భువనగిరి : గ్లోబల్ ప్రాక్టీస్ ఫర్ హెల్త్, న్యూట్రిషన్ పాపులేషన్, సౌత్ ఏషియా ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను సందర్శించింది. డయాగ్నోస్టిక్ సెంటర్లోని పరికరాలు, వైద్య పరీక్షలు చేసే యంత్రాలు, పీహెచ్సీల నుంచి వస్తున్న రక్త నమూనాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, రక్త పరీక్షల రిపోర్టు రోగులకు చేరే విధానంపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల వైద్యులతో మాట్లాడారు.
ఫ రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా
ఫ డయాగ్నోస్టిక్ సెంటర్లో
పరికరాల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment