
శ్రావణి(ఫైల్)
అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుధీర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్గూడ, శ్రీకృష్ణానగర్కు చెందిన మల్లె రాజ్యలక్ష్మి, రమణయ్య దంపతుల కుమార్తె శ్రావణి(21) ఈ నెల 1న రాత్రి తన గదిలో నిద్రకు ఉపక్రమించింది. ఉదయం ఆమె గదిలో కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.