పుట్టపర్తి అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం టంగుటూరి జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రకాశం పంతులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీ గుండుకు తన గుండెను చూపిన ధీశాలి టంగుటూరి అని కొనియాడారు. అనంతర కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. తన హయాంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆచరించాలన్నారు. ఆయన చరిత్రను విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్ఓ భాగ్యరేఖ, సీపీఓ విజయ్కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు శివరంగప్రసాద్, మోహన్రాం, నిర్మలాజ్యోతి, డ్వామా పీడీ విజయ ప్రసాద్ పాల్గొన్నారు.
టంగుటూరి జయంతి వేడుకల్లో
కలెక్టర్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment