నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాముల నిర్మాణాల కోసం రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు పెంచాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి కోరారు. శుక్రవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన నాబార్డు సమావేశానికి డీసీసీబీ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాబార్డు చైర్మన్ కేవీ.సాజి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుంభం మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులందరికీ సబ్సిడీలు సులభతరంగా అందేలా నాబార్డు పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని విన్నవించారు. నాబార్డుకు సబ్సిడీ పత్రాలను అప్లోడ్ చేయడానికి మొదట రుణ పంపిణీ తేదీని మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం ఇచ్చే పథకాలపై డీసీసీబీల సాయంతో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పప్పుధాన్యాల సేకరణ ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులను ప్రభుత్వానికి సరఫరా చేయడానికి డీసీసీబీల ద్వారా ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఉంటుందని వివరించారు.
ఫ నాబార్డు చైర్మన్ సాజికి
విన్నవించిన డీసీసీబీ చైర్మన్ కుంభం
Comments
Please login to add a commentAdd a comment