బత్తలపల్లి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) పొంది ఇతరులకు విక్రయించిన భూములను సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డితో కలిసి మండలంలోని పోట్లమర్రి గ్రామంలో పర్యటించారు. సర్వే నంబర్ 392–2లో ఫ్రీ హోల్డ్ భూమిని ఇతరులకు విక్రయించడంతో క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రెండో రోజు వీఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రీ వెరిఫికేషన్ చెక్ లిస్టులను పరిశీలించారు. చెక్ లిస్టులో చేయాల్సిన మార్పులు, చేర్పులను వివరించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన ఫ్రీ హోల్డ్ భూములన్నింటిపైన త్వరతగతిన రీ వెరిఫికేషన్ చేసి చెక్ లిస్టులను అందజేయాలని ఆదేశించారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఫ్రీ హోల్డ్ భూములను ఎవరైనా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అలాంటి వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీసీఎల్ఏ ఏసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. వీఆర్ఓలతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రీ వెరిఫికేషన్ చేసే సమయంలో ప్రత్యేక ఫారంలో వివరాలన్నింటినీ సవివరంగా నమోదు చేయాలని వీఆర్ఓలకు సూచించినట్లు వెల్లడించారు. అధికారుల వెంట ఇన్చార్జ్ తహసీల్దార్ నటరాజన్, సర్వేయర్ జోసఫ్, పలువురు వీఆర్ఓలు ఉన్నారు.
చెక్ లిస్టులో మార్పులు చేయాలని
సీసీఎల్ఏ ఏసీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment