నిన్న బీజేపీలోకి... నేడు బీఆర్ఎస్లోకి
సిరికొండ: న్యావనంది బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేంధర్రెడ్డి ఆదివారం ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా, తిరిగి సోమవారం మళ్లీ బీఆర్ఎస్లో చేరారు. నాయకులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాజన్న, రమేష్రెడ్డి, రాజేంధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
దాతలకు సన్మానం
సిరికొండ: మండలంలోని లొంక ఆలయంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నసత్రానికి సహకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. సభ్యులు బడాల సంతోష్, గంగాధర్, రాజ్కుమార్, భూపతిరాజ్, ప్రకాష్, శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రానికి తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
సిరికొండ/ధర్పల్లి: నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు సిరికొండ, ధర్పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. పార్టీ నేతలు వారిని ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలించారు.
ఆర్థికసాయం అందజేత
ఇందల్వాయి: గౌరారం గ్రామానికి చెందిన సంపంగి మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబానికి సోమవా రం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. గోదా స్వామి, సాయిలు, చిన్న గంగారాం, రాజమల్లు, బాలయ్య, ఉన్నారు.
వానరం, గోమాతకు అంత్యక్రియలు
సుభాష్నగర్: నగరంలోని గంగస్థాన్ ఫేజ్–1లో వానరం, గాయత్రినగర్లో గోమాత మృతిచెందింది. స్థానికులు సమాచారంతో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి ధాత్రిక రమేష్ అక్కడికి చేరుకొని, వాటికి సారంగాపూర్లోని శ్రీ గోశాలలో శాస్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గో సేవకులు సాకేత్, మిట్టపల్లి నరేష్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
సంక్షిప్తం