ఆత్మహత్యకు యత్నించిన చేనేత కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన చేనేత కార్మికుడి మృతి

Published Wed, May 8 2024 4:20 AM

ఆత్మహత్యకు యత్నించిన చేనేత కార్మికుడి మృతి

మదనపల్లె : చేనేత మగ్గం యజమాని వేధింపులతో కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మదనపల్లి పట్టణం చౌడేశ్వరి నగర్‌ లో నివాసమున్న రెడ్డప్ప కుమారుడు చల్ల అశోక్‌ బాబు (34), స్థానికుడైన ఎరుకులరెడ్డి వద్ద చేనేత కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య రెడ్డిరాణి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుంది. అశోక్‌ బాబు ప్రతిరోజు పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 30వ తేదీన చేనేత మగ్గాల యజమాని ఎరుకల రెడ్డి, అతని అనుచరులు చలపతి, రాజేష్‌, సుధా తదితరులు వ్యక్తిగత కారణాలతో అశోక్‌ బాబుపై దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. నువ్వు చావకపోతే మేమే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్‌ బాబు ఈనెల రెండో తేదీన ఇంటి వద్ద నిద్ర మాత్రలు మింగాడు. స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాధితున్ని తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. అశోక్‌ చిన్నాన్న వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సిఐ శేఖర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement