ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

Published Fri, May 10 2024 6:05 PM

ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

8లో

ఓట్ల పండక్కి ఆహ్వానం

మహారాణిపేట: ఎన్నికల పండగలో ఓటర్లు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఓటరు మహాశయులంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ మేరకు ఆహ్వాన పత్రికను ప్రచురించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నచ్చిన అభ్యర్థులను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఈ సారి జిల్లాలో పోలింగ్‌ శాతం పెంచేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పలు పద్ధతుల్లో ఓటర్లకు అవగాహన కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు, 5కె రన్‌, కరపత్రాల పంపిణీ, స్వీప్‌ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించింది.

Advertisement
 
Advertisement