నాయి. పేరు మాత్రమే కాదు. కలెక్షన్లూ వస్తున్నాయి. రివ్యూలు సరేసరే. ‘సరిలేరు మీకెవ్వరూ’ అన్నదే ఎప్పుడూ విమర్శకుల మాట. ‘టాయ్ స్టోరీ’ సిరీస్ అన్నిటిలో.. మనుషులు ఉన్నప్పుడు బొమ్మలన్నీ జీవం లేనట్లుగా నటిస్తుంటాయి. ఆ టాయ్స్లా మగవాళ్లు ‘మీటూ’ ఉందని నటించే అవసరం రాకూడదనుకుంటే ఆడవాళ్లను బొమ్మల్లా ట్రీట్ చేయడం మానాలి. -
డ్యాన్స్ రూమ్
సాక్ష్యాధారాలు మరకల్లాంటివి. ఏళ్లు గడిచే కొద్దీ ఆనవాళ్లు లేకుండాపోతాయి. మనసుకు తగిలిన గాయం మచ్చలాంటిది. ఎన్నేళ్లు గడిచినా బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. తనుశ్రీదత్తా నానా పటేకర్పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసు తేలిపోయింది. పోలీసులే తేల్చేశారు! కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా కోర్టుకు ‘బి సమ్మరీ’ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బి సమ్మరీ రిపోర్టును ఇవ్వడం అంటే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దొరకలేదని చేతులు ఎత్తేయడం. ఇక కేసును కొట్టేయడమా, కొనసాగించడమా అన్నది కోర్టు పరిధిలోని విషయం. సాక్ష్యాధారాలను ‘సేకరించలేక పోయిన’ పోలీసులు 51 పేజీల బి సమ్మరీలో కొన్ని అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. మిస్అండర్స్టాండింగ్ కారణంగా, మలేషస్ ఇంటెంట్తోనూ తనుశ్రీ నానా పటేకర్ మీద కేసు పెట్టారట. అపార్థం కారణంగా, హాని తలపెట్టే ఉద్దేశంతో అని. నానా పటేకర్తో పాటు మరో ముగ్గురిపైన కూడా తనుశ్రీ కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ సమీ సిద్ధిక్, నిర్మాత రాకేశ్ సారంగ్. వీళ్లలో ప్రధాన నిందితుడు నానా పటేకర్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్స్ డ్యాన్స్ సీక్వెన్స్లో 2008 మార్చి 23–26 మధ్య.. సీన్ని అడ్డుపెట్టుకుని పటేకర్ తనను వేధించాడని, మిగతావాళ్లు అతడికి సహకరించారని తనుశ్రీ దత్తా ఫిర్యాదు. బి సమ్మరీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నిందితులంతా నిర్దోషులుగా విడుదల అవొచ్చు. అంతేకాదు, పోలీసులు తలచుకుంటే (పటేకర్ తలచుకుంటే అనాలి) రివర్స్లో తనుశ్రీ మీదే కేసు పెట్టొచ్చు. పటేకర్ గారి ప్రతిష్టకు ఆమె భంగం కలిగించిందని. తనుశ్రీ దత్తా పటేకర్ పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! తనుశ్రీ కేసు ఫైల్ చేసింది గత ఏడాది అక్టోబర్ 6న. ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది అక్టోబర్ 10న అందులో నానా అండ్ టీమ్పై ఆమె చేసిన ఆరోపణలు.. పదేళ్ల క్రితం జరిగిందని ఆమె చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించినవి. అప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేయకుండా ఏమీ లేరు. పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఫైల్ చేసిన బి సమ్మరీ ప్రకారం.. తనుశ్రీ మొదటే 2008 మార్చిలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుర్గావ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తను లైంగిక వేధింపుల కేసు పెడితే పోలీసులు దానిని వట్టి వేధింపుల కేసుగా నమోదు చేశారని కూడా అప్పట్లోనే ఆమె ఆరోపించారు. తర్వాత పదేళ్లకు.. గత ఏడాది అక్టోబర్లో ఒషివారా పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వివరాలన్నీ బి సమ్మరీలో పొందుపరుస్తూ.. ‘కనీసం పదమూడు మంది సాక్షుల్ని విచారిస్తే వాళ్లలో ఒక్కరు కూడా నానా పటేకర్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పోలీసులు. తనుశ్రీ ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం.. నిర్మాత, డైరెక్టర్ ఆమెకు మొదట చెప్పింది.. సోలో ఐటమ్ సాంగ్కు మాత్రమే ఆమె చెయ్యాల్సి ఉంటుందని. చేస్తాను కానీ, స్టెప్పులు అశ్లీలంగా ఉంటే తను చెయ్యనని ఆమె అన్నారు. అశ్లీలం మాత్రమే కాదు, తనకు అసౌకర్యంగా ఉండే మూవ్మెంట్స్ని ఇవ్వలేనని కూడా ముందే స్పష్టంగా చెప్పేశారు. వాళ్లు ఒప్పుకున్నారు. సాంగ్లో పటేకర్కు మాత్రం సింగిల్ లైన్ ఉంటుందనీ, అది కూడా వేరుగా షూట్ చేసుకుంటామని అన్నారు. అయితే పాట షూటింగ్ జరుగుతున్న నాలుగు రోజులూ నానా పటేకర్ సెట్స్ లోపలికి వచ్చి తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించే నెపంతో ఆమె ఒంటిని టచ్ చేస్తూనే ఉన్నాడు. అది బ్యాడ్ టచ్. అదంతా ఓ స్ట్రాటెజీతో జరుగుతోందని, మిగతావాళ్లు అతడికి సహకరిస్తున్నారని గ్రహించిన వెంటనే సెట్స్లోంచి బయటికి వెళ్లిపోయారు తనుశ్రీదత్తా. అయితే పటేకర్ అసలలా ప్రవర్తించనేలేదని జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన విషయానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు! డైసీ షా స్టేట్మెంట్ను కూడా వాళ్లు తీసుకున్నారు. డైసీ డ్యాన్సర్, మోడల్. తనుశ్రీ వయసే. ‘‘నానా పటేకర్కి పెద్దగా డ్యాన్స్ రాదు. స్టెప్పులు ఎలా వేయాలో నేను, నా మేల్ కొరియోగ్రాఫర్స్ ఆయనకు నేర్పిస్తున్నాం. మార్చి 26 ఉదయాన్నే పటేకర్ సెట్స్కి వచ్చేశారు. తనుశ్రీ మధ్యాహ్నం వచ్చారు. అందరు డ్యాన్సర్లు సెట్లో ఉన్నారు. పటేకర్ తనుశ్రీ వెనుక ఉన్నారు. హఠాత్తుగా తనుశ్రీ అగ్నిపర్వతమే అయ్యారు. విసురుగా బయటికి వెళ్లిపోయారు. ఏమైందో మాకెవరికీ తెలియదు. నిర్మాత, దర్శకుడు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. తన కారులో తను వెళ్లిపోయారు’’ అని డైసీ చెప్పారు. పటేకర్కి అనుకూలంగా ఉన్న ప్రతి పాయింట్నీ పోలీసులు శ్రద్ధగా నోట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే పటేకర్ బయటపడినట్లే. తనుశ్రీ బయటపడుతుందా అన్నది పటేకర్ దయాదాక్షిణ్యాలపై ఉంటుంది! తనుశ్రీ నానా పటేకర్పై తప్పుడు కేసు పెట్టారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కనుక పటేకర్ ఆమెను వేధించాలనుకుంటే తిరిగి ఆమె మీదే కేసు పడేలా పోలీసుల్ని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. నానా పటేకర్కు క్లీన్ చిట్ వచ్చిందన్న వార్త యు.ఎస్.లో ఉన్న తనుశ్రీకి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇండియాలోని ఆమె ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులు కేసు క్లోజ్ చెయ్యవచ్చు. కోర్టు కేస్ కొట్టేయవచ్చు. తను మాత్రం న్యాయపోరాటం చేస్తాననే అంటున్నారు తనుశ్రీ! దేవుడి నుంచి రావలసిన జడ్జ్మెంట్ ఇంకా మిగిలే ఉంది కదా అని ఆమె ఆశ. ఆమె ఆశ పెట్టుకున్న దేవుడు, ఆమె అప్లికేషన్ పెట్టుకున్న న్యాయదేవత.. ఆ ఇద్దరూ ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతున్నప్పటికీ పటేకర్పై తనుశ్రీ చేసిన ఆరోపణల్లో మాత్రం అబద్ధం లేదని.. డ్యాన్స్ రాని పటేకర్, డ్యాన్స్ నేర్పించడానికి తనుశ్రీ మీద చెయ్యి వెయ్యడాన్ని బట్టే స్పష్టం అవుతోంది. దీన్ని ఇంకో యాంగిల్లో చూసేవాళ్లూ ఉండొచ్చు. డ్యాన్స్ రాని పటేకర్ తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించడానికి ఎందుకు ట్రై చేస్తాడు, కేసు ఇక్కడే తేలిపోవడం లేదా అని! పళ్లు లేనివాడు కొరకలేడు నిజమే. పళ్లు లేనంత మాత్రాన కొరికే ఉద్దేశం లేకుండా పోతుందా? పాతికేళ్ల అమ్మాయి.. ఉద్దేశాలను గ్రహించలేకపోతుందా?! నానా పటేకర్, తనుశ్రీ దత్తా : సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తనుశ్రీ కేసును క్లోజ్ చేసేశారు. మరకల్లేవని మచ్చ కూడా లేకుండా పోతుందా? పటేకర్కి క్లీన్ చిట్ వచ్చిందని తనుశ్రీ పదేళ్ల ఆవేదన వట్టి అబద్ధమైపోతుందా? - మాధవ్ శింగరాజు -
మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు
సాక్షి, వాయనాడ్: మలయాళ నటుడు, దళిత కార్యకర్త వినాయగన్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సామాజిక కార్యకర్త మృదులాదేవి శశిధరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాయనాడ్ జిల్లాలోని కాల్పెట్టా పోలీస్ స్టేషన్ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ వేధింపులకు సంబంధించిన ఆడియో రికార్డును ఆమె పోలీసులకు అందించారు. వినాయగన్పై మీటూ ఆరోపణలు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. నటుడు వినాయకన్ తనను వేధించాడంటూ కేరకు చెందిన సోషల్ యాక్టవిస్ట్ మృదులాదేవి మొదట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. గతంలో మహిళా నటిని వేధింపులకు గురి చేసిన సంఘటనలో తీవ్రంగా స్పందించి, ఉద్యమానికి మద్దతు తెలిపిన వినాయగన్, తన వరకూ వచ్చేసరికి మాత్రం ఇందుకు భిన్నంగా, మృగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే ఆయనంటే గౌరవం పోయిందన్నారు. ఒక కార్యక్రమం నిమిత్తం వినాయగన్ను ఆహ్వానించేందుకు కాల్ చేసినపుడు ఫోన్లో తనతో అమర్యాదకరంగా చాలా అసభ్యంగా, మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా కోరడంతో పాటు, తన తల్లి కూడా తన కోరిక తీర్చాలన్నాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్ కూడా తన దగ్గర వుందని మృదులాదేవి చెప్పారు. అయితే అబద్ధం చెబుతోందని కొంతమంది నెటిజనులు సోషల్ మీడియాలో వాదనకు దిగడంతో ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కుల, మతపరమైన వివక్ష, దాడులకు తాను వ్యతిరేకమని చెప్పుకున్న మృదులా దేవి మహిళా నటికి మద్దతుగా నిలవడంతో వినాయగన్ వ్యక్తిత్వం తనకు ప్రేరణ నిచ్చిందని పేర్కొన్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం, ఆయనపై జరుగుతున్న కులపరమైన దాడిని తాను వ్యతిరేకించానని చెప్పారు. కాగా విశాల్, శ్రేయా జంటగా నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన నటుడే వినాయగన్. -
అందుకే నానాకు క్లీన్ చిట్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. దీంతో నానా పటేకర్కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి. నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు. -
కోరిక తీరిస్తే.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్సిస్తా
మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతమాత్రాన వేధింపులు ఆగుతున్నాయా అంటే చెప్పడం కష్టం. తాజాగా తనకు ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయాని.. డైరెక్టర్ కోరికలు తీరిస్తే సినిమాలో అవకాశం ఇస్తానన్నాడని ఓ వర్దమాన నటి తెలిపింది. కోలీవుడ్కు చెందిన నటి షమ్ము సోషల్మీడియాలో నెటిజన్లతో ముచ్చటించే క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కూడా మీటూ బాధితురాలినేని తెలిపింది. అయితే తాను ఇలాంటి వాటిపై ఎవరికీ ఫిర్యాదులు చేయనని, ఇచ్చినా కూడా ఏం లాభం ఉండదని, ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని బదులిచ్చింది. ఓ కొత్త దర్శకుడు తన కోరిక తీరిస్తే.. విజయ్ దేవరకొండతో తీసే చిత్రంలో అవకాశం ఇస్తానని అన్నాడని సూటిగా చెప్పేసింది. -
ఎంజే అక్బర్పై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్పై కోర్టులో ప్రశ్నల వర్షం కురిసింది. ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్లో జర్నలిస్ట్ రమణి సహా పలువురు మహిళలు అక్బర్పై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం ఆయన రమణిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో శనివారం కోర్టుకు హాజరైన అక్బర్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏషియన్ ఏజ్ పత్రికలో రమణి చేరిక, తదితర అంశాలపై ఆమె తరఫున సీనియర్ లాయర్ అక్బర్ను ప్రశ్నించారు. -
అక్కడా మీటూ కమిటీ
పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో మీటూ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప కాలంగా దక్షిణాదిలో నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద కలకలాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డిలాంటి కొందరు తారలు పరిశ్రమలోని ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ మధ్య నటి నయనతారపై సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి, అవి ఎంతతీవ్ర పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. అంతే కాదు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటి నయనతార తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాల్ కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోగలరా? అని దక్షిణ భారత నటీనటులు సంఘాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్సంఘం) మీటూ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాజర్ అధ్యక్షుడిగా వ్వవహరిస్తారు. కమిటీ సభ్యులుగా విశాల్, కార్తీ, పూచీ మురుగన్ నటీమణులు కుష్బు, రోహిణి, సుహాసినిలతో పాటు ఒక సామాజికవేత్త, న్యాయవాది అంటూ 8 మందిని నియమించారు. ఈ కమిటీ సినీరంగంలోని మహిళలకు రక్షణగా పని చేస్తుంది. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులే కారణం అని తెలిసింది. -
మాట వింటే దేవత.. మీటూ అంటే దెయ్యం
ఒక స్త్రీ.. పితృస్వామ్య సమాజం రూపొందించిన చట్రంలో ఇమిడిపోతే ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెను ఇంటికి దీపం అంటారు. అదే స్త్రీ తనకు తాను స్వతంత్ర అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో రాణిస్తుంటే దెయ్యం అనేస్తారు. మగ ఉద్యోగులు లేడీ బాస్లను భరించలేకపోవడానికి కారణం కూడా ఈ భావజాలమేనా? ‘ఎస్’ అంటున్నారు సుధా మీనన్. ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద గత నెలలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఒక చర్చాగోష్ఠి జరిగింది. మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారో తలుచుకుంటూ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది చర్చ. ప్రపంచంలో స్త్రీ– పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడా ఆచరణలో లేదని, అవకాశాల్లో అది ప్రతిబింబిస్తూనే ఉంటుందని, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడంలో మహిళలు ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం వల్లనే ఈ లక్ష్యాలు సాధ్యమయ్యాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుధా మీనన్ వంటి రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు కూడా. ఇదే సభలో ఒక వ్యక్తి లేచి ‘ఒక వైపు ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. మరోవైపు ‘ఉమెన్ ఆన్ టాప్’ అని చర్చా వేదికలూ మీరే నిర్వహిస్తారు. దీనిని ద్వంద్వ వైఖరిగా చూడవచ్చా?’ అనే ప్రశ్న లేవనెత్తాడు. దీని మీద హక్కుల కార్యకర్త వసంత కన్నభిరాన్ స్పందిస్తూ ‘‘అది ద్వంద్వ వైఖరి కాదు, అవి రెండూ రెండు వేర్వేరు కోణాలు మాత్రమే’’ అన్నారు. ‘‘మీటూ ఉద్యమం పట్ల మగవాళ్ల అసహనం ఇలా బయటపడుతోందంతే. మగ సమాజం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు బెంబేలు పడి వెనక్కిపోయే మహిళలకు ధైర్యం చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద చర్చ చాలా అవసరం’’ అన్నారామె. ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ‘ఉమెన్ ఆన్ టాప్’ చర్చలో భాగంగా సుధా మీనన్.. మహిళలకు ఎదురయ్యే అనేక సామాజిక పరిమితులను ప్రస్తావించారు. వాటన్నింటినీ అధిగమించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో మహిళలకు తానే చక్కటి నిదర్శనమని కూడా చెప్పారామె. ‘‘చిన్నప్పుడు నేను చాలా ముభావంగా ఉండేదాన్ని. నా భావాన్ని బయటకు చెప్పడం వచ్చేది కాదు. బాల్యం అంతా బిడియంతోనే గడిచింది. మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కళ్లలోకి చూడడానికి కూడా భయపడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని చెప్తుండేది. ఎందుకు? ఏమిటి? అని తెలియకపోయినప్పటికీ ఆమె మాటను పాటించడం ఒక్కటే నేను చేసింది. చదవడం వల్ల నాకు నా భావాలను వ్యక్తం చేయడానికి రచన అనే వేదిక దొరికింది. నేను రాసిన ఐదు రచనలకూ సమాజంలో స్త్రీనే ఇతివృత్తం. ఏదీ ఫిక్షన్ కాదు. ప్రతిదీ వాస్తవిక సంఘటనల ఆధారంగా మలిచిన కథనాలే. దశాబ్దాలు దాటినా ఆ రచనలు ఇప్పటికీ కాలదోషానికి గురికాలేదంటే... మన సమాజంలో మహిళ పట్ల మగవాళ్లు చూపిస్తున్న వివక్ష అలాగే ఉందని అర్థం. ఇప్పటికీ ఆడపిల్లలు తమ భావాలను మనసులో దాచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప వ్యక్తం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సమాజం ఒక లేబిల్ వేస్తుంది. ఆ లేబిల్ని భరిస్తూ జీవించాల్సి వస్తుందనే భయం. చెప్పినట్లు వింటే దేవత. వినకుంటే దెయ్యం. ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’లో అదే రాశాను’’ అని తెలిపారు సుధా మీనన్. సర్దుబాట్లు మహిళకే! ‘‘ఒక మగవాడు కెరీర్లో బిజీ అయితే ఆ ఇంట్లో అందరూ అతడికి సహకరిస్తారు. బంధువుల ఫంక్షన్లకు అతడు హాజరుకాలేకపోతే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ‘అతడి తీరికలేనితనాన్ని’ ఇంట్లో వాళ్లతోపాటు బంధువులు కూడా గౌరవిస్తారు. అదే ఒక మహిళ తన ఆఫీస్లో బాధ్యతల కారణంగా ‘ఫలానా ఫంక్షన్కి నేను రాలేను, మీరు వెళ్లండి’ అంటే ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. ‘ఎలాగోలా సర్దుబాటు చేసుకుని రావాలి’ అని ఒత్తిడి చేస్తారు. ఈ పరిస్థితి చూస్తూ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లలు తమ ఇష్టాలను, అభిప్రాయాలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఆడపిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణం కల్పించలేని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తనకేం కావాలో సమాజంలో మాత్రం నోరు ఎలా తెరవగలుగుతుంది’’ అని ప్రశ్నించారు సుధ. ‘సమాజంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే టాప్లో నిలవగలుగుతారు. టాప్లో నిలవడానికి చేస్తున్న ప్రయత్నంలో లోపం ఉండరాదు’ అన్నారామె. అదే సందర్భంలో వ్యక్తం అయిన ‘మీటూ ఉద్యమం – ఉమెన్ ఆన్ టాప్’ అంశాల పట్ల విశ్లేషణాత్మక వాదన కొనసాగింది. అంతిమంగా... ‘మీటూ అంటూ ఉద్యమించాల్సిన పరిస్థితులు సమాజంలో అడుగడుగునా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని పెద్ద స్థానాలను అధిరోహించిన మహిళలను గుర్తు చేసుకోవడం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమంలో బయటపడుతున్న భయానకమైన అనుభవాలను చూసి ఆడపిల్లలు చాలెంజింగ్ జాబ్స్లోకి రావడానికి జంకే ప్రమాదం ఉంటుంది. భయపడి దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిలబడాలని చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే చర్చ ఎప్పుడూ అవసరమే. మీటూ ఉన్నంతకాలం ఈ చర్చకు ప్రాసంగికత ఉంటూనే ఉంటుంది’ అనే ముగింపుతో గోష్ఠి ముగిసింది. మీటూపై పురుషుల అసహనం లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు రావడంతో ఎంతోమంది ప్రముఖుల ముసుగులు తొలిగాయి. ఇలా ఇంకా ఎన్ని తలలు రాలుతాయోననే భయం మగ సమాజాన్ని వెంటాడుతోందిప్పుడు. ఆ అభద్రతలో నుంచి వస్తున్న వితర్క వాదనలే ఇవన్నీ. ఆడవాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందేమిటి... అనే అసహనం కూడా పెరిగిపోతోంది. మహిళలు లక్ష్యాలను సాధిస్తున్నారు, టాప్లో నిలుస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కూడా అహం అడ్డు వస్తోంది. తనకు ఇంత వరకు తెలిసిన సమాజం తమకు ఫ్రెండ్లీగా ఉంది, ఇప్పుడు మహిళలు గళమెత్తితే వచ్చే మార్పు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అనే ఆందోళన మగవాళ్ల చేత ఇలా మాట్లాడిస్తోంది. చలనశీలి సుధా మీనన్.. బిజినెస్ జర్నలిస్టు, రచయిత, మోటివేషనల్ స్పీకర్. మహిళల్లో నాయకత్వ లక్షణాలు, స్త్రీ–పురుష వైవిధ్యతల ఆధారంగా కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో తలెత్తే అంశాలను చర్చించి పరిష్కరించడంలో ఆమె నిష్ణాతురాలు. నాన్ఫిక్షన్ రచనలు ఐదు చేశారు. అవి ‘ఫైస్టీ యట్ ఫిఫ్టీ’, ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’, ‘గిఫ్టెడ్: ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్’, ‘విరాసత్’, ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్’. వీటితోపాటు ఆమె ‘గెట్ రైటింగ్’, ‘రైటింగ్ విత్ ఉమెన్’ పేరుతో రైటింగ్ వర్క్షాపులు నిర్వహించారు. - వాకా మంజులారెడ్డి -
ఆత్మహత్య చేసుకోవాలనిపించింది
‘‘లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధితులకు మాత్రమే ఆ బాధ తెలుసు. ఎందుకంటే వాళ్లు భరించారు కాబట్టి. వాళ్లందరికీ నా సానుభూతి ఉంటుంది. ధైర్యంగా బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అభినందనీయం. అదే విధంగా చాలా చోట్ల ‘మీటూ’ను తప్పుగా ఉపయోగిస్తున్నారు’’ అని జయప్రద పేర్కొన్నారు. ఇటీవల ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జయప్రద తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. ► ‘‘మీటూ’ ఆరోపణల నిర్ధారణకు త్రీ బెంచ్ (ముగ్గురి కంటే ఎక్కువ న్యాయ నిర్ణేతలు న్యాయ విచారాన్ని జరిపించడం) విధానాన్ని పాటించాలి. ఆ విధానం ద్వారా తప్పొప్పులను, నిజానిజాలను కనుక్కోవచ్చు. అలా చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నాను. ► మన పురుషాధిక్య సమాజంలో రాజకీయ నాయకురాలిగా నిలబడటమంటే యుద్ధం చేయడమన్నట్టే. యంపీగా ఉన్నప్పటికీ నామీద యాసిడ్ అటాక్ చేస్తామంటూ రాజకీయ నాయకులు ఆజమ్ ఖాన్ బెదిరించేవారు. బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొస్తానో లేదో తెలియదు. మరుసటిరోజు బతికుంటానో లేదో కూడా డౌట్గానే ఉండేది. ► ఆ మధ్య నావి మార్ఫింగ్ చేసిన కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ సమయంలో నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కుడా వచ్చాయి. నాకు బ్రతకాలని అనిపించలేదు. అలాంటి కఠినమైన సందర్భాల్లో కూడా నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు. కేవలం అమర్ సింగ్ జీ మాత్రమే నాతో నిలబడ్డారు. ఆయన్ను నా గాడ్ ఫాదర్లా భావిస్తాను. అలాంటి సమయంలో సహాయంగా నిలబడ్డవాళ్లను అలానే భావిస్తాం కదా. మా గురించి ఏదేదో మాట్లాడుకునేవాళ్లు ఒకవేళ ఆయనకు నేను రాఖీ కట్టినప్పటికీ ఊరుకుంటారని నేననుకోను. ► ఆటోబయోగ్రఫీ రాసేంత ధైర్యం లేదనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా ఏదో నేర్చుకుంటూనే ఉన్నానని భావిస్తాను. ఆటోబయోగ్రఫీ రాయాలంటే ఇంకా చాలా సాధించాలి. నా అచీవ్మెంట్స్ నాకు గుర్తు లేవు. నా లైఫ్లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని భావించిన రోజు రాస్తాను. -
‘ఆ ఆరోపణలు అవాస్తవం అయితే..?!’
నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకడు రాజ్కుమార్ హిరాణీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం పోస్టర్ నుంచి రాజ్కుమార్ హిరాణీ పేరు తొలగించారు. అయితే మీటూ ఉద్యమం ప్రారంభం నుంచి బాధితులకు మద్దతు తెలిపిన సోనమ్ కపూర్ రాజ్కుమార్ హిరాణీ విషయంలో మాత్రం ఆయనకే మద్దతిస్తోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమంలో ప్రతి బాధితురాలిని నేను నమ్ముతాను. కానీ హిరాణీ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. హిరాణీ దర్శకునిగానే కాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు నా సినిమా కూడా నాకు ముఖ్యమే. సినిమా విడుదలయ్యాక దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ నేను ఒక్క విషయం అడగదల్చుకున్నాను.. హిరాణీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలితే అప్పుడేంటి పరిస్థితి. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటుంది’ అని తెలిపారు సోనమ్ కపూర్. హిరాణీ మీద వచ్చిన లైంగిక వేధింపలు ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కాక స్నేహితులు, పలువురు నటులు కూడా కొట్టిపారేస్తున్నారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్కుమార్కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. -
‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’
‘రాజ్కుమార్ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్కుమార్కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్ డైరెక్టర్పై లైంగిక ఆరోపణలు.. షాక్లో బాలీవుడ్!) రాజ్కుమార్ హిరాణీ -
‘15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు’
ముంబై: ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల హీరోయిన్ దియా మిర్జా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరగాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఈ వార్త విని చాలా బాధ పడ్డాను. 15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు. ఆయనను ఎంతో గౌరవిస్తాను. నేను పనిచేసిన వారిలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. పూర్తి వివరాలు తెలియకుండా దీని గురించి వ్యాఖ్యానించలేను. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు జరగాల’ని దియా మిర్జా అన్నారు. రాజ్కుమార్ హిరానీ తెరకెక్కించిన లగే రహో మున్నాభాయ్, సంజు సినిమాల్లో ఆమె నటించారు. హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తనను పలుమార్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బల్, సీనియర్ నటులు అలోక్నాథ్, నానాపటేకర్, సంగీత దర్శకుడు అనుమాలిక్ తదితరులు ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
కేసు కొట్టేశారు కానీ...
హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్స్టీన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు నటి యాష్లీ జడ్. ‘‘అవకాశం కావాలంటే అడిగినవాటికి అంగీకరించాలని పెట్టిన కండీషన్కి ఒప్పుకోలేదని తన స్టేటస్ని ఉపయోగించి జూడ్ ఇమేజ్ని చెడగొట్టి, హార్వీ అవకాశాలు తగ్గేలా చేశాడు’ అన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణ తర్వాత దాదాపు 80 మంది నటీమణులు వెయిన్స్టీన్ మీద లైంగిక ఆరోపణలు చేశారు. వెయిన్స్టీన్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ‘అడ్జస్ట్ మెంట్స్’ అన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎవ్వర్నీ కావాలని ఇబ్బందికి గురి చేయలేదని వెయిన్స్టీన్ వాదించారు. ఈ ఆరోపణలే ‘మీటూ’ ఉద్యమానికి కారణమయ్యాయి. 2017 చివరి నుంచి నడుస్తున్న ఓ కేసు తీర్పు ఇటీవల వెలువడింది. సరైన ఆధారాలను పొందుపరచని కారణంగా వెయిన్స్టీన్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది కాలిఫోర్నియా న్యాయస్థానం. లైంగిక వేధింపుల కేసు కొట్టిపారేసినా పరువు నష్టం దావా విషయంలో లీగల్గా ముందు వెళ్లొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంకా పలు కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వెయిన్స్టీన్. -
‘అందుకే దూరంగా ఉండాలనుకున్నాను’
అనుకోకుండా వచ్చిన స్టార్డమ్ నన్ను అణచివేసినట్లు అనిపించింది. అందుకే కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నాను అన్నారు విలక్షణ నటుడు అరవింద్ స్వామి. ‘రోజా’, ‘బాంబే’ వంటి చిత్రాల ద్వారా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారారు అరవింద్ స్వామి. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అరవింద స్వామి మణిరత్నం ‘కడలి’ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఇండియా టూడే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అరవింద్ తన రీల్, రియల్ లైఫ్ ప్రయణాల గురించి ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనుకోకుండా నటున్ని అయ్యాను. కానీ స్టార్డమ్ని కోరుకోలేదు. అదే వచ్చింది. నేను హీరోగా కంటే నటుడిగా గుర్తింపబడాలని కోరుకున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు డబ్బు కోసం మోడలింగ్ చేసేవాడిని.. ఆ తరువాత ప్రకటనలు. అప్పుడు నన్ను చూసిన మణిరత్నం నాకు దళపతి సినిమాలో అవకాశం ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు. కొనసాగిస్తూ.. ‘ఆ తరువాత వచ్చిన ‘రోజా’, ‘బాంబే’ సినిమాలు నాకు స్టార్డమ్ తీసుకొచ్చాయి. దీనివల్ల నా మీద ఒత్తిడి పెరిగింది.. నా ప్రైవసీని కూడా కోల్పోయాను. ఈ స్టార్డమ్ నన్ను అణచివేస్తున్నట్లు అనిపించింది. ఇదంతా నాకు కొత్తగా, చాలా ఇబ్బందిగా తోచింది. రోజా తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలనుకున్నాను. అమెరికా వెళ్లాను. ఆ తర్వాత బిజినేస్ ప్రారంభించాను. 2005లో దాన్ని వదిలేశాను. అప్పటికే నేను సింగిల్ పేరెంట్ని. నా పిల్లల కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. సరిగా అదే సమయంలో నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఇన్నీ జరిగాయి.. కానీ మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి తిరిగి రావాలని అనుకోలేద’ని తెలిపారు. ఆ సమయంలో మణిరత్నం మళ్లీ నన్ను ‘కడలి’ సినిమాకోసం పిలిపించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి మాట్లాడుతూ.. ‘నేను నటున్ని. నటించడం మాత్రమే నా పని. మరేందుకు నా నుంచి రాజకీయాలను ఆశిస్తున్నారు. నటుడిగా ఏదైనా అంశాన్ని వెలుగులోకి తేగలను.. కానీ దానికి పరిష్కారం చూపలేను కదా’ అన్నారు. మీటూ గురించి అడగ్గా.. ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి దీని గురించి మాట్లాడలేను అంటూ సమాధానమిచ్చారు. -
ప్రసారం సమాప్తం
ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్. రేడియో స్టేషన్లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్ సీజన్లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్సైడ్’ అనే ఆస్కార్ అవార్డు సాంగ్ను తమ ప్లే లిస్ట్లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి. కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్. రేడియో స్టేషన్ల నుంచి ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్సైడ్’ అనే హాలీడే సాంగ్ వినిపించిందంటే క్రిస్మస్ సీజన్ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్.ను చూసి కెనడా కూడా స్టాప్ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్లు 1944 నాటి ఆ క్లాసిక్ డ్యూయట్ను ఈ ‘మీటూ’ టైమ్లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. బ్రాడ్వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్ లోస్సర్ రాసిన ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్సైడ్’ ను 1949 హాలీవుడ్ మూవీ ‘నెప్ట్యూన్స్ డాటర్’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్ విలియమ్స్, రికార్డో మాంటల్బేన్ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆస్కార్ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్లు వచ్చాయి. మొన్న మొన్న ఆమెరికన్ గాయని లేడీ గాగా.. రివర్స్ వెర్షన్లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్సైడ్’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది. ఒరిజినల్ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు రెపరెపలాడుతోంది. ‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్ డైరెక్టర్ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు. పాట ‘కాల్ అండ్ రెస్పాన్స్’ స్టెయిల్లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్కి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్ అండ్ రెస్పాన్స్’ ఫార్మాట్. ఇప్పుడీ క్రిస్మస్ సాంగ్లో.. ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్సైడ్’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా. ‘ఐ రియల్లీ కాంట్ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్ కోల్డ్ ఔట్సైడ్’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్లో క్యాబ్లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు. ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్ ఇస్తుంటాడు. ఆ డ్రింక్ గ్లాస్ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్ అసాల్టే అది. అందుకే యు.ఎస్. రేడియో స్టేషన్లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి. రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్–అప్’ అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్ లోస్సర్ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్ థీమ్తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్ సాంగ్’ అయింది. పాట రచయిత ఫ్రాంక్ లోస్సర్ మాధవ్ శింగరాజు -
క్లీన్ చిట్
తనని లైంగికంగా వేధించాడంటూ మోడల్ కేట్ శర్మ దర్శకుడు సుభాష్ ఘాయ్పై ‘మీటూ’ ఆరోపణలు చేశారు. సుభాష్ ఘాయ్కు ముంబై పోలీస్లు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ విషయంపై సుభాష్ ఘాయ్ ఎటువంటి కామెంట్స్ చేయనప్పటికీ ఆయన సన్నిహితులు మాట్లాడుతూ –‘‘సుభాష్ ఈ ఆరోపణలకు చాలా బాధపడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. పోయిన పేరు, మర్యాద తిరిగి ఎలా వస్తాయి’’ అని ఆవేదనగా అన్నారు. ‘‘ఇచ్చిన కంప్లయింట్ అబద్ధం అని తేలినప్పుడు ఆరోపణలు జరిపిన వాళ్లను అరెస్ట్ చేయాలి’’ అని పేర్కొన్నారు వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల కేసుని కేట్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో ఎలాంటి ఆధారాలు లేవని సుభాష్పై కేసుని కోర్టు కొట్టివేసింది. -
పాడు చేతుల నుంచి కాపాడుకో
అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని దినదిన గండంగా మసులుకోవాలి? ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్ ఉద్యోగినులు మార్షల్ ఆర్ట్స్ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్చున్ కుంగ్ఫూ పేరొందింది. ఎందుకంటే... అన్నీ అనువైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం. మహిళల చేత.. మహిళల కోసం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్ చున్ కుంగ్ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్ మహిళ.. వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠవింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ... బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపి మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్ చున్ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు. శక్తి ప్రదర్శన కోసం కాదు ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్ వింగ్ చున్.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు. మగవాళ్లు / మహిళలు నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ నేర్పిస్తారు? స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జిఓ ‘స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్కి, ఎన్జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్లో శిక్షణా కేంద్రం స్థాపించింది. రెండేళ్లు సాధన... ► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది. ► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్ ఆర్ట్స్తో పోలిస్తే దీనిని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు. ► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్లో ఉన్న అందరూ దీన్ని సాధన చేయవచ్చు. ► శక్తి కన్నా స్ట్రక్చర్ని, వేగం కన్నా టైమింగ్ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం అవసరం ఉండదు. ► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు. ► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం. వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు – ఎస్.సత్యబాబు -
ఇల్లు చాలా డేంజర్
పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధిత మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది కూడా చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్ క్రైమ్ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో కలిసి పుట్టింటికి చేరుతున్నాయని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాయి. ఎందుకీ ప్రయత్నం? దేశాల కోసం. మరింత మెరుగైన నివారణ చర్యలు చేపడతాయేమోనని. ఎందుకీ ప్రయాస? మగాళ్ల కోసం. తప్పు తెలుసుకుని కాస్తయినా మారతారేమోనని! అయినా ఈ గృహహింసల్ని, గృహహింస మరణాల్ని లెక్కేయడం ఎలా సాధ్య మౌతుందనిపిస్తుంది. జనాభా లెక్కల వాళ్లయినా, ఇంటికొచ్చి తలుపు తట్టి ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడిగే కదా రాసుకుని వెళతారు. ఏదైనా అంతే. ఇళ్లు, కోళ్లు, కార్లు, స్టౌవ్లు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు.. ఏవైనా. ఇవన్నీ చూసి.. ఉన్నవాళ్లింతమంది, లేనివాళ్లింతమంది అని టిక్ చేసుకుని వెళతారు. ఉండీ లేనట్లు కనిపించేవాళ్లు లెక్కలకు అందరు. గృహబలిమిని ఇలా ఏదో ఒక స్కేల్లో లెక్కేయగలరు గానీ, ‘గృహబలుల్ని’ ఎలానూ లెక్కేయలేరు. భర్త, అత్తమామలు కొడుతున్నారని బాధితురాలు బయటికి రావాలి. భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని చనిపోయిన మహిళ అన్నో నాన్నో బయటికి రావాలి. వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. పోలీస్లు ఎఫ్.ఐ.