యర్రగొండపాలెం: రాష్ట్రంపై పచ్చదండు కన్ను పడిందని, ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ దండును నమ్మితే ప్రజలను నట్టేట ముంచుతారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 46 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను అమలు చేసి కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. పచ్చదండు ఎప్పటికీ అధికారంలోకి రాదని, వారు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోనే అందుకు సాక్ష్యమన్నారు. అందరికీ మేలు చేసే జగనన్నను మరో సారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను గెలిపించాలని కోరారు. పెద్దారవీడు మండలం వైస్ ఎంపీపీ గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బత్తుల కాశయ్య, తాళ్ల బాలరాజు ఆధ్వర్యంలో డి.శ్యాం, డి.ఇస్సాక్, ఎం.మరియబాబు, ఎం.చంద్రయ్య, జి.ఆవులయ్య, ఏసేబు, డి.దానమయ్య, ఎస్.నాగరాజు, కె.పాపయ్య, డి.నాగయ్య, డి.డేవిడ్, జి.అమోస్, డి.వేదాంతం, ఎం.రాఘవ, డి.యోబు, డి.రాజేష్, డి.లూకయ్య, ఎం.నగేష్, ఎం.దావీదు, జోసఫ్, బుడ్డి, సీహెచ్ చిన్ని, యోహాను, ఇమ్మానియోలు, ఎం.శ్రీను, డి.పవన్కుమార్, డి.రవిప్రసాద్, కోనంగి శివరాజు, తాళ్ల శ్రీను, తాళ్ల సాయి, నల్లపాటి ఆదినారాయణ, డి.ఇస్సాక్, డి.చిన్న ఇస్సాక్, జి.శ్రీను, డి.సిద్దు, బి.చిన్న ఎల్లయ్య, బి.ఎల్లయ్య, డి.హసన్, డి.రాజావలి, డి.రసూల్, కె.గురవయ్య, బి.గురవయ్య, వి.రామారావు, పి.రామయ్య వైఎస్సార్ సీపీలో చేరారు.
వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి
తాటిపర్తి చంద్రశేఖర్