నల్లగొండ క్రైం: ముంబై పోలీసులు ఓ బాలికను రైల్లో సోమవారం విజయవాడకు తీసుకెళ్తుండగా.. నల్లగొండలో రైలు ఆగిన సమయంలో ఆమె రైలులో నుంచి దూకి పారిపోయింది. సదరు బాలిక అక్కడ నుంచి పారిపోయి నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలోని అంధుల పాఠశాల సమీపంలో తిరుగుతుండగా స్థానిక యువకులు గుర్తించి కాంగ్రెస్ నాయకుడు అల్లి సుభాష్యాదవ్ సమాచారం ఇచ్చారు. ఆయన బాలిక నుంచి వివరాలు రాబడుతుండగా.. రైల్లో నుంచి పారిపోయినట్లు తెలపడంతో వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించారు. సదరు బాలిక మానసిక స్థితి సరిగ్గా లేక ముంబైలో తిరుగుతుండగా జూలైలో అక్కడి శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు గుర్తించి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ బాలికను కుటుంబ సభ్యుల వివరాల గురించి ప్రశ్నించగా చెప్పలేకపోయింది. ఆమె తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా అని చెప్పడంతో మొదట బాలికను పోలీసులు కర్నూల్కు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి మిస్సింగ్ కేసులు, బాలిక చెప్పిన వివరాలు సరిపోలకపోవడంతో విజయవాడ చైల్డ్ కేర్ అఽధికారులకు అప్పగించేందుకు రైలులో తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గొల్లగూడ సమీపంలో తిరుగుతుండగా రైల్వే పోలీసులకు అప్పగించిన స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment