రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

Published Wed, May 8 2024 6:50 AM

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

సంగెం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి సూచించారు. గవిచర్ల, చింతలపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరిపడా టార్పాలిన్‌ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాంటాలు అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లర్ల నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం 17 శాతం ఉండేలా ధాన్యాన్ని తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ డీఎం సంధ్యారాణి, ఏపీఎం కిషన్‌, సీసీలు రాజయ్య, ఏలియా, కమిటీ సభ్యులు అంబిక, రజియ, మంజుల, లక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

Advertisement
 
Advertisement
 
Advertisement