నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Published Fri, May 24 2024 7:15 AM

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

వనపర్తి టౌన్‌: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ మద్దిలేటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సీఎస్‌, డీఓలను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు జనరల్‌ విద్యార్థులు 3,499, ఒకేషనల్‌లో 479 మొత్తం 3,978.. రెండో సంవత్సరం పరీక్షలు జనరల్‌ విద్యార్థులు 1,780, ఒకేషనల్‌లో 376 మొత్తం 2,156 మంది రాయనున్నట్లు వెల్లడించారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఐఈఓ మద్దిలేటి

Advertisement
 
Advertisement
 
Advertisement