నాగారం : మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పాం పంట సాగు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి ప్రభుత్వం రూ.4200 చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇస్తుందని, గరిష్టంగా ఒక రైతుకు 12.50 ఎకరాల వరకు డ్రిప్ రాయితీ వర్తిస్తుందన్నారు. రుణమాఫీ కానీ రైతులు మండలంలోని వ్యవసాయ అధికారులకు, ఏఈఓలకు వివరాలు ఇచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి టి.నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారులు ఎం.మహేష్, ప్రమిత, మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్, ఆయిల్ సీడ్స్ ఆఫీసర్ శ్రీకాంత్, ఉద్యాన శాఖ సిబ్బంది నరహరి, నరేష్, పతంజలి ఆయిల్ పామ్ డీజీఎం యాదగిరి, మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, కరుణాకర్, రైతులు కమటం జయమ్మ, పిలిప్స్, రవీందర్, అశోక్ రెడ్డి, మల్యాల అశోక్, జలెండర్రెడ్డి, జగదీష్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment