కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి
కడియం కావ్య
మడికొండ: నిండు మనసుతో ఆశీర్వదించండి.. వరంగల్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. శనివారం మడికొండ ఆర్ఎన్ఆర్ గార్డెన్లో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యాన వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల బూత్ కమిటీలు, మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కర్పన్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా మడికొండ గ్రామానికి ఉన్న డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ఎంపీగా గెలిచిన వెంటనే కృషి చేస్తానని అన్నారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు.. రానున్న వారం రోజులు జరిగే ప్రచారం ఒక ఎత్తు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని అన్నారు. వర్ధన్నపేటలో భూకబ్జాలు చేసిన అరూరి రమేశ్ను గెలిపిస్తే ఉన్న భూములు కూడా లాగేసుకుంటాడని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దొమ్మాటి సాంబయ్య ప్రసంగించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, శేఖర్రావు, వెంకట్రెడ్డి, మన్నె బాబురావు, బైరి కొంరయ్య, లింగమూర్తి, పైడిపాల రఘుచందర్, ఎడబోయిన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.