డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలు, రైతులను రెచ్చగొడుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు. ప్రజలు, రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని ఆయన తెలిపారు. మండలంలోని బీబీపూర్లో రాంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో, ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో డిచ్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. సన్న రకానికి రూ.500 బోనస్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీవో శ్రీనివాసరావు, సొసైటీ ఛైర్మన్లు రాంచందర్గౌడ్, గోవర్ధన్రెడ్డి, గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, కుమ్మరి చిన్న గంగారాం, కొరట్పల్లి ఆనంద్, న్యాస రాజేశ్వర్, కూరపాటి గంగాధర్, పొలసాని శ్రీనివాస్, తహసీల్దార్ ప్రభాకర్, ఏవో సుధామాధురి, ఆర్ఐ సంతోష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి: ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గన్నారం, చంద్రాయన్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గంగారెడ్డి, నవీన్గౌడ్, ఇమ్మడి గోపి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
కేంద్రాల ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment