పనులు త్వరగా పూర్తి చేయండి | Sakshi
Sakshi News home page

పనులు త్వరగా పూర్తి చేయండి

Published Fri, May 10 2024 11:50 PM

పనులు త్వరగా పూర్తి చేయండి

సోన్‌: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో గోవింద్‌ సూచించారు. సోన్‌ మండలం పాక్‌పట్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు, విద్యుత్‌ మరమ్మత్తు పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన పనులు ఎన్నికల అనంతరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్‌, ఏపీవో మంజులారెడ్డి, కార్యదర్శి సంధ్యారెడి, గోపిగౌడ్‌, అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్లు అనుప లక్ష్మి, కొమిరే స్వప్న ఉన్నారు.

Advertisement
 
Advertisement