
Memantha Sidham Day 13 Highlights CM Jagan Bus Yatra Details
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
- టీడీపీ, బీజేపీని వదిలి వైసీపిలో చేరిన కీలకమైన నేతలు
- తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు
- పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి
- ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ
- కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి
- కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి
- బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్
ధూళిపాళ్ల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
- సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విశేష స్పందన
- బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం
నేడు 13వ రోజు గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం
- సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం
కాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం
- ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం
- సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
- అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
- సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.
Day-13 గుంటూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024
ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం
- సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విశేష స్పందన
- టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు
- రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్ జగన్కు బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం
- నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
Comments
Please login to add a commentAdd a comment