ఆర్. రాయాలి. అప్పుడే ఐరాసకు గానీ, నేషనల్ క్రైమ్ బ్యూరోకి గానీ లెక్క అందుతుంది. ఆ లెక్కల్ని తక్కెడలో వేసి పోయినేడాది కంటే ఈ ఏడాది ఇంత హింస పెరిగిందనీ, లేదంటే ఇంత హింస తగ్గిందనీ, ఆ దేశం ఈ దేశం కంటే బెటరనీ, ఈ దేశం ఆ దేశం కంటే వరస్ట్ అనీ డేటాను విశ్లేషించి, విడుదల చేస్తారు. మరి విశ్లేషణకు అందని డేటా మాటేమి? నాలుగ్గోడల మధ్యే సమాధి అయిపోతుంది.. ఏనాటికీ గొంతెత్తని, గొంతెత్తే పరిస్థితే లేని అసహాయురాలైన మహిళలా! ఇల్లు చాలా డేంజర్. ఎందుకంటే.. నాలుగ్గోడల మధ్య స్త్రీకి రక్షణా ఉంటుంది, రక్షణ లేని విషయాన్ని బయటపడనివ్వని అడ్డూ ఉంటుంది. లోపల అమ్మాయి ఎలా ఉందో లోపలికి వెళ్లకుండా తెలుసుకోలేం. లోపలికి వెళ్లినా అమ్మాయి బయటపడకుంటే అప్పుడూ తెలుసుకోలేం. వెలుగులోనే ఎంత అంధకారం! ‘నా తల్లి నవ్వులో ఎన్ని వెన్నెల పువ్వులో’.. అనుకుంటూ ఆమె కోసం ఊర్నుంచి తెచ్చినవేవో ఇచ్చి, కడుపునిండా తృప్తితో అమ్మానాన్న తిరిగి బసెక్కడానికి వచ్చేస్తే.. వారితో పాటు అమ్మాయి ఆక్రందన బస్సువరకూ వినిపిస్తుందా? ఊహు! స్త్రీకి బయట ఏదైనా జరుగుతుంటే ఏ పుణ్యాత్ములైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఏ ధైర్యవంతులైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అడ్డుపడేవాళ్లు, పోలీసులకు ఫోన్ చేసేవాళ్లూ ఎవరూ లేకపోయినా ఆ మహిళ ప్రాణరక్షణ కోసం కనీసం పరుగెత్తిపోయే అవకాశమైనా ఉంటుంది.. రోడ్డు మీద నాలుగు గోడలు ఉండవు కాబట్టి. ఇల్లు అలాక్కాదు. ఇల్లు తప్పించుకుపోనివ్వదు. బైట గేట్లేసి ఉంటాయి. లోపల ఇంటి తలుపులు వేసి ఉంటాయి. వెనక దారి ఉంటే అవీ మూసి ఉంటాయి. ఇంకెక్కడికి తప్పించుకోవడం? హాల్లోంచి కిచెన్లోకి, కిచెన్లోంచి బాత్రూమ్లోకి, బాత్రూమ్లోంచి ఇంకో గదిలోకి, ఆ ఇంకో గదిలోంచి.. బెల్ట్ చేత్తో పట్టుకున్న వాడి దగ్గరకి, వాడి బెల్టు జారకుండా చేత్తో పట్టుకుని ఉన్న వారి దగ్గరికి, కొట్టీ కొట్టీ వాడు అలసిపోతే, వాడిని లేపి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గరికి! కొడుతున్న దెబ్బలు, పెడుతున్న పెడబొబ్బలు పక్కింటికైనా వినిపించవు. ఎవరి గృహహింస వారిదైపోయాక ఇంకేం పక్కిళ్లు! ఈ ఏడాది జూన్లో.. ‘స్త్రీకి ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్ కంట్రీ.. ఇండియా’ అని ఒక రిపోర్ట్ వచ్చింది. లండన్లోని ‘థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ ఇచ్చింది ఆ నివేదిక. ‘మీ కోడల్ని చంపుకుతింటున్నారటగా’ అని అడిగితే.. ‘అబ్బెబ్బే ఇంకెవరి కోడలి గురించైనా మీరు విని ఉంటారు’ అని భుజాలు తడుముకున్నట్లు.. ఇండియా వెంటనే ఖండించింది. ‘ఏ దేశాన్ని చూసి ఏ దేశం అనుకున్నారో..’ అని రాయిటర్స్ ఫౌండేషన్ మీద మన ఉమన్ డెవలప్మెంట్ శాఖలోని అధికారులు సెటైర్ వేశారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరో నివేదిక వచ్చింది. అదే.. ఐరాస వాళ్లది. మహిళకు ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్.. ఆమె ఇల్లేనట! మనదేశ మహిళకు అని కాదు. ఏ దేశంలోనైనా గృహమే మహిళకు నరక సీమ అని ఐక్యరాజ్య సమితి రూఢీ చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఎవరూ వ్యతిరేకించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు.. కొత్త విషయం ఏముంది ఇందులో అన్నట్లు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లపై హింస జరుగుతోంది’ అని న్యూయార్క్ నుంచి ఐరాస వచ్చి చెప్పాలా? ఇంటాయనకు తెలీదా! ఆయనకు సపోర్టుగా ఆమెను జుట్టు పట్టుకుని కొట్టే ఇంటి మనుషులకు తెలీదా? ఏమిటి దీనికి పరిష్కారం? ఇంట్లోంచి బయటికి వచ్చేయడం. ఒంటిపై.. కనిపించకుండా ఉండి, కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న గాయాలను బయటికి చూపించడం. స్త్రీ మాన మర్యాదల్ని భంగపరిచే ఇంటికి గౌరవం ఉన్నట్లు? దాన్ని దాచాల్సిన అవసరం ఏం ఉన్నట్లు? పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధితుల మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. లెక్కలు కాకుండా ఐరాస ఇంకా ఏం చెప్పింది? ► ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళల ‘గృహమరణాలను’ ప్రపంచ దేశాలు ఆపలేకపోతున్నాయి. ► 2012 నుంచి మహిళల గృహమరణాలు మరీ ఎక్కువయ్యాయి. మహిళల గృహమరణాలను తగ్గించడానికి, నిర్మూలించడానికి ఐరాసా ఏం చెయ్యాలంది? ► పోలీసు వ్యవస్థకు, నేర విచారణ వ్యవస్థకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలి. ► గృహమరణాల వెనుక ఏ విధమైన ఉద్దేశాలు ఉంటున్నాయో, వాటి మూల కారణాలేమిటో అధ్యయనం చేయాలి. ► గృహమరణాలను తగ్గించడానికి పురుషుల సహాయాన్నీ తీసుకోవాలి. పురుషాధిక్యం, స్రీవిధేయత అనే పూర్వపు భావజాలాలను మార్చే ప్రయత్నం చేయాలి. మన దేశంలో? మామూలే. డౌరీ డెత్స్. వరకట్న మరణాలు! ఇండియాలో సంభవిస్తున్న మహిళల గృహమరణాలలో ఎక్కువ భాగం వరకట్నం వేధింపుల వల్లనేనని యు.ఎన్.ఒ.డి.సి నివేదిక పేర్కొంది. ఇందుకోసం 2016 నాటి సర్వే వివరాలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ ఏడాది భారతదేశంలో మహిళల బలవన్మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ఇది.. మహిళల పాలిట నరక దేశాలని మనం భావిస్తున్న కెన్యా కంటే (2.6), టాంజానియా కంటే (2.5), అజర్బైజాన్ కంటే (1.8), జోర్డాన్ కంటే (0.8), తజికిస్తాన్ కంటే (0.4) ఎక్కువ! మరొక సంగతి. 15–45 ఏళ్ల మధ్య వయసులోని భారతీయ మహిళల్లో 33.5 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. మన దేశ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం ఏటా సంభవిస్తున్న మహిళల గృహ మరణాలలో 40 నుంచి 50 శాతం వరకు వరకట్నం వల్ల సంభవిస్తున్నవే. ప్రపంచవ్యాప్తంగా 2017లో బాలికలు, యువతులు, మహిళల బలవన్మరణాలు 50,000: భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో, చేతలవల్ల దుర్మరణం పాలైన మహిళల సంఖ్య. 17,000: పై యాభై వేలల్లో భర్త, లేదా పూర్వపు భర్త పెట్టిన భౌతికహింస తాళలేక దుర్మరణం చెందిన మహిళల సంఖ్య. 87,000: లైంగిక వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొత్తం మహిళలు, బాలికల సంఖ్య (పై 50 వేల మందితో కలిపి). 137: గృహహింస కారణంగా చనిపోతున్న మహిళల సంఖ్య.. రోజుకు. నివేదిక ఎవరిది? ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యు.ఎన్.ఒ.డి.సి) ఎప్పుడు విడుదలైంది? నవంబర్ 25న. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినం సందర్భంగా. ఎవరు ఎంత మూట కట్టుకున్నారు? ఆసియన్లు : 20,000 ఆఫ్రికన్లు : 19,000 అమెరికన్లు : 8,000 యూరోపియన్లు : 3,000 ఓషియానియన్లు : 300 ....................................................... లక్షకు మరణాల రేటు ఆఫ్రికా : 3.1 అమెరికా : 1.6 ఆసియా : 0.9 యూరప్ : 0.7 -
వినయ విధేయ
ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్నెససరీ కదా. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్! ఇంకొకరు.. తప్పుకుని, తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా, లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా?! చూసేదే ప్రపంచం. కనిపించేది కాదు. ప్రపంచాన్ని స్త్రీ ఒకలా చూస్తుంది. పురుషుడు ఒకలా చూస్తాడు. ప్రపంచానికి సొంతంగా ఓ షేప్ లేదా మరి? ఉంటుంది. అది ఏ షేప్లో ఉందన్నది మాత్రం స్త్రీ, పురుషులకు ఏ షేప్లో కనిపిస్తోందో అదే. అప్పుడు ఒకే ప్రపంచానికి రెండు షేప్లు అవ్వవా? అవుతాయి. అందుకే ఈ జెండర్ యుద్ధాలు. ‘బ్యాటిల్స్ ఆఫ్ సెక్సెస్’. ఇప్పుడు నడుస్తున్న బ్యాటిల్.. ‘మీ టూ’. చూడ్డంలో స్త్రీ కొంచెం పవర్ఫుల్. చూపు వెనుక చూపేమిటో కూడా ఆమె గ్రహించగలుగుతుంది. పురుషుడిలా ఆమె కూడా మనిషే కదా, ఎలా పురుషుడికన్నా ఆమె చూపు పవర్ఫుల్ అయింది? చాలా చూసింది కాబట్టి! స్త్రీ కూడా తనలా మనిషే అని పురుషుడు ఏ యుగంలోనూ అనుకోలేదు కాబట్టి. ‘ఆమె నన్ను ఎలా చూస్తే నేను అదే అయిపోతానా?’ అని పురుషుడి చికాకు. ‘అతడు నన్ను ఎలాగో లేకపోతే నేను అలా చూస్తానా?’ అని స్త్రీ సమాధానం. మళ్లీ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్. యుద్ధంలో కూడా మళ్లీ వైరుద్ధ్యం. పురుషుడు చికాకు పడతాడు. స్త్రీ సమాధానం చెబుతుంది. ఎందుకనంటే అధికుడిననుకుంటాడు పురుషుడు. అందుకని చికాకు పడతాడు. అర్థమయ్యేలా చెప్పాలనుకుంటుంది స్త్రీ. అందుకని సమాధానంతో సరిపెడుతుంది. ఇప్పుడు ఆమె చెబుతున్న సమాధానం.. ‘మీటూ’. కొద్దిగానైనా పురుషుడి చూపును మారుస్తోందా ‘మీ టూ’? పాపం.. ట్రై చేస్తున్నాడు మార్చుకోవాలని. సాటి మగవాళ్ల చూపును కూడా మార్చాలని చూస్తున్నాడు. ఆ చూడ్డం ఎలాగంటే.. ‘బాస్.. బీ డీసెంట్ టువర్డ్స్ హర్.. ఎందుకొచ్చిన షిట్’ అంటున్నాడు. అలాగా చూడ్డం! ‘మర్యాద కావాలా.. అయితే తీస్కో ఇస్తా’ అని పగబట్టినట్లుగానా చూడ్డం?! జపాన్ ప్రభుత్వం ‘మీ టూ’పై ఒక పోస్టర్ వేయించి, దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ పంపబోతోంది. అంతకన్నా ముందు శాంపిల్గా పోస్టర్ని ట్విట్టర్లో పెట్టి ‘హావ్వీజిట్?’ అంది. ఉద్దేశం ఏంటంటే.. ఆఫీస్లో ఎవరైనా ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తుంటే, ఆ వేధింపుల్ని ఆపే బాధ్యత మీదే అని. ‘మీదే’ అంటే పురుషులదే అని. ముల్లుతో ముల్లును తియ్యడం. అయితే ఈ ముల్లు మిస్ ఫైర్ అయి తిరిగి ప్రభుత్వం కాల్లోకే వెళ్లి గుచ్చుకుంది. ట్విట్టర్లో అంతా ఇన్ని తలంబ్రాలేస్తున్నారు. ‘మీ టూ’పై సెటైర్ వెయ్యడానికే ఈ పోస్టర్’ అనీ, మగబుద్ధికి ఇంతకన్న మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయనీ, లైంగికంగా వేధించేవాళ్లనే పోస్టర్ సపోర్ట్ చేస్తోందనీ, ఈ పోస్టర్ని తయారుచేసిన టీమ్లో ఏ దశలోనూ స్త్రీలు లేనట్లున్నారనీ, ఇదిగో.. ఇందుకే మన దగ్గర ఉమెన్ పొలిటీషియన్లు తక్కువనీ.. ట్వీట్ల వర్షం కురుస్తోంది. ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది జపాన్ క్యాబినెట్ ఆఫీస్. పోస్టర్లో జపాన్ నటుడు మికిహిసా అజుమా నోరు సగం తెరిచి, ఎంతో అమాయకంగా.. ‘ఇది కూడా సెక్సువల్ హెరాస్మెంటేనా?’ అని ప్రశ్నిస్తుంటాడు. వెనుక.. ఆయనవే రెండు చిన్న తలలు అటు, ఇటు ఉంటాయి. ఒక తల ఓరకంట తన సహోద్యోగిని చూస్తూ.. ‘‘నిన్నటి కన్నా మీరు అందం కనిపిస్తున్నారు. సన్నబడుతున్నారేమో కదా?’’ అంటుంటుంది. రెండో తల, ఇంకో ఉద్యోగిని వైపు చూస్తూ ‘‘ఇవాళ మీ డ్రెస్.. బాగుంది. నాకిలా ఉంటే ఇష్టం’’ అని చెబుతుంటుంది. ఆ కాంప్లిమెంట్లకు ఆ ఇద్దరు అమ్మాయిలు కోపంగా ఒకరు, ఇబ్బందిగా ఒకరు చూస్తుంటారు. పోస్టర్ అడుగున మళ్లీ మికిహిసా అజుమా ప్రత్యక్షం అవుతాడు. ‘ఇది కూడా సెక్సువల్ హెరాస్మెంటేనా?’ అనే ప్రశ్నకు.. ‘ఏది సెక్సువల్ హెరాస్మెంటో నిర్ణయించవలసింది నువ్వు కాదు’ అని అతడే కింద సమాధానం ఇస్తుంటాడు. చురుకైన సందేశం ఉంది. అర్థంకాకనో, మరీ ఎక్కువ అర్థం అవడం వల్లనో గురి తప్పింది. ‘నీ చూపు నీకు వేధింపులా ఉండకపోవచ్చు. ఆమె చూపుకు అది వేధింపులా అనిపించవచ్చు.వేధింపా కాదా అన్నది డిసైడ్ చెయ్యవలసింది మాత్రం నువ్వు కానే కాదు’ అని పోస్టర్ అర్థం. జపాన్లో ఏటా ‘వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్’పై క్యాంపెయిన్ జరుగుతుంటుంది. ఆ క్యాంపెయిన్ ఈ ఏడాది నవంబర్ 12 న మొదలైంది. 25 వరకు జరుగుతుంది. అందుకోసం వేసిన పోస్టరే ఇది. ‘మగవాళ్లూ అమాయకత్వం నటించకండి. మీ పక్కన ఉన్న మహిళను ఎవరైనా వేధిస్తుంటే చూస్తూ ఊరుకోకండి’ అని చెప్పడం కోసం చేయించిన ఈ పోస్టర్ను ఎవరెంత అర్థం చేసుకున్నా.. వెనక్కు తీసుకునేది లేదని ప్రధాని షింజో అబే చెబుతున్నారు. జపాన్లో ఉద్యోగాలకు వచ్చే మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో.. ఉమెన్ వర్క్ఫోర్స్ను పెంచడం కోసం ఆయన ‘ఉమెనామిక్స్’ అనే అత్యవసర విధానాన్ని నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారు. ‘మీ టూ’ మొదలయ్యాక ఆఫీస్లలో మహిళా ఉద్యోగులకు వేధింపులు తగ్గాయేమో కానీ, సాధింపులు ఎక్కువయ్యాయి. ఎమోషనల్ అత్యాచారాలు మొదలయ్యాయి. ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్నెససరీ కదా. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్! ఇంకొకరు, తప్పుకుని.. తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా! ‘సారీ, ఏదో ఆలోచిస్తూ మీ వైపు చూశాను. ఇదీ కూడా మీటూ కిందికే వస్తుందా?’ అని ఎక్స్ట్రాలు, ఎక్స్ట్రీమ్లు చేసేవాళ్లు కొందరు! ఆఫీస్లలో ఆడవాళ్లతో కాస్త మర్యాదగా ఉండండి అంటే.. ఈ అతిమర్యాదేంటి? అమర్యాద కన్నా హీనం అతిమర్యాద. బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్కి కూడా యుద్ధనీతి అనేది ఒకటి ఉంటుంది. పనిచేసే చోట దొంగ విధేయతలు, యుద్ధంలో దొంగచాటు సంధింపులు రెండూ ఒకటే. అన్ ఫెయిర్. ∙మాధవ్ శింగరాజు -
ఎట్టకేలకు అక్షయ్ సినిమా పూర్తైయింది!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్ఫుల్4 చిత్రం షూటింగ్ పూర్తైయింది. ఈ విషయాన్ని అక్షయ్కుమార్ సోషల్ మీడియాద్వారా ప్రకటించేశాడు. బాలీవుడ్లో చెలరేగిన మీటూ మంటలతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన నానా పటేకర్, దర్శకుడు సాజిద్ నదియావాలాపై మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. చిత్రయూనిట్ వీరిద్దరిని హౌస్ఫుల్4 నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. బాలీవుడ్లో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ చిత్రాల్లోంచి బహిష్కరించడం మొదలుపెట్టారు మేకర్స్. అయితే నానా పటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు. అయితే సాజిద్ నదియావాలాను బహిష్కరించినట్లు ప్రకటించినా.. మిగిలిన భాగాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రితేష్ దేశ్ముఖ్, కృతి సనన్, కృతి కుర్బంధ, పూజా హెగ్డేలు నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. While we have called it a 'wrap’ for #Housefull4, fun never ends..See you all in 2019!@Riteishd @kritisanon @kriti_official @thedeol @hegdepooja @RanaDaggubati @ChunkyThePanday @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/XVBV0uiio1 — Akshay Kumar (@akshaykumar) November 20, 2018 -
సింగర్ చిన్మయిపై వేటు : మీటూ ఎఫెక్ట్?
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఇండియాలో విస్తృతమైన ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా పేర్కొనదగిన వ్యక్తి. ముఖ్యంగా తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. తాజాగా తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనను డబ్బింగ్ యూనియన్నుంచి తొలగించారని ప్రకటించారు. అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్ త్రిషకు చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ఆమె ట్వీట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే డబ్బింగ్ యూనియన్ ద్వారానే తనపై తొలి వేటు తాను ముందే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు. తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన డబ్బింగ్ కరియర్ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్ 9న ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్ యూనియన్కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు. మరి ఇన్నిరోజులుగా పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.. కేవలం పేరున్న ఆర్టిస్ట్ అన్నగౌరవంతోనే ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు. కాగా సినీ నేపథ్యగాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సమంత, తమిళంలో త్రిషలాంటి హీరోయిన్లకు చిన్మయి తన గొంతును అరువిచ్చారు. వారి నటనకు చిన్మయి డబ్బింగ్ ప్రాణం పోసిందంటే అతిశయోక్తి కాదు. Sooo given to understand that I have been terminated from the dubbing union. Which means I can longer dub in Tamil films henceforth. The reason stated is that I haven’t paid ‘subscription fees’ for 2 years though this hasn’t stopped them from taking 10% off my dubbing income — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 I can see my Dubbing career go up in smoke now. He heads the dubbing union. — Chinmayi Sripaada (@Chinmayi) October 9, 2018 Anyway I always knew my career would be done with. Society is run by the powerful. The predators will NEVER be questioned. Neither will disciplinary action be taken against them. Fact that Mr Radha Ravi is still President of the Dubbing Union despite all the allegations https://t.co/gFrQJJuXIa — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 Wth!!! They cant do that to you!! This is ridiculous!! https://t.co/4IW4yLAwUC — Lakshmi Manchu (@LakshmiManchu) November 17, 2018 -
రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్
-
వైరల్: రాఖీ సావంత్ను ఎత్తి పడేసింది
ఎప్పుడూ ఎదో వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్గా వార్తల్లో నిలిచారు. వివాదస్పద సినిమాలతోనో, మాటలతోనో, డ్రెస్స్లతోనో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. పంజాబ్కు చెందిన ఓ మహిళా రెజ్లర్ సవాల్ విసరగా.. రాఖీ స్వీకరించారు. రింగ్లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన రెజ్లర్ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్లోని పంచకులలో ద గ్రేట్ ఖలీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ పోటీల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ రెజ్లింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. (నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు నానా పటేకర్పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, రాఖీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక రాఖీ కూడా అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. (‘నేను లెస్బియన్ని కాదు’) -
ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారు: నటి
తమిళసినిమా: ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారంటూ నటి రమ్యానంబీశన్ ఆవేదన వ్యక్తం చేసింది. కోలీవుడ్లో పిజా, సేతుపతి, మెర్కూరీ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ కేరళా బ్యూటీ తాజాగా నటించిన నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా విడుదలకు సిద్ధం అవుతోంది. మాతృభాషతో పాటు కన్నడంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికిప్పుడు మలయాళంలో అవకాశాలు రావడం లేదట. దీని గురించి రమ్యానంబీశన్ ఒక భేటీలో తెలుపుతూ ఇప్పుడు మహిళలకు మీటూ అనేది ఒక పెద్ద అలలా వెలుగులోకి వచ్చిందని అంది. అయితే దీని ఏడాది ముందే మలయాళ సినిమాకు చెందిన మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పింది. అయితే ఈ సంఘం ద్వారా నటీమణులు తమ సమస్యల గురించి న్యాయమైన రీతిలో ప్రశ్నించగా అలాంటి వారిని మాలీవుడ్ అవకాశాలు కల్పించకుండా పక్కన పెట్టేస్తోందని చెప్పింది. ఈ అమ్మడు కోలీవుడ్నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. రమ్యానంబీశన్ తాజాగా నటుడు విజయ్సేతుపతికి జంటగా నటించిన సీతకాది చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. -
అది అంగీకార సంబంధం కాదు
వాషింగ్టన్: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్ వాదనను ఆమె ఖండించారు. అక్బర్ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్ పోస్ట్కు ఓ కథానాన్ని రాశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. అక్బర్ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. -
అక్బర్పై మరో ‘మీ టూ’
వాషింగ్టన్: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్ పోస్ట్కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్ ఏజ్’లో చేరా. ఆ సమయంలో అక్బర్ ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి ఎడిటర్గా అక్బర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తా.. 1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్ హోటల్ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ‘ఓ సారి అసైన్మెంట్ నిమిత్తం జైపూర్కు వెళ్లా. అప్పటికే అక్కడ ఓ హోటల్లో ఉన్న అక్బర్ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’. బ్రిటన్, యూఎస్ పంపిస్తా.. 1994 డిసెంబర్లో ఎన్నికల కవరేజీపై అక్బర్ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ప్లేస్కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్లోని ‘డౌజోన్స్’ పత్రికలో చేరాను’ ప్రతిభతో ఎదిగా.. ‘ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్ వీక్, యూఎస్ఏ టుడే, అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. పరస్పర అంగీకారంతోనే: అక్బర్ పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు. -
గూగుల్కు ఉద్యోగుల షాక్
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. -
నిజానిదే గెలుపు
‘‘చదువుకునే రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి లేకపోతే మా నాన్నగారు తోటల్లో రెండు టమాటా పండ్లు కోసుకుని తిని, పరీక్షలకు వెళ్లిన రోజులు ఎవరికీ తెలియవు. కాలేజీ ఫీజు 150 రూపాయలు కట్టడానికి అప్పు కోసం ఎన్ని ఊళ్లు తిరిగి, ఎన్ని అవమానాలు భరించారో ఎవరికీ తెలియదు. హైస్కూల్కి వెళ్లేవరకూ కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయక వెళ్లి చదువుకున్న రోజులు తెలియవు. అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. ఒక్క ఫ్యాన్ వసతి కూడా లేని ఇంట్లో ఒకరు తమిళ టీచర్గా, ఒకరు కవిగా ఇద్దరు కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకోవడానికి పడిన తిప్పలు తెలియవు. ఒక మారుమూల గ్రామం నుంచి నగరానికి వచ్చి, దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఓ ప్రమఖుడిగా ఎదిగిన మా నాన్న గురించి ఈ ‘టెక్నాలజీ యువత’కు ఏం తెలుసు? ఎంతో ఎత్తుకి ఎదిగిన నాన్నగారి జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. ఆయన అందుకోని అవార్డులు లేవు. ప్రశంసలు లేవు. అలాంటి ఆయన కీర్తి ప్రతిష్టలకు మకిలి పట్టించడానికి ప్రయత్నిస్తున్నవారిని చూస్తే జాలిగా ఉంది’’ అని ‘నిజానిదే గెలుపు’ అంటూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనయుడు, రచయిత కబిలన్ ట్వీటర్లో ఓ సుదీర్ఘ లేఖను పొందుపరిచారు. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి దాదాపు 15 రోజులు పైనే అయింది. ‘‘ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడానికి కారణం ఇంత సుదీర్ఘంగా రాసే మానసిక స్థితి లేకపోవడమే’’ అన్నారు కబిలన్. ‘‘ఆధారాలు లేకుండా పురుషులను స్త్రీలు, స్త్రీలను పురుషులు నిందించడం అనే ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమైనది. మన దేశం ప్రధాన బలం మన కట్టుబాట్లు. అవి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొంతవరకూ మనల్ని కాపాడటానికి కారణమయ్యాయి. పాశ్చాత్య ప్రభావం మెల్లిగా మన కుటుంబ కట్టుబాట్ల నాశనానికి కారణమవుతోంది. మా నాన్నగారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం వెనక పొలిటికల్ ఎజెండా ఉందని కొందరు, అలాంటిదేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమన్నా చట్టపరమైన చర్యల ద్వారా న్యాయం జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఈ మొత్తం సమస్య (ఆరోపణలు) ఓ మెగా ఈవెంట్లా అయిపోయింది. అది మనల్ని దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తోంది. ‘మీటూ’ అంటూ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమం ఏ దిశలో వెళుతోందో చెప్పేంత పరిపక్వత నాకు లేదు’’ అంటూ పలు విషయాలు పంచుకున్నారు. ఈ ట్వీట్ని వైరముత్తు మరో కుమారుడు, కబిలన్ సోదరుడు మదన్ కార్కీ రీ–ట్వీట్ చేశారు. అయితే కబిలన్ ట్వీట్కి పలు విమర్శలు వచ్చాయి. ‘‘మా నాన్నగారు అన్ని కష్టాలు పడ్డారు.. ఇన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కానీ, మా నాన్న నిజాయితీపరుడు, మా అమ్మకు ద్రోహం చేయలేదు. ఏ అమ్మాయి దగ్గరా తప్పుగా ప్రవర్తించలేదని బలంగా చెబుతున్నాను అని మీరు చెప్పకపోవడానికి కారణం మీ మనసాక్షి ఒప్పుకోకపోవడమే’’ అని కొందరు విమర్శించారు. -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్లో కన్నడ స్క్రీన్ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్ప్లే రైటర్గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్మెంట్స్ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
#మీటూ ఎఫెక్ట్: రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
ఆ డైరెక్టర్ను చెప్పుతో కొట్టా : నటి
భారత్లో కూడా ‘మీటూ’ ఉద్యమం ఉధృతమైన వేళ క్యాస్టింగ్ కౌచ్కు గురైన పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ‘ఖుషీ’ సినిమా ఫేం ముంతాజ్ కూడా కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడిన తీరు గురించి చెప్పుకొచ్చారు. ‘అవును నాకు అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. నాతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టాను. ఈ విషయం నడిగర్ సంఘం దృష్టికి తీసుకువెళ్లాను కూడా. వాళ్లు నా సమస్యని పరిష్కరించారు. ఇది జరిగిన తర్వాత కూడా మరో దర్శకుడు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేసా. అంతే ఇక అప్పటి నుంచి నా జోలికి రాలేదు సరికదా.. ఎప్పుడైనా కన్పిస్తే రండి మేడమ్, కూర్చోండి, ఏం తీసుకుంటారు అని మరాద్యలు చేసేవాడని’ ముంతాజ్ వ్యాఖ్యానించారు. అయితే మీటూ ఉద్యమాన్ని ఫాలో అవుతున్నారా అడుగగా.. ‘ నిజానికి ఫాలో అవ్వడం లేదు. కానీ ఒకరు మంచి వాళ్లో, చెడ్డవాళ్లో నిర్ణయించే హక్కు మనకైతే లేదు. ఆరోపణలు వచ్చినపుడు బాధితులు, బాధ్యులు ఇద్దరూ మాట్లాడినపుడే ఫలితం ఉంటుంది. అంతేకానీ ఒకరి వర్షన్ గురించి మాత్రమే వినడం సబబు కాదని’ ముంతాజ్ అభిప్రాయపడ్డారు. కాగా ఎన్నో ప్రత్యేక గీతాల్లో నర్తించి గుర్తింపు పొందిన ముంతాజ్.. తాజాగా తమిళ బిగ్బాస్-2తో మరోసారి లైమ్లైట్లోకి వచ్చారు. -
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
మీటూపై స్పందించిన జగపతిబాబు
-
ఆ రంగాలను కుదిపేస్తోన్న ‘మీటూ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కర్ణాటక సంగీతం, భరత నాట్య రంగాలను కూడా కుదిపేస్తోంది. అసభ్యంగా తడమడం నుంచి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లైంగికంగా లొంగతీసుకోవడం వరకు పురుష పుంగవుల నుంచి అనుభవాలను ఎదుర్కొన్న వందల మంది కళాకారిణులు తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమంలో బాధితులంతా కలిసికట్టుగా ముందుకు రావాలంటూ దాదాపు 200 మంది కళాకారిణులు సంతకాలతో కూడిన ఓ ప్రకటనను కూడా మీడియాకు విడుదల చేశారు. ‘ఇటు కర్ణాటక సంగీతం, అటు భరత నాట్యంలోనూ మహిళలు, ముఖ్యంగా యువతులకు, టీనేజర్లకు విద్యను నేర్పేటప్పుడు గురువులు అసభ్యంగా తాకడం సర్వ సాధారణం. ఆధునిక ప్రపంచంలో సినిమా తారల స్థాయికి ఎదగాలంటే ఇలాంటి, అలాంటి భంగమల్లో నృత్యం చేయాలంటూ అసభ్య భంగిమలు పెట్టించేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా తాకడం కూడా మామూలే. మాస్టారు! దూరంగా ఉండి భంగిమల్ని చూపించమంటే...నృత్యం మీద దృష్టిని కేంద్రీకరించండంటూ మరీ గట్టిగా హత్తుకుంటారు. సంగీత మాస్టార్లు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారికి పడక సుఖం అందించకపోతే కర్ణాటక సంగీతంలో కరీర్ను దెబ్బతీస్తున్నారు. దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళా కళాకారుల ముందే బూతు జోకులు వేయడం, వేసుకోవడం, వెకిలి చేష్టలు చేయడం వారికి అలవాటు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒకే చోట విడిది చేస్తాం కనుక, మహిళల ముందే వారు కంప్యూటర్లలో, టీవీల్లో నీలి చిత్రాలు చూస్తారు. ఆడ, మగ పడుకోవడం, పడక సుఖాన్ని పంచుకోవడం చాలా సహజమైన విషయం అన్నట్లుగా మాట్లాడుతారు, కవ్వించేందుకు ప్రయత్నిస్తారు. నెత్తిన విభూతి బొట్టు, సిల్క్ పంచకట్టు మాటన తమ అసభ్య ప్రవర్తను దాచేందుకు గురువులు ప్రయత్నిస్తారు. తోటి మగ కళాకారుల నుంచి కూడా మాకు లైంగిక వేధింపులు ఉన్నాయి. అయితే అవి గురువుల స్థాయిలో లేవు. ఈ రెండు రంగాల్లో పురుషులది, అగ్రవర్ణాలదే ఆధిపత్యం కనుక వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సంగీత, భరత నాట్య రంగాలకు చెందిన పలువురు కళాకారిణులు వాపోయారు. వారు అకాశరామన్న ఖాతాల ద్వారా ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ల్లో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇంకా షేర్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ సాంస్కృతిక సంస్థ ‘ఏక్ పుత్లీ రేతి కీ’ ఈ నెల 21వ తేదీన, ఆదివారం చెన్నైలో ‘బహిరంగ విచారణ–సంప్రతింపులు’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆత్మవంచనా ప్రపంచాలే! శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ భరత నాట్యం రెండూ కూడా భారత్లో భయంకరమైన ఆత్మవంచనా ప్రపంచాలని ఓ సంగీత విద్వాంసుడి చేతుల్లో ఏడేళ్ల క్రితం లైంగిక దాడికి గురైన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో కళాకారిణి ఆరోపించారు. నుదుట విభూతి, సిల్కు పంచె, భక్తి మాటున దాగిన రాక్షసులు వీరని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘సైబర్ సెక్స్ నీకు ఇష్టమా ? అంటూ శిష్యురాళ్లను అడిగిన గురువులను కూడా చూశానని ఆమె చెప్పారు. తన కళ్ల ముందు తోటి కళాకారుడితో పడుకోవాలంటూ తన గురువు బలవంతం చేస్తున్నాడంటూ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ ఓ విద్యార్థిని ఏడుస్తూ వచ్చి తనను గట్టిగా వాటేసుకోవడం తనకు తెలుసునని ఆ కళాకారుణి చెప్పారు. ఇదంతా బహిరంగ రహస్యమే! భారత శాస్త్రీయ కళా రంగాల్లో లైంగిక వేధింపులనేవి బహిరంగ రహస్యమేనని ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, కాలమిస్టు టీఎం కృష్ణ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటి నుంచో గుసగుసలు, కబుర్లు వింటున్నాం. వీటి పట్ల నాతో సహా పలువురు కళాకారులు మౌనం పాటిస్తూ వచ్చాం. ఈ గొడవలు, సంబంధాలు వాటంతటవే సాధారణం కావాలని, సర్దుకుపోవాలని ఆశించామని ఆయన చెప్పారు. పైగా జరిగినదానికి తాము మహిళలనే దూషించామని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో మహిళల పక్షాన నిలబడలేక పోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ముందుగా మనం చేయాల్సిందిల్లా సంగీత విద్వాంసులను, గురువులను దైవ స్వరూపులుగా చూడడం, భావించడాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. ఈ రంగాల్లో పురుషాధిక్యం, అగ్రవర్ణాల ఆదిపత్యం కొనసాగుతుండడం వల్ల అధికారం, అహంకారంతో కూడా ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయని గాయకురాలు సుధా రఘునాథన్ అభిప్రాయపడ్డారు. ముందునుంచే తెలుసు: సింగర్ జయశ్రీ కర్ణాటక సంగీత రంగంలో లైంగిక దాడి, అనుచిత ప్రవర్తన ఉందనే విషయం ముందు నుంచే కర్ణాటక కమ్యూనిటీకి తెలుసని గాయకురాలు బాంబే జయశ్రీ చెప్పారు. కళాకారులుగా మేమంతా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్లమేనని అన్నారు. ‘మనమంతా వీటి గురించి మాట్లాడాలి. అందుకు స్పష్టత, ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఉందనే భావిస్తున్నాను. ఇందులో మన గురించే ఆలోచించరాదు. అందరి గురించి ఆలోచించాలి. ఆలోచించి అడుగేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
#మీటూ : ఎంజె అక్బర్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై వెల్లువెత్తిన ఉద్యమంలో మీటూలో కీలక అడుగు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు. పలు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించాయి. ముందుగా ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్ ద్వారా ఆరోపణల చేశారు. దీంతో అక్బర్ బాధితులు దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకే పదవి నుంచి తప్పుకున్నానని బుధవారం ఎంజేఅక్బర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ఈ సందర్భంగా అక్బర్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రియరమణిపై అక్బర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు, తక్షణమే మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బీజేపీ అనుబంధ సంస్థ శివసేన కూడా అక్బర్ వ్యవహారంపై మండిపడిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ఏమన్నారు? అటు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామాపై మీటూ ఉద్యమ ప్రధాన సారధి ప్రియా రమణి ట్విటర్లో స్పందించారు. ఆయన రాజీనామాతో మహిళలుగా విజయం సాధించాం. కోర్టులో కూడా న్యాయపరంగా విజయం సాధించే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. As women we feel vindicated by MJ Akbar’s resignation. I look forward to the day when I will also get justice in court #metoo — Priya Ramani (@priyaramani) October 17, 2018 -
మోదీ సర్కార్ తీరే వేరు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదు. ఎవరి నుంచి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా చర్య తీసుకోకుండా భీష్మించుకుని కూర్చోవాలన్నది మోదీ ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతలు తప్పుగా పేర్కొన్నారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. మోదీ ప్రభుత్వం ఆమెకే అండగా నిలిచింది. ఇతర కారణాల చేత ఆ తర్వాత ఆమె శాఖను మార్చారు. ఐపీఎల్ స్కామ్లో కూరుకుపోయిన లలిత్ మోదీ దేశం విడిచి పారిపోయేందుకు సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున ఆందోళన చేసినా వారిని మోదీ ప్రభుత్వం తొలగించలేదు. దేశంలోని బ్యాంకులకు 9,400 కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. పార్లమెంట్ ఆవరణలో జైట్లీని కలుసుకున్న విజయ్ మాల్యా ఆ రోజు సాయంత్రం లండన్ వెళుతున్నట్లు చెప్పినా, ఆయన్ని ఆపేందుకు జైట్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది తెల్సిందే. ఏబీవీపీ తరఫున పోటీ చేసి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షడిగా ఎన్నికైన అంకివ్ బైసో డిగ్రీ పట్టా నకిలీదని తేలినా ఆయనపై చర్య తీసుకోవడానికి బీజేపీ తిరస్కరించింది. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోదీపైనే పలు ఆరోపణలు వచ్చాయి. భార్యను వదిలిపెట్టిన ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బ్రహ్మచారిగా పేర్కొన్నారు. మోదీ ఎంఏ పూర్తి చేయకుండానే చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారన్నది వివాదాస్పదం అయింది. తనకన్నా వయస్సులో ఎంతో చిన్నదైన యువతిపై అధికార దుర్వినియోగానికి పాల్పడి నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు మోదీపై కొత్త కాదు. మంత్రులు రాజీనామా అవసరం లేదన్న రాజ్నాథ్ ‘మా మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇది వారి ప్రభుత్వం కాదు. ఇది ఎన్డీయే ప్రభుత్వం. విమర్శలకు తలొగ్గి రాజీనామాలకు, ఉద్వాసనలకు మేము పాల్పడం. అలా చేస్తే విమర్శలు వస్తూనే ఉంటాయి. రాజీనామాలు, ఉద్వాసనలు కొనసాగించాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం బలహీన పడుతుంది. ఈ విషయాన్ని మేము రెండో యూపీఏ ప్రభుత్వం నుంచే నేర్చుకున్నాం....’ అప్పట్లో వసుంధర రాజె, సుష్మా స్వరాజ్ల రాజీనామా డిమాండ్లపై స్పందిస్తూ రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలివి. యూపీఏ హయాంలో మంత్రులు రాజీనామా చేయలేదనా, చేసినందు వల్ల ప్రభుత్వం బలహీన పడిందన్నది ఆయన ఉద్దేశమా ? స్పష్టత లేదు. యూపీఏ హయాంలో తమపై వచ్చిన ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి నైతిక బాధ్యత వహించి పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామాల పర్వం లలిత మోదీ ఐపీఎల్ స్కామ్తోని అప్పటి విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్కు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతోని రాజీనామా చేయించింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కారణంగా కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఏ రాజా, జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ వీరభద్ర సింగ్, పర్యాటక శాఖ మంత్రి సుబోద్ కాంత్ సహాయ్, న్యాయ శాఖ మంత్రి అశ్వణి కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్లు రాజీనామాలు చేశారు. వారిలో కొంత మంది ఇప్పటికే కేసుల నుంచి నిర్దోషులుగా బయటకు రాగా, మరికొందరిపై కేసుల విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరికీ శిక్ష పడలేదు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ను తొలగించాల్సిందిగా ఆరెస్సెస్ అధిష్టానం నుంచి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంజె అక్బర్ ముస్లిం అయినందువల్లనే ఆరెస్సెస్ ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
33 శాతం పని మనుషులపై లైంగిక దాడులు
సాక్షి, న్యూఢిల్లీ : చలనచిత్ర పరిశ్రమ, జర్నలిజం, సాహిత్యం, సంగీతం, వాణిజ్యం, వాణిజ్య ప్రకటనలు, రాజకీయ రంగాల్లో విస్తరిస్తున్న ‘మీటూ’ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురయ్యో మహిళలు ముందుకొచ్చి పెట్టే కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ కేసులు భారీగా పెరిగాయి. 2014లో ఇలాంటి కేసులు 371 నమోదుకాగా, 2017లో 570 కేసులు నమోదయ్యాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నివేదిక తెలియజేస్తోంది. అంటే ఈ మూడేళ్ల కాలంలోనే ఇలాంటి కేసుల సంఖ్య 54 శాతం పెరిగింది. ఇక 2018, మొదటి ఏడు నెలల కాలంలోనే 533 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ పోలీసుల వద్ద నమోదైనవి. కంపెనీల వద్ద నమోదైన కేసులు ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. అయితే ‘మీటూ’ ఉద్యమం కారణంగా కంపెనీల వద్ద లైంగిక వేధింపుల కేసులు పెద్దగా పెరగలేదని 44 కంపెనీలకు సంబంధించి ‘నిఫ్టీ’ సమర్పించిన నివేదిక తెలయజేస్తోంది. 2017 సంవత్సరంలో 614 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 620 కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడిస్తోంది. లైంగిక వేధింపుల కేసులు తక్కువుంటే కంపెనీ వర్గాలను ప్రశంసించాలో, కేసులు ఎక్కువైతే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చారన్న కారణంగా ప్రశంసించాలో తెలియని మీమాంసలో కంపెనీలు పడిపోయానని, లైంగిక వేధింపులకు సంబంధించి న్యాయ సహాయం అందించే ‘కంప్లైకరో’ వ్యవస్థాపకులు విషాల్ కెడా తెలిపారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులను కంపెనీలు ఏర్పాటు చేసిన కమిటీలు ఎలా విచారిస్తున్నాయన్న అంశంపై ఢిల్లీ, నోయిడా, కోల్కతా, గురుగావ్ లాంటి నగరాల్లో సర్వే నిర్వహించగా 6,047 మంది పాల్గొన్నారు. వారిలో 67 శాతం ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం పది మందికి మించిన ఉద్యోగులుండే ప్రతి కంపెనీలో, సంస్థలో విధిగా ఓ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీలుండే కంపెనీల సంగతి పక్కన పెడితే, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలపై లైంగిక కేసులు ఎలా ఉంటున్నాయి? ముఖ్యంగా ఇంటి పనులు చేసే పని మనుషుల పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీ, ఢిల్లీ కాపిటల్ రీజియన్లో ‘మరాఠా ఫారెల్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ గత జూన్ నెలలో సర్వే నిర్వహించగా, 33 శాతం మంది పని మనుషులు లైంగిక వేధింపులకు గురైనట్లు తేలింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల్లో 29 శాతం కూలీలు, 23 శాతం పని మనుషులు, 16 శాతం చిన్న తరహా పరిశ్రమల కార్మికులు లైంగిక వేధింపులకు గురయ్యారని దారిద్య్ర నిర్మూలన కోసం కృషి చేస్తున్న ‘ఆక్స్ఫామ్’ అనే స్వచ్ఛంద సంస్థ 2012లో నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. ఇక వస్త్ర పరిశ్రమకు సంబంధించి 14 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయినట్లు గార్మెంట్ కార్మిక సంస్థ, స్వచ్ఛంద సంస్థ మున్నాడే 2015లో, ఒక్క బెంగళూరు నగరంలో నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించేందుకు ఎలాంటి కమిటీలు లేవని 75 శాతం మంది మహిళా వస్త్ర కార్మికులు తెలిపారు. కుటుంబాల్లో లైంగిక వేధింపులు ఇక ఇళ్లలో పదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడపిల్లలపై పది శాతం అత్యాచారాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి పిల్లల ఫండ్ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. వీటిలో 99 శాతం కేసులు నమోదు కావని తేల్చింది. కుటుంబ సభ్యులే ఈ అత్యాచారాలకు పాల్పడుతుండడం వల్ల కేసులు నమోదు కావడం లేదు. -
#మీటూ : పోరుకు సై, సత్యమే రక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ పేరుతో సాక్షాత్తూ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చేసి జర్నలిస్టు ప్రియా రమణికి దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులనుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా 97మంది లాయర్ల సహకారంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 14మందికిపైగా మహిళల ఆరోపణలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ పట్టించుకోలేదు. మంత్రిపై ఎలాంటి చర్యల్ని ప్రకటించలేదు. కనీస విచారణ చేపడతామన్న మాటకూడా మాట్లాడలేదనీ ఇది శోచనీయమని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అక్బర్ తీసుకున్న చర్య విస్తుగొల్పిందని దుయ్యపట్టారు. 14మంది మహిళలు ఆరోపణలు చేస్తే కేవలం ప్రియా రమణిపైనే ఎందుకు కేసులని కామిని జైశ్వాల్ ప్రశ్నించారు. దీని వెనుక పెద్దకుట్ర దాగా వుందని ఆరోపించారు. మరోవైపు పరువు నష్టం దావాపై ప్రియా రమణి కూడా ట్విటర్ లో స్పందించారు. దీనిపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమే తనకు రక్షణ అని పేర్కొన్నారు. అనేక మంది మహిళలు అతడిపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేవలం తనను మాత్రమే బెదిరించడం వేధింపుల ద్వారా వారి నోరు మూయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. పలు మహిళా జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశాయి. తక్షణమే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రియా మరణి రమణికి మద్దతుగా దేశాధ్యక్షుడు రామ్ నాద్ కోవింద్కు, ప్రధానమంత్రి నరేంద మోదీకి లేఖ రాస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అక్బర్ను పదవినుంచి తొలగించాలని, అలాగే రమణిపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి. మరోవైపు మనీ లైఫ్ ఇండియా మేగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సుచేతా దలాల్... ప్రియరమణితో పాటు 14మంది ఇతర జర్నలిస్టులు కూడా స్థైర్యం కోల్పోరాదని, ఖర్చులకు కూడా వెరువరాదని హితవు పలికారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలంటే ఆర్థికంగా కూడా ఎంతో భరించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రియా రమణి తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్లు చాలా మందే ఉన్నారని, అందుకయ్యే ఖర్చు కూడా తమ శక్తికొద్దీ భరిస్తామని సుచేతా దలాల్ ప్రతిపాదించడంతో... ఆ ట్వీట్ చాలా మంది ఫాలో అవుతూ తాము కూడా మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా పలు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై దాదాపు41 పేజీలతో పరువునష్టం దావావేశారు. కరాంజవాలా సంస్థలోని 97మంది లాయర్లు (30మంది మహిళా లాయర్లు) మద్దతుతో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావానునమోదు చేసిన సంగతి తెలిసిందే. Hey @priyaramani and all 14 who have spoke up. Let’s crowd fund your defence. I am sure may top lawyers will help you fight pro bono, but we at @MoneylifeIndia know there are lots of expenses involved! So think about it! Happy to support I am sure thousands of others will too! https://t.co/WmSnOfFKQy — Sucheta Dalal (@suchetadalal) October 15, 2018 My statement pic.twitter.com/1W7M2lDqPN — Priya Ramani (@priyaramani) October 15, 2018 -
మీటూ పేరుతో ఎవరూ ప్రచారం పొందాలనుకోరు!
సాక్షి, తమిళసినిమా : దేశంలో ఎక్కడ చూసినా #మీటూ ఉద్యమం గురించే చర్చ జరుగుతోంది. ఎంతోకాలంగా తమలో దాచుకున్న ఆవేదనను ఈ ఉద్యమం ద్వారా మహిళలు బయటపెడుతున్నారు. మృగాళ్ల వేధింపుల గురించి బయటి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మీటూ ఉద్యమంతో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక కేంద్ర మంత్రి సహా ఎంతోమంది ప్రముఖులు ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీటూ ఉద్యమానికి చాలామంది మద్దతుగా పలుకుతుండగా.. తాజాగా నటి కాజల్ అగర్వాల్ ఈ విషయంపై స్పందించారు. ‘ఇప్పుడు చాలామంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకు చెప్పే సాహసం చేస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఇలా ముందుకు వస్తున్న వారందరికీ నా అభినందనలు. వారందరికీ నా మద్దతు ఉంటుంది’ అని కాజల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో మహిళలు తమను తాము కాపాడుకోవడానికి ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు. పబ్లిసిటీ, ప్రచారం కోసం మహిళలు ఇలాంటివి విషయాలు మాట్లాడుతున్నారని కొందరు చేస్తున్న విమర్శలను కాజల్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రచారం కోసమే కొందరు మహిళలు ఇలా చేస్తున్నారంటూ మీటూ ఉద్యమాన్ని చిన్నబుచ్చవద్దని, ఇలా పేర్కొనడం ద్వారా మీ ఆలోచనస్థాయిని, ఉద్దేశాలను బయటపెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. -
#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!
ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్ నాథ్.. డిఫమేషన్ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..) కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకుంది. (చదవండి: ‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’) #AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToo pic.twitter.com/hSMwfsRdp1 — ANI (@ANI) October 15, 2018 -
#మీటూ : అశ్లీల చిత్రాలు చూపించబోయాడు
న్యూఢిల్లీ : దేశంలో 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ పరిశ్రమ, మీడియా, క్రీడా రంగాలతో పాటు తాజాగా రాజకీయ రంగాన్ని కూడా మీటూ ఉద్యమం కుదుపేస్తోంది. బాలీవుడ్, దక్షిణాది అనే తేడా లేకుండా ఇప్పటికే పలువురు ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మీటూ సెగ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ,బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌషల్కి తగిలింది. శ్యామ్ కౌశల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నమిత ప్రకాశ్ ఆరోపించారు. ‘మనోహరమ్ సిక్స్ ఫీట్ అండర్’, ‘అప్ తక్ చప్పాన్’ తదితర సినిమాలకు నమిత సహాయక దర్శకురాలిగా పనిచేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో శ్యామ్ తనను వేధించాడని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ‘2006లో ఓ సినిమా ఔట్డోర్ షూటింగ్కై కౌషల్తో వెళ్లాను. రాత్రి సమయంలో అతను మద్యం సేవిస్తున్నాడు. తనతో కలిసి మద్యం తాగమని నన్ను కోరారు. నేను తాగనని చెప్పి బయటకు వచ్చాను. అతను నా దగ్గరకి వచ్చి తన ఫోన్ తీసుకొని అశ్లీల చిత్రాలు చూపించబోయాడు. ఈ విషయం నిర్మాతకు తెలియజేశాను. వారు నాకు క్షమాపణ చెప్పారు కానీ అతనిపై చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి కౌశల్ను కలవలేదు. ఆయన షూటింగ్లో ఉంటే నేను రెస్ట్ తీసుకునేదాన్ని, పోరాట సన్నివేశాలు షూటింగ్ చేసే సమయంలో అక్కడికి వెళ్లకపోయేదాన్ని.అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేనూ కౌశల్కి దూరంగా ఉంటున్నాను’ అని నమిత పేర్కొంది. కాగా ఈ విషయంపై విక్కీ కానీ, శ్యామ్కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.( చదవండి : తనతో గడిపితే సూపర్స్టార్ను చేస్తానన్నాడు) మీటూ ఎఫెక్ట్: ఐటమ్ అవుట్ -
మీటూ: మరి నాకేమిస్తావని అదోరకంగా అడుగుతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.. పెళ్లి ఎందుకు చేసుకోవు?.....నాకే పెళ్లి కాకపోతేనా నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ని.. ఈ దుస్తుల్లో దుమ్మురేపుతున్నావు.. ఆహా! ఏం దుస్తులు, ఏం అందం, అదరగొడుతున్నావ్....నీవు వాడే పర్వ్యూమ్ ఏమిటీ, మత్తెక్కిస్తోంది!....నాతో పడుకుంటే నిన్ను స్టార్ను చేస్తా!......ఇలా మాటలతోని పొడవడమే కాకుండా చూపులతోనే బట్టలను చింపేసేలా చూస్తారట! వారెవరో కాదు, రాజకీయ నాయకులు, పోలీసు, పౌర ఉన్నతాధికారులు. వారి మాటలకు చూపులకు బలవుతున్నది బీట్ రిపోర్టర్లుగా టీవీల్లో, పత్రికల్లో పనిచేస్తున్నSమహిళా జర్నలిస్టులు. బీట్ రిపోర్టర్లు వార్తా సేకరణ కోసం పార్టీల నాయకులు, పోలీసు ఉన్నతధికారులు, పౌర ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినప్పుడు తమకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తోటి మీడియాతో పంచకున్నారు. ముఖ్యంగా పోలీసులు, ఆ తర్వాత పోలీసు అధికారుల నుంచే తమకు ఇలాంటి లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయని, పౌర ఉన్నతాధికారుల నుంచి తక్కువని ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు చెప్పారు. ఏదైన రహస్య సమాచారం లేదా జీవో కాపీలు కాఫాలన్నప్పుడు ఉన్నతాధికారులు ‘మరి నాకేమిస్తావు?’ అంటూ అదోరకంగా అడుగుతున్నారని అన్నారు. చాలా మంది మహిళా జర్నలిస్టులకు ఆఫీసుల్లో బాస్ నుంచి, తోటి జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతుంటే బీట్ జర్నలిస్టులకు విధి నిర్వహణలో కూడా ఇలా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయట. ఢిల్లీలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఓ రోజు ఆయన కార్యాలయంతో తనను గట్టిగా హత్తుకున్నారని, తాను ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చానని ఢిల్లీ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. సదరు అధికారి ఆ తర్వాత ‘భలే మత్తుగా ఉంది. నీవు వాడే పర్వ్యూమ్ ఏమిటీ?’ అంటూ సెల్ఫోన్ మెస్సేజ్ పంపించారని, ఆ తర్వాత ఆ అధికారిని తానెప్పుడు కలువలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మహిళా జర్నలిస్ట్ తెలిపారు. రాజకీయ నాయకులకంటే వారి సహాయకారుల నుంచి ఎక్కువ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని టీవీ ఛానల్ తరఫున ముంబైలో పనిచేస్తున్న పొలిటికల్ బీట్ రిపోర్టర్ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివద్ద పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అర్థరాత్రి ఫోన్చేసి ఏం చేస్తున్నావు? అంటూ మొదలుపెట్టి, నిద్ర పట్టడం లేదా? నేను రానా! అన్న వరకు మాట్లాడుతూ వేధిస్తాడట. తెల్లారి ఆయన కార్యాలయానికి వెళితే ఏం తెలియనట్లు మాట్లాడుతాడని ముంబై మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఇలా వేధింపులకు గురికావాల్సి వస్తోందని ఆమె ఎడిటర్కు ఫిర్యాదు చేస్తే ‘తెలివిగా తప్పించుకోవాలని లేదా సర్దుకు పోవాలి’ అని సలహాలు ఇస్తారట. కొందరు బీట్ మహిళా జర్నలిస్టులకు సొంత ఆఫీసులో, బయట విధి నిర్వహణలో, ఇతర మీడియా తరఫున వచ్చే మేల్ జర్నలిస్టులతో కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయట. ‘నాతో పడుకుంటే నిన్న స్టార్ను చేస్తా’ అని ఢిల్లీలోని ఓ హిందీ పత్రికలో క్రైమ్ బ్యూరో చీఫ్ తనను వేధించినట్లు అదే పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు లాంటి నగరాల్లో మహిళా రిపోర్టర్లను ఎవరిని కదలించినా ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరితోని లైంగిక వేధింపులు ఎదురయినట్లు చెబుతున్నారు. ఇదే విషయమై తమ ఆఫీసుల్లో ఫిర్యాదు చేస్తే తమను ‘ట్రబుల్ మేకర్స్’గా ముద్ర వేస్తున్నారని వారు వాపోతున్నారు. -
#మీటూ: బీసీసీఐ బాస్పై లైంగిక ఆరోపణలు
ముంబై : మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల చీకటి వ్యవహారాలు బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. రెండు రోజుల క్రితమే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, స్టార్ బౌలర్ లసిత్ మలింగాలు తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రి చీకటి కోణాన్ని ఓ మహిళా జర్నలిస్టు బయటపెట్టింది. తనను రాహుల్ జోహ్రి లైంగికంగా వేధించాడని, మంచిగా నటిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది. తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాహుల్ జోహ్రి బీసీసీఐ సీఈవో కాకముందు డిస్కవరీ చానల్లో పనిచేశారు. had emails sent about a BUNCH of head honchos in media. survivor has asked to not put out all the names. Rahul Johari, your #timesup #metoo pic.twitter.com/L78Ihkk1u0 — hk {on a hiatus} (@PedestrianPoet) October 12, 2018 -
#మీటూ : వింటా నందాపై పరువు నష్టం దావా
సాక్షి, ముంబై: మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న మహిళా బాధితులపై ఇక పరువునష్టం దావాల పర్వం మొదలైంది. తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడు అలోక్నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసినరచయిత ప్రొడ్యూసర్ వింటా నందాపై డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన అలోక్ నాథ్ ఇపుడికి చట్టపరంగా సవాల్కు దిగారు. కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. నటి తనూశీ దత్తా- నటుడు నానా పటేకర్ వివాదంతో మొదలైన మీట సెగ మీడియా, ఇతర రంగాల్లోని ‘పెద్దమనుషులను’ తాకింది. జర్నలిస్టు సంధ్యామీనన్, సింగర్ చిన్నయి శ్రీపాద తదితరులు రగిలించిన ఈ ఉద్యమం క్రమంగా రాజకీయాలతో పాటు అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కేంద్రమంతి ఎంజె అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్ఖాన్, సుభాయ్ ఘాయ్, కరీం మొరానీ రచయిత చేతన్ భగత్ , సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్.. క్రికెటర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచకుల జాబితా చాంతాండంత. -
#మీటూ: మహిళల రక్షణకు చట్టాలున్నాయ్
ఇండోర్: మహిళల రక్షణ కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉందని, కఠిన చట్టాలు కూడా ఉన్నాయని కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాజమాత విజయ రాజే సింధియా శతదినోత్సవం సందర్భంగానే బీజేపీ మీటూ ఉద్యమాన్ని బలపరుస్తాందా? అన్న విలేకురుల ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు. ‘మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ, కఠినమైన చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఏ మహిళకైన న్యాయపరంగా రక్షణ కావాలంటే వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా న్యాయస్థానాలను కూడ ఆశ్రయించవచ్చు.’ అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మైనర్ బాలికలను అత్యాచారం చేసిన నేరస్థులకు మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. అత్యాచార బాధితులకు సాధారణ జీవితం గడపడానికి తగిన సాయం అందుతుందన్నారు. లైంగిక నేరాలను పరిశీలిస్తే.. అవన్నీ తొలుత ఈవ్టీజింగ్తోనే ప్రారంభమవుతాయని, ఆ తర్వాత పెద్ద నేరాలకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు, లేక సోషల్ వర్కర్స్ కానీ ఈవ్టీజింగ్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీటూ ఉద్యమ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం స్మృతి ఇరానీ స్పందించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న ఆరోపణలపై అక్భర్ సమాధానం చెప్పాలన్నారు. అంతేకాక, లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మహిళా జర్నలిస్ట్లను ఆమె అభినందించారు. -
#మీటూ: చివరికి ఆపరేషన్ థియేటర్లో కూడా
బాధితుల ఆక్రోశంతో పెల్లుబుకిన మీటూ ఉద్యమంపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంప పెట్టులాంటి సంఘటన ఇది. వైద్యుడు దేవుడితో సమానమని నమ్ముతాం. అలాంటిది నిస్సహాయ స్థితిలో ఉన్నమహిళను ఒక లైంగిక వస్తువుగా పరిగణించిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరికమైన, ఘోరమైన ఘటనలను అసలు ఊహించలేం. కానీ బాధితురాలి ఆత్మక్షోభ సాక్షిగా, ఆసుపత్రి థియేటర్ సాక్షిగా చెప్పిన సంగతులు గుండెల్ని మండిస్తాయి. దీంతో మహిళలకు ఇక ఎక్కడ రక్షణ? వెలుగు చూడని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో? అనే ప్రశ్నలు ఉదయింకచమానవు మీటూ ఉద్యమానికి ప్రధాన సారధిగా నిలిచిన గాయని చిన్మయి శ్రీపాదకు ట్వీటర్ ద్వారా బాధితురాలి గోడు సారాంశం ఇది.. ఆపరేషన్ అనంతరం థియేటర్లోని బెడ్పై ఎనస్తీషియా ప్రభావంతో అపస్మారకంగా పడి వున్న ఆమెపై థియేటర్లోని జూనియర్ డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు. చుట్టూ చేరి వెకిలిగా నవ్వుకుంటుండగా .. ఆమెకు కొద్దిగా మెలకువ వచ్చింది...అయితే బలహీనత కారణంగా ఏమీ చేయలేకపోయినా.. ఆ భయంకరమైన అనుభవం తనను వెన్నాడుతోందని ఆమె ట్వీట్ చేశారు. అయితే హెల్యూషనేషన్( భ్రాంతి) అంటూ ఈ ఆరోపణలను కొట్టిపారేసిన డాక్టర్ను స్పందించాల్సిందిగా (ఇది భ్రాంతి ఏమాత్రం కాదు.. 2012 డిసెంబర్లో తనకెదురైన ఈ చేదు అనుభవంతోపాటు అసిస్టెంట్ డాక్టర్ ముఖం ఇప్పటికీ గుర్తు ఉందన్న బాధితురాలి ట్వీట్ ఆధారంగా) చిన్నయి ట్విటర్లో కోరారు. Sigh. Full patient account that a lot of doctors questioned. I requested the doctor who called this ‘hallucination’ to respond to this in public domain as well. pic.twitter.com/dRraEYvueA — Chinmayi Sripaada (@Chinmayi) October 12, 2018 -
#మీటూ: సలోని సంచలన ఆరోపణలు
ముంబై: భారత్లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో బాధితురాలు తమకు జరిగిన చేదు అనుభవాలను తెలుపుతూ పెద్ద మనుషులగా చెలామణి అవుతున్న ఒక్కోక్కరి వ్యక్తిత్వాలను బయట పెడ్తున్నారు. ఇలా నానా పటేకర్, వికాస్, అలోక్ నాథ్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్ల చీకటి వ్యవహరాలు వెలుగులోకి రాగా.. తాజాగా డైరెక్టర్ సాజిద్ ఖాన్పై బాలీవుడ్ నటి సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. 2011లో సాజిద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సలోని.. అది తన జీవితంలోనే ఓ భయంకరమైన అనుభవంగా అభివర్ణించింది. ఇంటర్వ్యూలోనే ‘స్వయం సంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?’ అనే అసభ్యకర ప్రశ్నలతో సాజిద్ తనపట్ల అమానుషంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తరువాత చుక్కలు చూపించాడని పేర్కొంది. తను డైరెక్టెర్ అసిస్టెంట్ను మాత్రమేనని, అసిస్టెంట్ డైరెక్టర్ను కాదని చెబుతుండేవాడని, బికీని ఫొటోలు అడిగేవాడని ఆరోపించింది. నటులు డ్రెస్ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక సాజిద్ఖాన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ జర్నలిస్టు సైతం ఆరోపించింది. ఇంటర్వ్యూలో అనవసరంగా అతని పురుషాంగం గురించి ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. ఇక మరో నటి రచెల్ వైట్ సైతం సాజీద్ ఖాన్ తనను లైంగికంగా వేదించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. అతన్ని తొలిసారి కలిసిప్పుడు తనని బట్టలు తీసేయమన్నాడని పేర్కొంది. I believe you @redheadchopra I was sent by my agency then to meet Sajid Khan during Humshakals. Right after my agency told me about the meeting Sajid called me within the next 5 mins and said the meeting would be at his house opp iskon Juhu. — Rachel White (@whitespeaking) October 11, 2018 షూటింగ్ రద్దు చేయండి: అక్షయ్ కుమార్ తను హీరోగా సాజీద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్ షూటింగ్ను నిలిపేయాలని అక్షయ్ కుమార్ చిత్ర నిర్మాతలక విజ్ఞప్తి చేశాడు. సాజీద్ ఖాన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్ మొదలు పెడుదామని ట్వీట్ చేశాడు. pic.twitter.com/deSRvNnkAA — Akshay Kumar (@akshaykumar) October 12, 2018 చదవండి: #మీటూ ఉద్యమ వార్తలు -
#మీటూ: టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పైత్యం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మీడియా రంగంలో మొదలైన మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్నిరంగాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. మీటూ ఉద్యమానికి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమ అనుభవాలను, క్షోభను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైంగిక వేధింపుల వేటగాళ్ల బారిన పడి విలవిల్లాడిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. వారు ధైర్యంగా ముందుకు వస్తున్న తీరు ప్రశంసనీయం. తాజాగా టాటా మోటార్స్లో వెలుగు చూసిన వేధింపుల పర్వంతో కార్పొరేట్ రంగాన్ని కూడా మీటూ సెగ తాకినట్టయింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఉదంతాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు సంధ్యామీనన్ మరో బాధితురాలి గోడును ట్విటర్ వేదికగా బయటపెట్టారు. టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేష్ రంగరాజన్ వక్రబుద్ధిని బాధితురాలు అందించిన ట్విటర్ సమాచారం ఆధారంగా బహిర్గతం చేశారు. ఆ స్క్రీన్ల షాట్లను ట్విటర్లో షేర్ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్ అతగాడిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్ కింద ఇంటికి పంపింది. ప్రతీ ఒక్కరికీ గౌరవనీయమైన సురక్షితమైన పనిపరిస్థితులను కల్పించేందుకు తామెపుడూ కృషి చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్పై తగిన చర్య తీసుకుంటామని వెల్లడించింది. I'm just so sad that young women still go through this every day. pic.twitter.com/rlTIt9VlP5 — Sandhya Menon (@TheRestlessQuil) October 11, 2018 In light of the enquiry by ICC, Suresh Rangarajan, has been asked to proceed on leave in order to allow for an objective enquiry to be completed as swiftly as possible. — Tata Motors (@TataMotors) October 11, 2018 -
#మీటూ : మలింగా నాతో అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్: మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల వ్యక్తిత్వం బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. నిన్ననే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్హోస్టెస్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ మరో స్టార్ క్రికెటర్ లసిత్ మలింగాపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల గొంతుకగా నిలుస్తున్న టాలీవుడ్ సింగర్ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును చిన్మయికి షేర్ చేయగా ఆమె ట్వీటర్ వేదికగా బయటి ప్రపంచానికి తెలియజేసింది. ‘కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్ సీజన్ కావడంతో శ్రీలంక ఫేమస్ క్రికెటర్ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే మలింగా తన రూంలో ఉందని చెప్పాడు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం వెనుక నుంచి నన్ను బెడ్పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్ రూంకు వెళ్లి నా ఫేస్ను కడుక్కున్నాను. హోటల్ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్ క్రికెటరని, కావాలనే ఇలాచేశావంటారని తెలిపారు’ అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది. Cricketer Lasith Malinga. pic.twitter.com/Y1lhbF5VSK — Chinmayi Sripaada (@Chinmayi) October 11, 2018 చదవండి: #మీటూ : ‘ఆ మాజీ క్రికెటర్ నీచుడు’ -
నో చెప్పడంతో మూడు చిత్రాలు కోల్పోయాను : అధితిరావ్
తమిళసినిమా: మణిరత్నం హీరోయిన్కు అడ్జెస్ట్మెంట్ వేధింపులు తప్పలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. మణిరత్నం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన నటి అధితిరావ్. ఇటీవల కూడా ఆయన దర్శకత్వంలో వహించిన సెక్క సివంద వానం చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం కల్పించారు. అలా గుర్తింపు తెచ్చుకున్న అధితిరావ్ తాజాగా ఉదయనిధిస్టాలిన్తో కలిసి ఒక నూతన చిత్రంలో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఇటీవల కాస్టింగ్ కౌచ్, ఇప్పుడు మీటు సంఘటనలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పుడు చాలా మంది తమకు జరిగిన లైంగికవేధింపుల సంఘటనల గురించి బయట ప్రపంచానికి చెప్పుకుని ఇన్నాళ్లూ తమ గుండెల్లో రగులుతున్న బడబాగ్నులను చల్లబరచుకుంటున్నారు. అదే విధంగా నటి అధితిరావ్ కూడా దీనిపై స్పందించి తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. అడ్జెస్ట్మెంట్కు నో చెప్పడంతో నేనూ మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. వారసుల కంటే సినీ నేపథ్యం లేని వారిని అవకాశాల కోసం పడక గది వేధింపులకు అధికంగా గురవుతున్నారని నేను చెప్పలేను గానీ, నా గురించి మాత్రం చెప్పగలను. కొత్తగా ఈ రంగానికి వచ్చే వారు లక్ష్యం దిశగా ముందుకెళ్లడం కష్టమే. అయితే అది అసాధ్యం కాదు. అందుకు ఉదాహరణ నేనే. అడ్జెస్ట్ కానందుకు అవకాశాలు తగ్గుతాయి. అయినా నా విధానాలను మార్చుకోలేదు. మొదట్లో చెడు అనుభవం ఎదురైంది. అడ్జెస్ట్మెంట్కు నో చెప్పడంతో మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయాను. గౌరవంగా జీవించాలన్నది లక్ష్యంగా జీవిస్తున్నాను. నాకు గౌరవ మర్యాదలే ముఖ్యం. అందుకు అవకాశాలు పోయినా పర్వాలేదు. అదే విధంగా మహిళలకు సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ సరైన భద్రత లేదు. అన్ని రంగాల్లోనూ విభిన్న వ్యక్తులు ఉంటారు. కొందరు మర్యాదగా నడుచుకుంటే, మరి కొందరు మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే. ఇకపోతే నేనెందుకు ఇంకా నంబర్ ఒన్ హీరోయిన్ను కాలేదని చాలా మంది అడుగుతున్నారు. అందుకు నా వద్ద సరైన సమాధానం లేదు గానీ, నాకు లభిస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను. నేను కొందరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించాను. దీంతో నంబర్వన్ నటిని కాలేకపోయానన్న బాధ ఏ కోశానా లేదు. కొందరు అధిక పారితోషాకం పొందడాన్ని విజయంగా భావిస్తారు. మరి కొందరు పలు అవార్డులను గెలుచుకోవడాన్ని సక్సెస్గా భావిస్తారు. ఇంకొందరు అధిక చిత్రాల్లో నటించడాన్ని విజయంగా భావిస్తారు. నేను మాత్రం ఒక పెద్ద దర్శకుడు నటించడానికి అవకాశం ఇస్తే గౌరవంగా భావిస్తాను. అదే నాకు విజయం అని అధితిరావ్ పేర్కొంది. -
#మీటూ: స్పందించిన వర్మ
ముంబై : ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమైన మీటూ ఉద్యమంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. బాలీవుడ్ నటుడు నానా పటెకర్పై నటి తనుశ్రీ దత్తా చేసి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. నానా పటేకర్ షార్ట్ టెంపర్ వ్యక్తి అని కానీ ఒకరిని వేధించాడంటే మాత్రం తను నమ్మనని యూట్యూబ్లో ఓ వీడియో ద్వారా స్పష్టం చేశాడు. వీడియోలో ఇంకా ఏమన్నాడంటే.. ‘సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అన్నవి వాస్తవమే. తనుశ్రీ దత్తా సహా పలువురు నటీమణులు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయం. తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో నాకు తెలియదు. నానా పటేకర్తో చాలాకాలం కలిసి పనిచేశాను. ఆయన షార్ట్ టెంపర్ వ్యక్తి. కానీ నాకు తెలిసి నానా పటేకర్ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే వ్యక్తి కాదు. ముంబైకి వెళ్లిన తొలి రోజుల్లో నేను ఓసారి నానాపటేకర్ కు ఫోన్ చేశాను. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేస్తే మనం వెంటనే హలో అంటాం. కానీ ఆయన మాత్రం చెప్పు (బోల్) అని ప్రారంభించారు. సార్ నా పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమా డైరెక్టర్ ను. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పాను. వెంటనే ఇంటికి వచ్చేయ్ అన్నారు. నేను కథ చెబుతుండగా టీ తాగుతావా?అని ఆయన అడిగారు. తాగుతానని చెగానే కిచెన్ చూపించి ఆయనకు కూడా తీసుకురమ్మన్నారు. నాకు టీ చేయడం రాదని చెప్పగానే, ఇంత వయసు వచ్చింది.. ఇంకా టీ చేయడం రాకపోవడం ఏంటి? అని మీ అమ్మకు ఫోన్ కలుపు అని బెదిరించారు. నా తల్లితోనూ ఫోన్ లో మాట్లాడారు. నానాపటేకర్ను అర్థం చేసుకుంటే ఆయన్ని అందరూ గౌరవిస్తారు. తనకు తెలిసి నానాపటేకర్ జీవితంలో ఎన్నడూ లైంగిక వేధింపులకు పాల్పడరు. ఆయన గురించి పూర్తిగా తెలియని వ్యక్తులే నానా ప్రవర్తనను పొరపాటుగా అర్థం చేసుకుని ఉండవచ్చు.’ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. దీంతో భారత్లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. &rel=0 -
‘మీ టూ’పై కేంద్రానికి మౌనమేలనోయి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మాజీ జర్నలిస్ట్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ తమపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నలుగురు మహిళలు చేసిన ఆరోపణలపై ఇప్పటికీ ఆయన మంత్రిత్వ శాఖగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీగానీ స్పందించక పోవడం విచిత్రం, విచారకరం. హాలివుడ్, బాలివుడ్ సినిమా రంగాలతోపాటు, మీడియా, కామెడీ, కళా, సాహిత్య రంగాలకు విస్తరించిన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సష్టిస్తున్న విషయం తెల్సిందే. ఎంజె అక్బర్తోపాటు మీడియా వ్యక్తులపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి మహిళలకు ఎడిటర్స్ గిల్డ్ మద్దతు ప్రకటించింది. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటూ సంబంధిత విభాగాలను కోరుతూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. బాలివుడ్ ప్రముఖ దర్శకుడు వికాస్ బహల్కు వ్యతిరేకంగా వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ది ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ ఆసోసియేషన్’ నోటీసు జారీ చేసింది. వికాస్ బహల్పై విచారణ జరిపేందుకు ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఫాంటమ్ ఫిల్మ్స్’లో విచారణ కమిటీ ఏర్పాటయింది. వికాస్ బహల్పై వచ్చిన లైంగిక ఆరోపణలు క్లియరయ్యేంత వరకు దూరంగా ఉంటానంటూ ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ)’కి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రాజీనామా చేశారు. ఆయన ఫాంటమ్ ఫిలిమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ఆల్ ఇండియా బకడ్’ గ్రూపు నుంచి లాన్మే భట్ తప్పుకున్నారు. తమలో ఫ్రీలాన్సర్గా కొనసాగుతున్న ఉత్సవ్ చక్రవర్తితో ఇక తమ గ్రూపుతో సంబంధాలు ఉండవని ఆల్ ఇండియా బకడ్ గ్రూప్ ప్రకటించింది. మలయాళి నటుడు, సిపీఎం శాసన సభ్యుడు ముకేశ్పై వచ్చిన లైంగిక వేధింపులపై ఇంతకాలం మౌనం పాటించిన సీపీఎం నాయకత్వం కూడా ఆయనపై విచారణకు సిద్ధమయింది. ఇలా అన్ని సంస్థల్లో వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు దాదాపు అన్ని సంస్థలు సిద్ధమయ్యాయి. అన్ని సంస్థలకన్నా అతిపెద్ద వ్యవస్థ కలిగిన కేంద్ర ప్రభుత్వం అందరికి ఆదర్శంగా ముందుండాల్సింది ఇలా మౌనం పాటిస్తే ఎలా! ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఉన్న చొరవ కేంద్రానికి లేదా? -
‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’
ముంబై : తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ ప్రముఖ నటుడు అలోక్నాథ్ రేప్ చేశాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అలోక్నాథ్ ఖండించారు. ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలను నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. అలా (రేప్) జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యలపై నేను అంతగా మాట్లాడకపోవడమే నాకు మంచిది. ఎక్కువగా మాట్లాడితే ఈ విషయం ఇంకా విస్తరిస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నేనో మంచి స్నేహితుడని చెప్పారు. కానీ ఇప్పుడు పెద్ద మాటలు అంటున్నారు. ఆమె ఆరోపణలపై స్పందించడమే ఓ పిచ్చి చర్య. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్ముతున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు. నేనేం సిగ్గుపడటం లేదు: వింటా నందా గతంలోను ఈ ఘటన గురించి మాట్లాడానని, అప్పుడు అలోక్నాథ్ తన వ్యాఖ్యలను ఖండించలేదని వింటా నందా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎలాంటి భయం లేకుండా ఉన్నాను. కానీ అతను మాత్రం భయపడుతున్నాడు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగుతాను. నేనేమి సిగ్గుపడటం లేదు. కానీ ఈ పని చేసినందుకు అతను సిగ్గుపడాలి.’ అని పేర్కొన్నారు. ఇక విటా నందా సుదీర్ఘమైన తన ఫేస్బుక్ పోస్ట్లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన అలోక్నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. అతనొక తాగుబోతు, దుర్మార్గుడని, కానీ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. చదవండి: #మీటూ: ప్రముఖ నటుడిపై రేప్ ఆరోపణలు -
'అతనో అమ్మాయిల పిచ్చోడు'
సినిమా: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం రగులుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకూ తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సుచీ లీక్స్ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్ లాంటి వారిపై రాస క్రీడ హింసలను బట్టబయలు చేసింది. ఈమె వ్యవహారం బాలీవుడ్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నానాపటేకర్పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మంటలు రగుతుండగానే మరో టాప్ హీరోయిన్ కంగనారనౌత్ మరో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి రాసక్రీడల చిట్టాను బయట పెట్టి కలకలం పుట్టిస్తోంది. కంగనారనౌత్ తమిళంలో దామ్ ధూమ్ చిత్రంలో నటించింది. తెలుగులోనూ ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్లో అగ్ర నటిగా రాణిస్తున్న ఈ జాన క్వీన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వికాశ్ పాహల్పైనే కంగనా లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. 2014లో క్వీన్లో నటిస్తున్నప్పుడే దర్శకుడు వికాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంగనా ఆరోపించింది. అదే విధంగా 2015లో బాంబే వెల్వెట్ చిత్ర ప్రచారంలో పాల్గొన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఒక యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారం అప్పట్లో వెలుగులోకి రాలేదు. ఇటీవల తనూశ్రీదత్తా నటుడు నానాపటేకర్ లైంగిక వేధింపుల గుట్టు రట్టు చేయడంతో ఇప్పుడు కంగనా తాను ఎదుర్కొన్న సెక్స్ వేధింపుల గురించి బయట పెట్టింది. దర్శకుడు వికాస్ నుంచి లైంగిక వేధింపులకు గురైన యువతికి తాను మద్దతుగా నిలిచానని కంగనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. కంగనా తెలుపుతూ ఆ యువతి చెప్పింది నేను పూర్తిగా నమ్మాను. 2014లో క్వీన్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు వికాస్ రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. ప్రతి రాత్రి విందు, వినోదాలు జరిగేవి. షూటింగ్ పూర్తి కాగానే నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. రోజూ షూటింగ్ పూర్తి కాగానే నేను దర్శకుడు వికాశ్ కలిసి హగ్ చేసుకునే వాళ్లం. అయితే అతను నా మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడు. అతని నుంచి విడిపించుకోవడాని చాలా బాధతో పోరాడాల్సి వచ్చేది. నువ్వు ఎలా గుభాళిస్తుంటావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటుండేవాడు. అతని ప్రవర్తనలో తప్పు ఉందని నేను చెప్పగలను. అంతే కాదు అతనో అమ్మాయిల పిచ్చోడు. -
#మీటూ: ప్రముఖ నటుడిపై రేప్ ఆరోపణలు
సాక్షి, ముంబై: బాలీవుడ్లో ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను సోషల్మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఈ కీచక పర్వంలో మరిన్ని చీకటి కోణాల్ని బహిర్గతం చేశారు. హృదయ విదారకమైన అనుభవాన్ని రెండు దశాబ్దాల తన మూగ వేదనను షేర్ చేశారు. ఇపుడు చాలామంది మహిళలు లైంగిక వేధింపులపై బయటికి వస్తున్నారు. 19ఏళ్లుగా నేను ఈ సమయంకోసం వేచి చూస్తున్నాను అంటూ ఫేస్బుక్లో భయంకరమైన విషయాలను వెల్లడించారు. సుదీర్ఘమైన తన ఫేస్బుక్ పోస్ట్లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన వ్యక్తి సినీ, టీవీ టెలివిజన్ నటుడు అలోక్నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని వింటా నందా ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో తారా (ఈ షో రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా) ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. ఆయనొక తాగుబోతు, దుర్మార్గుడు కానీ ప్రముఖ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. తాను మరింత నష్టపోయానంటూ ఆమె నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన వింటా ఇదే సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు. అలోక్నాథ్కు నోటీసులు మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సీఐఎన్టీఏఏ) అలోక్నాథ్కు నోటీసులు జారీ చేసింది. వింటా నందా ఆరోపణలపై వివరణ యివ్వాల్సిందిగా కోరింది.