పల్లెలను స్వచ్ఛతకు నిలయాలుగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

పల్లెలను స్వచ్ఛతకు నిలయాలుగా మార్చాలి

Published Thu, Oct 3 2024 1:14 AM | Last Updated on Thu, Oct 3 2024 1:14 AM

పల్లెలను స్వచ్ఛతకు నిలయాలుగా మార్చాలి

పుట్టపర్తి అర్బన్‌: ప్రతి పల్లెను స్వచ్ఛతకు నిలయంగా మార్చాలని, అదే బాపూజీకి మనమిచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అన్నారు. 16 రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవ’ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పెద్దన్న అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో కలెక్టర్‌ చేతన్‌ మాట్లాడారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలన్నారు. సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఉద్యమంలా చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలను ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు. పరిశుభ్రతపై ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలన్నారు. గ్రామాల్లో ఎక్కడా చెత్తదిబ్బలు లేకుండా చూడాలన్నారు. ఆయా ప్రాంతాలను చూడ చక్కని ప్రదేశాలుగా మలచి మొక్కలు నాటి సెల్ఫీ పాయింట్లుగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాలువలు, రోడ్లు, వీధులు శుభ్రం చేసిన సఫాయి మిత్రులను అందరూ గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 32 మండలాల్లోని పారిశుధ్య కార్మికులను, ముగ్గురు ఎంపీడీఓలను, ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను, కళాకారులను ఘనంగా సత్కరించి మెమొంటోలను అందజేశారు. అంతకుముందు గాంధీజీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని కలెక్టర్‌ చేతన్‌ ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జిల్లా పంచాయతీ అధికారి శివకుమారి, పశు సంవర్థక శాఖ జేడీ శుభదాస్‌, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, తహసీల్దార్‌ అనుపమ, ఎంపీడీఓ అశోక్‌కుమార్‌ రెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘స్వచ్ఛతా హీ సేవ’ ముగింపు సభలో

కలెక్టర్‌ చేతన్‌

గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రికి నివాళులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement