పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ప్రమాదం | accident at panjagutta flyover | Sakshi
Sakshi News home page

పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ప్రమాదం

Published Tue, Dec 26 2017 10:28 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accident at panjagutta flyover

హైదరాబాద్‌ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగింది.  ద్విచక్ర వాహనం పై  రాష్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో ప్లై ఓవర్ పై డివైడర్‌ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అనిష్ భార్గవ్ (20)  అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు వంశీ(19) గాయాల పాలయ్యాడు. మద్యం మత్తులో ఉండడం , అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్థానిక సీఐ రవీందర్ యువకులను హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement