Sravani
-
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
ఇసుక తరలిస్తా.. అడ్డుకోవద్దు!
శింగనమల: ‘నేను టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి కుడి భుజం. ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఆ ఇసుక తోలుతున్నాం. అడ్డుకుంటే ఇక నీ ఇష్టం...’ అంటూ ఓ టీడీపీ నాయకుడు... వీఆర్వోను బెదిరించాడు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బాధిత వీఆర్వో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు... అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకంచెర్వు–కొరివిపల్లి మార్గంలోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజులుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి టీడీపీ నాయకులు నిల్వ చేసిన ఇసుక డంప్లను సీజ్ చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు అప్పగించారు. అయితే, సీజ్ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల 12న టీడీపీ నాయకులు జేసీబీ, టిప్పరుతో రాగా, వీఆర్వో అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీఆర్వోకు నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్ ఫోన్ చేసి రెచ్చిపోయాడు. ‘ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఇసుక తోలుతున్నాం. సీఐకి కూడా ముందే చెప్పాం. సీజ్ చేసిన ఇసుకను తరలించి తీరుతాం. ఎమ్మెల్యే చెప్పినా లెక్క లేదా? రాత్రికి వచ్చి ఇసుక తరలిస్తాం..’ అని బెదిరించాడు. ‘సీజ్ చేసిన ఇసుకను తరలించడం తప్పు కదా అన్నా’ అని వీఆర్వో చెప్పగా... ‘ఎలా తప్పవుతుంది..? ఈ మాటలన్నీ రికార్డు చేసుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు...’ అంటూ నరసింహ యాదవ్ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో భయాందోళనలకు గురైన వీఆర్వో నాగేంద్ర మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసింహ యాదవ్పై కేసు నమోదు చేశారు. -
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం
-
బండారు శ్రావణిపై పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు విలేకరి బాలమురళీధర్ మంగళవారం ఫిర్యాదు చేశారు. శింగనమలలో ఇసుక అక్రమ రవాణాపై వార్తలు ప్రచురించడంతో తనపై బండారు శ్రావణి వర్గీయులు కక్ష కట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో నగరంలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని, ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనను పరుష పదజాలంతో దూషిస్తూ ఎమ్మెల్యే అనుచరుడు బాబా ఫకృద్దీన్ వలి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నాడని వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఏదైనా జరిగితే దానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిదే పూర్తి బాధ్యత అంటూ ఫిర్యాదు చేశారు. -
Anantapur: శింగనమలలో బండారు లీలలు
సాక్షి అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఒకరైతే.. పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నియోజకవర్గ అభివృది, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానాన్ని ఆమె తల్లి బండారు లీలావతి ఆక్రమించారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్లి లీలావతి శుక్రవారం బుక్కరాయసముద్రం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధికారితో పాటు ఇంజినీర్లు, ఇతర అధికారులు, ఎమ్మెల్యే వర్గీయులైన టీడీపీ నాయకులను పిలిపించారు. అందరినీ దగ్గర ఉండి అధికారులకు పరిచయం చేయించారు. అంతటితో ఆగకుండా ‘మండలంలో మా నాయకులు, కార్యకర్తలు మీ ఆఫీసులకు వస్తుంటారు. వారికి పనులు చేయడంతో పాటు వారు చెప్పిన వారికి మాత్రమే మీరు ప్రభుత్వం తరఫున సేవలందించాల’ని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పదవీ లేకున్నా అధికారులతో సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణికి చేదు అనుభవం
-
శ్రావణి వర్సెస్.. పల్లా చెంతకు శింగనమల పంచాయితీ
అనంతపురం, సాక్షి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. టీడీపీలో వర్గ విబేధాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు అయితే తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ టూమెన్ కమిటీగా ఆధిపత్య పోరు నడుస్తోందక్కడ. నియోజకవర్గంలో రేషన్ షాపుల్ని చేజిక్కించుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి వర్గం తీవ్రంగా యత్నిస్తోంది. అయితే.. దానికి టీడీపీ టూమెన్ కమిటీ అడ్డు తగిలింది. ఆ వ్యవహారం మొత్తం తమ చేతుల్లోకి తీసేసుకుంది. దీంతో అధికారం ఎమ్మెల్యే చేతుల్లో ఉందా?.. లేదంటే ఆ కమిటీ చేతుల్లో ఉందా? అని శ్రావణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే చోట కావాలనే కమిటీకి అధికారం కట్టబెట్టారా? అని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అయితే.. శ్రావణిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టైంలోనే కొందరు సీనియర్లు ఆమె ఎంపికను బహిరంగంగా వ్యతిరేకించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్ అయ్యిది. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో వాళ్లంతా సైలెంట్ అయినప్పటికీ.. ఇప్పుడు ఈ రకంగా తమ రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. టూమెన్ కమిటీ తనకు తలనొప్పిగా తయారైందని భావించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి.. విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శింగనమల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
బండారు శ్రావణిని పక్కన పెట్టిన టీడీపీ!
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్షంలోనూ బడుగు, బలహీన వర్గాల పట్ల చంద్రబాబు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారు. అగ్ర కులాల వారే పెత్తనం చెలాయించేలా చూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బంతాట ఆడుతూ అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీనే అని నిరూపిస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. చంద్రబాబు, చినబాబు లోకేష్ల ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమని ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చెప్పినట్లుగానే పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీని క్రమంగా పెత్తందార్లకు అడ్డాగా మార్చారు. టీడీపీలో రాజకీయంగా ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మాభిమానం చంపుకోలేక ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. శింగనమలలో దారుణంగా.. ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లోనూ టీడీపీకి చెందిన అగ్రకులాల నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత బండారు శ్రావణిని ఇక్కడ డమ్మీగా మార్చారు. టూమెన్ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడును నియమించి అవమానించారు. వీళ్లు చెప్పినట్టే అక్కడ పనులు జరగుతున్నాయి. ఇటీవల శ్రావణి తండ్రిపై దాడి జరిగింది. ఆ సమయంలో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్ జిల్లాలోనే ఉన్నారు. దాడికి పాల్పడిన వారిని మందలించనూ లేదు. దెబ్బలు తిన్న వ్యక్తిని పరామర్శించనూ లేదు. గుండుమల.. ఎస్సీ నేతల విలవిల మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మైనింగ్ మాఫియాకు అధిపతిగా చెప్పుకునే గుండుమల తిప్పేస్వామిదే పెత్తనం. ఆయన నియంత వైఖరిని జీర్ణించుకోలేని ఈరన్న వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు పార్టీకి ఆమడదూరం వెళ్లిపోయారు. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలను పట్టించుకునే నాథుడే లేరని ఉన్న కొద్దిపాటి ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే పలు సామాజిక వర్గాల నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ పార్టీకి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న సర్వేలు అధిష్టానానికి వెళ్లినట్లు తెలిసింది. మైనార్టీ మాట చెల్లని రూక.. 2014లో జరిగిన ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్బాషా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడాయన మాట చెల్లని రూక అయింది. డీడీల కుంభకోణంలో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ మాటే పైచేయిగా మారింది. నేరాలకు తెగబడుతున్నా కందికుంటనే చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇక్కడ మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు. అంతటా అంతే.. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకుల మాట చెల్లడం లేదు. అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడూ అగ్రకులాల వారు పెత్తనం చెలాయిస్తుండడంతో రగిలిపోతున్నారు. ఇక.. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సముచితం స్థానం కల్పించారు. పెద్ద ఎత్తున రాజకీయంగానూ పదవులు కట్టబెట్టారు. చెప్పాడంటే.. చేస్తాడంటే అనేంతలా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల మనసులనూ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీలోని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల తాకిడి మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. టీడీపీకి బడుగు బలహీన వర్గాల నేతలు గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ అసెంబ్లీ స్థానం నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వైద్యురాలు, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉండటంతో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చే యోచనలో ఉందని కమలనాథులు చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణి చేరిక సమయంలోనే ఆమెకు పార్టీ నుంచి టికెట్ హామీ దక్కిందని ప్రచారం జరిగింది. అధిష్టానం ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం. -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
ఊహించని రీతిలో కబళించిన మృత్యువు
క్రైమ్: చక్కగా చదువుకునే అమ్మాయిని ఆమెకున్న ఆరోగ్య సమస్య హఠాత్తుగా బలిగొంది. అదీ ఎవరూ ఊహించని రీతిలో!. రోజూలాగే స్కూల్కు వెళ్తున్న ఆమె ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న చెరువులో పడి కన్నుమూసింది. సీతానగరం మండలం ఆవాలవలసకు చెందిన శ్రావణి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యం-పార్వతిలకు ఆమె ఏకైక సంతానం. గాదెలవలసలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్ ఆగక పక్కనే ఉన్న చెరువులో పడింది. అది గమనించిన తోటి విద్యార్థులు చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. సైకిల్ మీద పడి ఆమె బుదరలో కూరుకుపోవడంతో కన్నుమూసిందామె. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: నితిన్ తన మాట వినడం లేదంటూ.. -
‘బిగ్బాస్ 7’లోకి బ్యాంకాక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్బాస్ నిర్వాహకులు. ఈ సారి గత సీజన్స్ కంటే భిన్నంగా బిగ్బాస్ ఆట ఉండబోతుందట. గత సీజన్ మాదిరి చిన్న చిన్న నటీనటులను కాకుండా..ఈ సారి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను బిగ్బాస్లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందట. ఇక ఆ లిస్ట్ ఎలాగో షో ప్రారంభం వరకు బయటకు రాదు. కానీ ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్బాస్-7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. (చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్) ఆ లిస్ట్లో ముఖ్యంగా ఒకరి పేరు బలంగా వినిపించింది. ఆమే బ్యాంకాక్ పిల్ల. యూట్యూబ్ వీక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. బ్యాంకాక్లో ఉండే ఈ తెలుగుమ్మాయి.. అక్కడి ప్రదేశాలను, వింతలను తెలియజేస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. అలాంటి వీడియోలు ఎవరైనా పెడతారు కానీ.. విదేశాల్లో ఉండి కూడా తెలుగులో భాషలో.. తన ప్రాంతం యాస(విజయనగరం)లో మాట్లాడుతూ వీడియోలు చేయడం ఈ పిల్ల స్పెషల్. ఈమె అసలు పేరు శ్రావణి సమంతపూడి. యూట్యూబ్ చానెల్ పేరు బ్యాకాంక్. బిగ్బాస్ కోసమే ఇండియాకి ఇటీవల శ్రావణి ఇండియాకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె బిగ్బాస్ -7 కోసమే ఇండియాకు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు చాలా మంది ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. పలు వెబ్సైట్లలో కూడా ఆమె బిగ్బాస్-7లో పాల్గొంటున్నారంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను బ్యాకాంక్ పిల్ల స్పందించింది. తన బిస్బాస్ ఎంట్రీ గురించి స్వయంగా ఓ వీడియోని కూడా చేసింది. పిలవని పేరంటానికి వెళ్తే బాగోదు బిగ్బాస్-7లోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న పుకార్లపై ఆమె ఫన్నిగా స్పందించారు. అసలు తకు బిగ్బాస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, పిలవని పేరెంటానికి వెళ్తే బాగోదని చెప్పింది. ‘నేను బిగ్బాస్లోకి వెళ్తున్నాననే వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ వార్తలు బాగా వైరల్ కావడంతో నిజంగానే నేను సెలెక్ట్ అయ్యానా అని మెయిల్స్ చెక్ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా అందరికి చెబుతాను. ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి’ అని శ్రావణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sravani Samanthapudi (@bangkok.pilla) -
బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..?
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భవిష్యత్కు గ్యారంటీ’ అట్టర్ ప్లాప్గా మారింది. ఆ పార్టీ నాయకులతో పాటు జనం నుంచి కూడా స్పందన లేకపోవడంతో టీడీపీ భవిష్యత్కే గ్యారెంటీ లేదని ప్రజలు అంటున్నారు. గార్లదిన్నె మండల పరిధిలోని ఇల్లూరులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్కు గ్యారెంటీ బస్సుయాత్రకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణితో పాటు ఆమె వర్గం నాయకులు, కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో టీడీపీకి భవిష్యత్తు ఏది అని బహిరంగంగానే ప్రజలు గుసగుసలాడుకున్నారు. అడుగడుగునా అవమానాలే..... బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..? టీడీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయట పడింది. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటికీ టీడీపీలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రావణి గైర్హాజరైనట్లు సమాచారం. బస్సు యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎక్కడా శ్రావణి ఫొటో లేకపోవడం గమనార్హం. అలాగే కల్లూరు వైఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా జనం లేక వెలవెలబోయింది. పేరుకే బండారు శ్రావణి.. శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు. చికెన్, మందు ఏర్పాటు చేసినా... షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే జనం రాకపోవడంతో ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. టీడీపీ నాయకులు బస్సుయాత్రకు వాహనాలు సమకూర్చిన జనం రాకపోవడంతో బస్సుయాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారింది. టీడీపీ నాయకులు నామమాత్రంగానే కార్యక్రమాన్ని జరిపించి మమ అనిపించారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు చికెన్, మందు ఏర్పాటు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి. -
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఆమోదం
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. ఈ నెల 25న శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రవి సోమవారం ఆమెను కలెక్టరేట్కు పిలిపించారు. రాజీనామా నిర్ణయాన్ని ఎవరి ఒత్తిడితోనైనా తీసుకున్నారా ? లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అని కారణాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని స్పష్టం చేసిన శ్రావణి.. మరోసారి లేఖ రాసివ్వడంతో కలెక్టర్ ఆమె రాజీనామా లేఖకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్కు ఇన్చార్జి చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే నూతన చైర్మన్ను ఎన్నుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసానికి ప్రయత్నించడంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై జి.సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక ప్రాంతానికి చెందిన రాజు కుమార్తె కె.శ్రావణి (18) ఈ నెల 12వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో, బంధు మిత్రుల ఇండ్లలో ఎంత వెదికినా ఆచూకి లభించలేదు. దీంతో తల్లి కృష్ణవేణి కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్) -
సీరియల్స్లో బిజీ ఆర్టిస్టుగా శ్రావణి.. అలా అవకాశం
శ్రీకాకుళం (టెక్కలి): కార్తీకదీపం సీరియల్లో తులసిగా..గీతాగోవిందంలో జయమ్మగా..గుప్పెడంత మనసులో ధరణిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.. సుమారు 14 టీవీ సీరియల్స్, మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్లో నటిగా, అమమ్మగారిల్లు, పేపర్బాయ్ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వర్ధమాన టీవీ సీరియల్ నటి తాండ్ర శ్రావణి అలియాస్ సీతామహాలక్ష్మి ఇటీవల టెక్కలి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ఈమె స్వస్థలం కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామం. టెక్కలిలోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మారుమూల ప్రాంతానికి చెందిన తనను టీవీ సీరియల్స్ అభిమానులు ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారని చెప్పారు.2వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లామన్నారు. 2011లో హైదరాబాద్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారోంభోత్సవంలో భాగంగా తనకు నటిగా అవకాశం వచ్చిందన్నారు. మొదట తమిళంలో కడాసి బెంచ్ అనే సీరియల్లో నటించినట్లు తెలిపారు. తర్వాత మొగలిరేకులు, ఒకరికొకరు, అభిషేకం , కార్తీకదీపం, గోరింటాకు, గీతాగోవిందం, గుప్పెడంత మనసు, ఆడదే ఆధారం, పౌర్ణమి, అగ్నిపూలు తదితర సీరియల్స్లో అనేక పాత్రలు పోషించినట్లు వివరించారు. వీటితో పాటు మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు హైదరాబాద్లో అనాథ పిల్లలకు అండగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ మలక్పేట్లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మలక్పేట్లో దారుణం జరిగింది. ఓలా బైక్ బుక్ చేస్కొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కారుని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్తో గొడవ) -
విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..
వంగర (శ్రీకాకుళం): మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడింది. ఎస్ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లిపోవడంతో అక్కడే చదువుతోంది. ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు. చదవండి: (పుట్టిన రోజే ప్రాణాలు పోయాయి) శ్రావణి సరిగ్గా చదవడం లేదని ఇటీవల తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంట ల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి వంతెన నుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ డి.నవీన్కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించారు. తండ్రి గొట్టిపల్లి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేదింట విషాదం.. విద్యార్థిని ఆత్మహత్యతో కె.కొత్తవలస గ్రామంలో వి షాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. సంక్రాంతికి సొంతూరు వచ్చారు. ఈ లోగా ఈ విషాదం సంభవించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్భాస్కర్రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి
సాక్షి, గుంటూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. గత శనివారం చుండూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర, ఎస్ఐ శ్రావణి గడ్డి మందు కూల్ డ్రింక్లో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన శ్రావణి 2018లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఏడు నెలల కిందట చుండూరుకు బదిలీపై వెళ్లారు. ఎస్ఐ మృతదేహానికి జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఐపై ఆరోపణలు చుండూరు సీఐ రమేశ్బాబు, టీడీపీ నాయకుడు వంపుగాని గురవయ్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ శ్రావణి వాంగ్మూలం ఇచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీకి చెందిన కొందరిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బైండోవర్ చేయగా ఆ వ్యక్తులతో సీఐ తనపై రిట్పిటీషన్లు వేయించడంతో పాటు, ఎస్ఈసీకి ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. తనకు కానిస్టేబుల్ రవీంద్రతో అక్రమ సంబంధం ఉందని గురవయ్య ద్వారా సీఐ దుష్ప్ర చారం చేయించారని, ఎస్పీకి ఫిర్యాదులు చేయించి ఇబ్బంది పెట్టినట్టు ఎస్ఐ తెలిపారు. స్టేషన్లో తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి, తనకు మోమోలు ఇవ్వడంతో పాటు, లంచాలు తీసుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేశారని, పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో వృత్తిపరంగా, మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరి మధ్య వివాదం ఎస్ఐ శ్రావణి తొలి నుంచి తప్పుని సహించరని పోలీస్ శాఖలో పేరుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆమెపై ఎస్ఈసీకి, కోర్టుల్లో, ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులపై అనేక విచారణలను ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఎస్ఐ శ్రావణి, సీఐ రమేశ్బాబు మధ్య వివాదం నడుస్తోందని, ఇద్దరు పర్సపరం వాదులాడుకునేవారని సమాచారం. స్టేషన్ సిబ్బంది సైతం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల విచరణలో తెలిపినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి నట్టు డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు. సీఐను వీఆర్కు పిలిచాం ఎస్ఐ శ్రావణి ఆత్మహత్య ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా చుండూరు సీఐ రమేశ్బాబును వీఆర్కు పిలిచాం. శాఖపరమైన దర్యాప్తు చేపడతాం. – డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, డీఐజీ, గుంటూరు రేంజ్ చదవండి: గుంటూరు, నరసరావుపేటల్లో చంద్రబాబుపై కేసులు ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్డివిజన్ ఇన్చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్ సబ్డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు. – పాలకొండ రూరల్ సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్కు సిద్ధమై విజయం సాధించాను. సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు? డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్డివిజన్లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా. సాక్షి: ఈ సబ్డివిజన్లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు. సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం. సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు. -
లోకేష్ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జీ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంపై శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరువర్గల మధ్య పచ్చగడ్డేస్తే మండే విధంగా పరిస్థితి తారాస్థాయికి చేరింది. లోకేష్ పర్యటనకు దూరంగా శ్రావణి.. ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోవైపు అనంతపురం పర్యటన సందర్భంగా లోకేష్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీస సామాజిక దూరం పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారు. కరోనా జాగ్రత్తలు పక్కనపెట్టి భారీ కాన్వాయ్ నడుమ పర్యటన చేశారు. లోకేష్ తీరుపై స్థానిక నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్ అబద్ధాలు బట్టబయలు.. శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపామని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాధారణం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు నమోదు కావటంతో క్రాప్ డ్యామేజ్ జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నారా లోకేష్ అబద్ధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. -
హేమంత్ హత్యకేసు.. పోలీసుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. హేమంత్ కుమార్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు విచారించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్లో కోరారు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులైన అశిష్రెడ్డి, సందీప్ రెడ్డి వల్ల కూడా తమ కుటుంబానికి ప్రాణహని ఉందని హేమంత్ కుమార్ భార్య అవంతిరెడ్డి ఆరోపించారు. మామయ్య మురళీ కృష్ణకు సందీప్రెడ్డి ఫోన్కాల్ చేసి ఇంతకుముందు బెదిరించాడని తెలిపారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన పోలీసు కస్టడీ అమీర్పేట: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులైన దేవరాజ్రెడ్డి, సాయికృష్ణారెడ్డిల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు చంచల్గూడ జైలులో ఉన్న దేవరాజ్రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో వారిని ఆదివారం తిరిగి జైలుకు తరలించారు. శ్రావణి ఆత్మహత్యకు ఒక రోజు ముందు ఏమి జరిగిందన్న దానిపై సుదీర్ఘంగా విచారించారు. పంజగుట్టలోని శ్రీకన్య హోటల్లో జరిగిన దాడిపై మరిన్ని వీడియో, ఆడియో సంభాషణలను సేకరించినట్లు తెలిసింది. మూడో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్రెడ్డి సాయితో కలిసి ఆత్మహత్య జరిగిన రోజు రాత్రి శ్రావణి ఇంటికి వచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అశోక్రెడ్డిని కూడా కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. (దేవరాజ్తో వివాహం చేయండి : శ్రావణి) -
శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్, సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్టయి చంచలగూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దేవరాజ్, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు. -
శ్రావణి కేసు: వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి అశోక్రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ రెడ్డి శ్రావణిని విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఆ విచారణలో.. ‘‘ 2017 నుంచి శ్రావణితో అతడికి పరిచయం ఉంది. అశోక్రెడ్డి తీసిన ఆర్ఎక్స్ 100లో ఆమెకు గెస్ట్ రోల్ ఇచ్చాడు. శ్రావణిని అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేశాడు.శ్రావణికి పలుమార్లు ఆర్థికసాయం చేసిన అశోక్రెడ్డి ఆర్థిక సాయం నెపంతో ఆమెపై జులుం చేశాడు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు దిగాడు. శ్రావణి చనిపోయిన రోజున కూడా ఆమె ఇంటికొచ్చి, కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ( శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ) అదే సమయంలో శ్రావణి ఇంటికొచ్చిన సాయి, అశోక్రెడ్డితో కలిసి ఆమెను టార్చర్ చేశాడు. ఇద్దరి వేధింపులను శ్రావణి దేవరాజ్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో సాయి, అశోక్రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి శ్రావణిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ముగ్గురి వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంద’’ని వెల్లడైంది. -
అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు..
-
శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు..
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో ఫోన్లో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న ఆయన బుధవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు. (శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!) అనంతరం అశోక్ రెడ్డిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత అశోక్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జి ముందు ప్రవేశపెట్టి...న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్రాజ్ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయం విదితమే. (శ్రావణి కేసు: నిర్మాత అశోక్రెడ్డి లొంగుబాటు) అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు.. శ్రావణి ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది..?? ఆమెతో ఉన్న పరిచయం ఏంటి..?? సాయి కృష్ణ రెడ్డి తో కలిసి శ్రావణిని ఏం బెదిరించారు..?? శ్రావణి ని వివాహం చేసుకుంటానని ఆ తరువాత సాయి కృష్ణారెడ్డితో కలిసి ఎందుకు వేధించారు..?? అనేక ప్రశ్నలకు సమాధానం రాబడుతున్న ఎస్సార్ నగర్ పోలీసులు -
నిర్మాత అశోక్రెడ్డి లొంగుబాటు
-
శ్రావణి కేసు: నిర్మాత అశోక్రెడ్డి లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్రాజ్ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, అశోక్రెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అన్న సంగతి తెలిసిందే. (చదవండి: శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!) -
శ్రావణి కేసు: రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
-
శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి కొండపల్లి శ్రావణి మృతి కేసులో పోలీసులు టిస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణా రెడ్డి, ఏ 3 గా అశోక్ రెడ్డిని చేర్చారు. అయితే, మొన్న (ఆదివారం) మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఏ3 గా దేవరాజ్ పేరును వెల్లడించిన పోలీసులు తాజాగా అతన్ని ఏ1 గా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణా రెడ్డిలు విచారణలో కీలక విషయాలు చెప్పిట్టు తెలిసింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు దేవ్రాజ్ని ప్రేమించిన శ్రావణి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దేవ్రాజ్ని అడగడంతో అతను ఒప్పుకోలేదు. శ్రావణి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, సాయి కృష్ణా రెడ్డి, అశోక్ రెడ్డిలతో శ్రావణికి రిలేషన్ ఉండటంతో దేవ్రాజ్ ఒప్పుకోలేదు. దేవ్రాజ్ని కలవడానికి శ్రావణి మెసెజ్లు, ఫోన్ కాల్స్తో ప్రయత్నించింది. సాయి కృష్ణ, అశోక్ రెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి దేవ్రాజ్ శ్రావణిని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు రాత్రి 9.30 గంటలకు చేరుకున్నారు. (చదవండి: ట్రయాంగిల్ సీ‘రియల్’ స్టోరీ!) అదే సమయంలో శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణా శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుళ్లాడు. దేవ్ రాజ్ని కలవకూడదని సాయి కృష్ణా, అశోక్ రెడ్డి శ్రావణిని బెదిరించారు. దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోము అని బెరింపులకు దిగారు. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని శ్రావణి దేవ్ రాజ్ ను కోరింది. శ్రావణి శ్రావణి తో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. సాయి కృష్ణా, అశోక్ రెడ్డిల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఏ 3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి అశోక్ రెడ్డి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజ్కు శ్రావణి దగ్గర కావటడం జీర్ణించుకోలేని అశోక్రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. -
ట్రయాంగిల్ సీ‘రియల్’ స్టోరీ!
సాక్షి, హైదరాబాద్: టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్సార్నగర్ పోలీసులు కొలిక్కి తీసుకు వచ్చారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దేవరాజ్రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో పాటు సినీ నిర్మాత అశోక్రెడ్డి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవరాజ్రెడ్డి, రెండో నిందితుడు సాయికృష్ణారెడ్డిలను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పరారీలో ఉన్న అశోక్రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన శ్రావణి నటనపై ఉన్న ఆసక్తితో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చింది. ఆమెకు ఐదేళ్ల క్రితం సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. సాయి ఏపీలోని అనంతపురం నుంచి వచ్చి, నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. శ్రావణితో సన్నిహితంగా ఉండటంతో పాటు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సాయి కొన్నాళ్లకు ఆమె కుటుంబానికీ దగ్గరయ్యాడు. అయితే కొన్ని స్పర్థలు తలెత్తిన నేపథ్యంలో శ్రావణి–సాయిలు 2018లో దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె కుటుంబంతో సాయి సంబంధాలు కొనసాగించాడు. అదే ఏడాది అశోక్రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో కార్తీక్’ చిత్రంలో శ్రావణి నటించింది. అప్పటి నుంచి అశోక్రెడ్డితో ఆమె పరిచయం కొనసాగింది. టిక్టాక్తో పరిచయం.. ఇదిలా ఉండగా.. టిక్టాక్ ద్వారా గత ఏడాది ఆగస్టు 8న శ్రావణికి కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డితో పరిచయమైంది. ఓ సీరియల్లో నటించేందుకు ఆడిషన్స్ కోసం దేవరాజ్ గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో శ్రావణి ఇంట్లోనే తొమ్మిది రోజుల పాటు ఉన్నాడు. ఈ తొమ్మిది రోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శ్రావణి ఇంట్లో ఉన్న సందర్భంలోనే దేవరాజ్రెడ్డి.. ఆమె ఫోన్లోని వివరాలను పరిశీలించాడు. ఆమెకు అశోక్రెడ్డితో పాటు సాయికృష్ణతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టిన దేవరాజ్రెడ్డి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఆపై కొన్ని సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మళ్లీ హైదరాబాద్ వచ్చిన అతను సీతాఫల్మండి ప్రాంతంలో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఓ నటుడి పుట్టినరోజు వేడుకను శ్రావణి ఇంట్లో నిర్వహించారు. దేవరాజ్ను కూడా ఆమె ఈ వేడుకకు ఆహ్వానించింది. ఆ సందర్భంలో ఆమె అందరి ముందూ ‘ఐ లవ్ దేవరాజ్రెడ్డి’అంటూ ప్రకటించింది. అయితే శ్రావణికి అశోక్రెడ్డితో పాటు సాయితోనూ సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనకు ఆమెపై ఆసక్తి లేదని అతను చెప్పాడు. దేవరాజ్కు సర్దిచెప్పడానికి శ్రావణి ప్రయత్నించినా.. అతడు తిరస్కరించాడు. దేవరాజ్తో ఘర్షణ.. కేసులు.. కాగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ రాత్రి దేవరాజ్కు ఫోన్ చేసిన శ్రావణి, అతడిని చంపేస్తానంటూ బెదిరించింది. సాయి, అశోక్రెడ్డిల పేర్లు చెప్పి, వారితో సంబంధం ఉందంటూ తన జీవితం నాశనం చేస్తున్నావని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ 21 రాత్రి 8.30 గంటలకు దేవరాజ్రెడ్డితో శ్రావణి ఘర్షణ పడింది. ఈ సందర్భంగా శ్రావణి తన సోదరుడు శివ, మరో యువతితో కలిసి అతనిపై దాడికి పాల్పడింది. నీ కారణంగా అశోక్రెడ్డితో స్పర్థ లు వచ్చాయంటూ.. వాగ్వాదానికి దిగి కొట్టా రు. దీనిపై దేవరాజ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రావణి తనను వేధిస్తున్నాడంటూ దేవరాజ్పై ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే చాటింగ్ ద్వారా దేవరాజ్కు నచ్చచెప్పడానికి శ్రావణి ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన అశోక్రెడ్డి, సాయికృష్ణతో పాటు శ్రావణి కుటుంబీకులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. కాగా, ఈ నెల 7న శ్రావణిని ఓ షూటింగ్ లొకేషన్లో కలుసుకున్న దేవరాజ్రెడ్డి అక్కడ నుంచి ఆమెను పంజగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్కు తీసుకువెళ్లాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ ఆవేశంతో దేవరాజ్పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని శ్రావణి అడ్డుకోవడంతో ఆమె చెంపపై కొట్టిన సాయి ఆటోలో ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు దేవరాజ్కు ఫోన్ చేసిన శ్రావణి తనను అశోక్రెడ్డి, సాయిలతో పాటు తన కుటుంబీకులూ వేధిస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత ఫోన్ చేసిన శ్రావణి నీతో పాటు అశోక్రెడ్డి, సాయి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోయింది. ఈ ఫోన్ రికార్డులన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్, సాయిలను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్మాత అశోక్రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
శ్రావణి కేసు: కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో నిందితులైన దేవరాజ్, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణి 2012లో టీవీల్లో పనిచేయాలని హైదరాబాద్కి వచ్చింది. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యారు. 2019లో దేవరాజ్ రెడ్డి పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని వేధించారు. అదే క్రమంలో దేవరాజ్తో దూరంగా ఉండలాని సాయికృష్ణ పలు సందర్భాల్లో శ్రావణితో గొడవ పడ్డాడు. (శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత) దేవరాజ్తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లి తండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని వేధించారు. శ్రావణిని సాయి, ఆమె తల్లిదండ్రులు కొట్టారని దేవరాజ్ చెప్పాడు. అనేక సార్లు సాయి తన దగ్గర ఉన్న ఫోటోలతో శ్రావణిని బెదిరించాడు. అయితే దేవరాజ్ కూడా పెళ్లి చేసుకుంటనని చెప్పి మోసం చేసాడు. అంతకుముందే దేవరాజ్పై శ్రావణి కేస్ పెట్టింది. కాగా శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలు ఉండటంతో దేవరాజ్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణారెడ్డి, ఏ2 అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డిలుగా గుర్తించాం. వీరిలో ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేశాం. ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతనిని అరెస్ట్ చేయాల్సి ఉంది' అని డీసీపీ తెలిపారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) -
పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
-
శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్ల నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కోవిడ్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్రెడ్డి ఫోన్ స్విచాఫ్లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో కొనసాగిన విచారణలో నిందితులు కీలక అంశాలను రాబట్టారు. దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేవరాజ్, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్) -
శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్
-
శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలి నుంచీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డిని సైతం సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. ఆదివారం విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయిల స్టేట్మెంట్ను నమోదు చేశారు. దీనిలో భాగంగానే కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన ఎస్ఆర్నగర్ పోలీసులు సాయితో పాటు దేవరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు. (దేవరాజ్తో వివాహం చేయండి : శ్రావణి) అయితే కేసు విచారణలో భాగంగానే శ్రావణి కుటుంబ సభ్యులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తె మరణానికి దేవరాజే కారణమని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. అయితే దేవరాజ్ మాత్రం సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆడియో రికార్డులను పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అయితే ఆదివారం నాటి విచారణతో కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్) -
మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే దేవరాజ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు, ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుడు సాయిని కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి, దేవరాజ్ తల్లి సత్యవతికి కాల్చేసిన ఓ ఆడియో లీకైంది. దీనిలో శ్రావణి-సత్యవతి పలు కీలక అంశాలపై చర్చించారు. దేవరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమైన, అతనితో తన వివాహం జరిపించాలని సత్యవతిని శ్రావణి వేడుకుంది. అంతేకాకుండా కట్నకానుకలతో పాటు పెళ్లి ఖర్చంతా తానే బరిస్తానని కూడా చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దేవరాజ్పై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. మొదట కేసును ఉపసంహించుకోవాలని ఆమె శ్రావణిని కోరింది. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’) దానికి సరే అన్న శ్రావణి మీరు ఓకే అంటే కేసు విత్డ్రా చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటామని చెప్పింది. తాము ఇద్దం వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని సత్యవతిని బతిమిలాడింది. అయితే పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలక కానుంది. కాగా ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ వచ్చిన శ్రావణి కుటుంబ సభ్యులు, సాయిలను ఎస్ఆర్నగర్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. (గువ్వల్ని మింగుతున్న గద్దలు). , కొనసాగుతున్న కీలక విచారణ శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఆదివారం సాయి పోలీసులు ముందు విచారణకు హాజరైయ్యాడు. దేవరాజు, సాయి కృష్ణను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో నేటి విచారనే కీలకం కానుంది. కేసు విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న కేసు నుండి తప్పించు కొనేందుకే దేవరాజ్ మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. మరోవైపు సాయి వేధింపులు వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వాదిస్తున్నాడు. అయితే ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో కేసు నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు
-
‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రావణి చనిపోవడానికి సాయికి సంబంధం లేదని ఆమె తల్లి పాపా రత్నం చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడు దేవరాజు వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవరాజు వల్లే మా అమ్మాయి శ్రావణి చనిపోయింది. సాయి.. శ్రావణిని కొట్టింది దేవరాజు నుంచి దూరంగా ఉండాలని మాత్రమే. దేవరాజు తన మీద ఉన్న కేసును తీయించుకోవడానికే మా అమ్మాయితో ప్రేమ నాటకం ఆడాడు. (చదవండి: విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి) శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్ నుంచి దేవరాజుకు ఫోన్ చేసింది. అయినప్పటికీ దేవరాజు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. సాయి లేకపోతే మా కుటుంబం ఆరోజే చనిపోయేవాళ్లం. దేవరాజుకు శ్రావణి అన్నీ చూసుకుంది. సీరియల్స్ వాళ్లు దేవరాజుకు ఒక ఎత్తు పన్ను ఉందన్నారు. శ్రావణి పది వేల రూపాయలు పెట్టి పన్ను కట్టించింది. రోజూ పాలు, గుడ్లు శ్రావణి తమ్ముడు ఇచ్చేవాడు. దేవరాజు మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచినాడు. కాగా దేవరాజ్, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: గువ్వల్ని మింగుతున్న గద్దలు) -
గువ్వల్ని మింగుతున్న గద్దలు
చిట్టి గువ్వలు ఎన్నో ఊళ్ల నుంచి కలల రెక్కలను అల్లార్చి ఎగిరి వస్తాయి. తెలియని నగరంలోతెలియని మనుషుల్ని నమ్మి ఆడతాయి. పాడతాయి. ప్రతిభ చూపి పైకి ఎగరాలనుకుంటాయి. కాని ఊరి గువ్వలంటే గద్దలకు లోకువ. అవి వెంటబడతాయి. వేధిస్తాయి. గువ్వలు కట్టుకుంటున్న గూళ్లను కూలదోస్తాయి. గతంలో నటి భార్గవి విషయంలో అయినా ఇప్పుడు శ్రావణి విషయంలో అయినా జరుగుతున్నది ఇదే. బహుపరాక్... బహుపరాక్. ఏ రంగంలో అయినా మార్గదర్శులు అవసరం. సినిమా పరిశ్రమలో మరీ అవసరం. పెద్ద కుటుంబాల నుంచి పెద్ద ఊళ్ల నుంచి పెద్ద చదువులు చదువుకొని వచ్చిన వారికి ఇవన్నీ కొంత సులువుగా దొరుకుతాయి. చిన్న ఊళ్ల నుంచి వచ్చినవాళ్లకు ఏ ఆధారమూ దొరకనప్పుడు తాడైనా పామైనా పట్టుకోక తప్పదు. ఇలాంటి వారికి ముందు ఆశ్రయం ఇచ్చినవారే తరువాత విరోధులుగా మారడం, ఈ మార్గదర్శులనుకునే వారితోనే తీవ్రమైన సమస్యలు రావడం సినిమా పరిశ్రమ నిండా ఉంది. అయినప్పటికీ కొత్తగా వస్తున్న స్ట్రగులర్స్ గుడ్డిగానే ఉంటున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు. కంగనా రనౌత్ నుంచి నటి కంగనా రనౌత్ కూడా తల్లిదండ్రులను ఎదిరించి హిమాచల్ ప్రదేశ్లోని చిన్న ఊరి నుంచి ముంబై చేరుకుంది. మొదట ఆమెకు ముంబైలో ఆశ్రయం ఇచ్చింది నటుడు ఆదిత్యాపంచోలి కుటుంబం. కంగనా కు అవకాశాలు రావడానికి ఆదిత్యా పలుకుబడి కొంత ఉపయోగపడింది. ఆ తర్వాత కంగనా అతని పట్టు నుంచి బయటపడటానికి చాలా పెనుగులాడాల్సి వచ్చిందని ఆమే చెప్పుకుంది. ఆదిత్యా పంచోలి తనపై భౌతిక దాడి చేశాడని కూడా చెప్పుకుంది. అయితే అప్పటికే ఆమె సినిమా రంగంలో ఎలా మెలగాలో తెలుసుకోవడం వల్ల నిలబడగలిగింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ప్రముఖంగా వచ్చింది. దీనికి ముందు నటి మహిమా చౌదరి కూడా కొండ ప్రాంతం డార్జిలింగ్ నుంచి బాలీవుడ్ కలలు కంటూ ముంబై చేరుకుంది. దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈమెకు తొలి అవకాశం ‘పర్దేశ్’ లో ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆమె కెరీర్ పట్ల శాసనకర్తగా మారడంతో మహిమా చౌదరి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ప్రెస్కు ఎక్కి చెప్పింది. ఇటీవల కూడా ఆమె సుభాష్ ఘాయ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు వచ్చినప్పటికీ ఈ డిస్ట్రబెన్స్ వల్ల మహిమా చౌదరి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఈ మార్గదర్శుల వల్ల వచ్చే విలోమ ఫలితం ఏమిటంటే వీరు అవకాశాలు కల్పిస్తారు అని మిగిలినవారు ఇవ్వరు. ఆ మార్గదర్శులంటే పడనివారూ ఇవ్వరు. రామ్గోపాల్ వర్మతో ఎక్కువ సినిమాలు చేసిన ‘ఆంత్రా మాలి’ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఆమె సినిమాల నుంచి విరమించుకుంది. లౌక్యంలో చిక్కుకుని తెలుగు ప్రాంతాల నుంచి ముఖ్యంగా చిన్న ఊళ్ల నుంచి వచ్చిన వారికి సినిమా పరిశ్రమలో సరైన మార్గదర్శులు దొరకడం ముఖ్య సమస్య. బాలీవుడ్లో దీని కోసం కన్సల్టెంట్లు ఉంటారు. ఏజెన్సీలు ఉంటాయి. తెలుగులో ‘మేనేజర్లు’, ‘డేట్స్ చూసేవారు’ ఉంటారు. లేదా ‘స్నేహితులు’ ఉంటారు. వీరు ఇండస్ట్రీలోని అనుభవజ్ఞులైతే కెరీర్ ఒక విధానంలో నడుస్తుంది. వీరూ కొత్తవారై వీరూ అగమ్యగోచరంగా ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. చాలా కథలు ఎలా ఉంటాయంటే ‘నా వల్ల పైకి వచ్చావు. పైకి రాగానే నన్ను వదిలించుకుంటున్నావు’ అనేలా ఉంటుంది. ఇవతలి పక్షానికేమో ‘నీ వల్ల పైకి వచ్చాను నిజమే. ఇప్పుడు నా మీద పడి బతుకుతూ నన్ను పంజరంలో పెట్టాలని చూస్తున్నావు’ అన్నట్టు ఉంటుంది. మనం ఎంచుకున్న రంగంలో పైకి రావాలంటే ‘నలుగురితో లౌక్యంగా’ ఉండాలి అనుకోవడం మరో సమస్యగా మారుతోంది. అందరితో మంచిగా, స్నేహంగా మాట్లాడిన వెంటనే దానిని అడ్వాంటేజ్గా తీసుకొని జీవితాల్లో చొరబడే పరిస్థితికి వస్తోంది. ఆ తర్వాత ప్రమాదాల వరకూ వెళుతోంది. భార్గవి/శ్రావణి 2008లో ఆత్మహత్య చేసుకున్న ‘అష్టాచెమ్మా’ ఫేమ్ భార్గవి, ఇప్పుడు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి చిన్నఊళ్ల నుంచి వచ్చినవారే. భార్గవి సొంతఊరు గుంటూరు జిల్లా గోరంట్ల. ఆమెకు సినిమా రంగంలో వెలగాలని కలలు కంది. అందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ (బుజ్జి)ను మార్గదర్శిగా ఎంచుకుంది. ఆర్కెస్ట్రా నడుపుతూ సినీ పరిచయాలు కలిగిన ప్రవీణ్ భార్గవికి అవకాశాలు రావడానికి ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు. ఈలోపు వారిరువురూ ప్రేమలో పడ్డారని అంటారు. ‘అష్టాచెమ్మా’ హిట్ అయ్యాక భార్గవి కెరీర్ ఊపందుకుంది. అది ప్రవీణ్ కు ఇన్సెక్యూరిటీ కలిగించింది. 2008 డిసెంబర్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్న భార్గవి భవిష్యత్తు అలా ముగిసింది. ఇప్పుడు శ్రావణి కథ కూడా అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ హైదరాబాద్ చేరుకున్న శ్రావణికి సాయి, దేవరాజ్ అనే మిత్రులే మార్గదర్శులు అయ్యారు. కెరీర్లో ముందుకు వెళ్లే కొద్దీ వీరిరువురి మధ్య ఆమె నలిగినట్టుగా ఇప్పటి వరకూ వస్తున్న వార్తల వల్ల తెలుస్తోంది. ఒక సినిమా నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఈ వొత్తిళ్లలో, వలయాల్లో ఉన్నారో తెలియదు. హత్య–ఆత్మహత్య– బ్లాక్మెయిల్ వర్క్ రిలేషన్స్గాని వ్యక్తిగత రిలేషన్స్గాని ఏర్పరుచుకోవడం, విరమించుకోవడంలో తగిన మెచ్యూరిటీ లేకపోవడం, వాటినెలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల రిలేషన్స్ ‘వద్దు’ అనుకున్నప్పుడు ‘హత్య’, ‘ఆత్మహత్య’, ‘బ్లాక్మెయిల్’ వంటి పదాలు తారసపడుతున్నాయి. ఇవన్నీ లేకుండా కూడా విడిపోయి ఎవరి పని వారు చేసుకోవచ్చు. ప్రతిదానికి ఈ కొత్త టెక్నాలజీ ఒకటి మంచితోపాటు చెడ్డకూ ఉపయోగపడుతోంది. ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్లు ఆ సమయానికి బాగున్నా ఆ తర్వాత నరకాన్ని సృష్టిస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు టీవీ రంగంలో అయినా సినిమా రంగంలో అయినా వెళ్లి చెప్పుకునే విభాగాలు ఉండాలి. సరైన పెద్దలు ఉండాలి. పోలీసు విభాగంలో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వారి కోసం కౌన్సిలింగ్ సెంటర్ అవసరం గట్టిగా కనపడుతోంది. మరో శ్రావణి ఉదంతం జరక్కూడదంటే ఏం చేయాలో అందరూ ఆలోచించాలి. అప్రమత్తంగా కావాలి. – సాక్షి ఫ్యామిలీ (ఇన్పుట్స్: సినిమా డెస్క్) ప్రత్యూష బెనర్జీ గుర్తుందా? ప్రత్యూష బెనర్జీ ‘చిన్నారి పెళ్లి కూతురు’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం. కెరీర్లో పైకొస్తుండగా 25 ఏళ్లకే 2016 ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్ అని పోలీసుల కథనం. చనిపోయే ముందు రాహుల్తో ప్రత్యూష ఫోన్లో మాట్లాడిన సంభాషణను పోలీసులు సేకరించారు. కేసు న్యాయవిచారణలో ఉంది. ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి నటి శ్రావణి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. కారణం ఏంటంటే 12 ఏళ్ల క్రితం నేను దర్శకత్వం వహించిన ‘అష్టాచమ్మా’ చిత్రంలో అద్భుతంగా నటించిన భార్గవి కూడా ఇలానే వ్యక్తిగత కారణాల వల్ల మరణించింది. చిన్న చిన్న ఊర్లనుండి, టౌన్లనుండి ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన ఆడపిల్లలు ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఉచ్చుల్లో బిగుసుకుపోతున్నారు? దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇదే కెరీర్గా ఎన్నుకుని సినిమా పరిశ్రమకు వచ్చేవారికి ఈ పరిశ్రమపై నమ్మకాన్ని పెంచే విధంగా మనం చర్యలు చేపట్టాలి. వాళ్లకు వచ్చిన సమస్యలను చెప్పుకుని, దానికి పరిష్కారం ఇప్పించే ఒక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సినీరంగానికి సంబంధించినవారు, సామాజిక విశ్లేషకులు తీవ్రంగా ఆలోచించి ఏదో ఒక వ్యవస్థను ముందుకు తీసుకురావాలి. ఆ వ్యవస్థ ఏర్పాటయ్యేవరకూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. – దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శ్రావణి చాలా సిన్సియర్ శ్రావణి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే షాక్ అయ్యాను. ఆమె వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా, హానెస్ట్గా ఉండేది. షూటింగ్కి టైమ్కి కరెక్ట్గా వచ్చేది. ఎప్పుడూ జోవియల్గా ఉంటూ అందరితో కలివిడిగా ఉండేది. నటీనటులు కొంచెం ఎమోషనల్గా ఉంటారు, కానీ శ్రావణి బాగా ప్రాక్టికల్గా ఉండేది. అలా ఉండే అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవటం బాధ కలిగించింది. ఈ జనరేషన్ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రేమ సమస్య అవ్వొచ్చు, మరో సమస్య అవ్వొచ్చు... అవేమీ జీవితం కంటే పెద్దవి కాదనేది వాళ్లు గమనించాలి. జీవితాన్ని ముగించే ముందు విచక్షణతో ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. – దర్శకుడు మలినేని రాధాకృష్ణ, ‘మౌనరాగం’ దర్శకుడు -
విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి
-
కీలక దశకు చేరుకున్న శ్రావణి కేసు
తూర్పు గోదావరి : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవరాజ్ను ఇప్పటికే విచారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించిందుకు ఆమె కుటుంబ సభ్యులను విచారించనున్నారు. పోలీసుల పిలుపు మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి శనివారం హైదరాబాద్కు బయలుదేరారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో రేపు ఉదయం (ఆదివారం) శ్రావణీ తల్లిదండ్రులు, సోదరుడుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా హాజరు కానున్నారు. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్) శ్రావణీ కుటుంబ సభ్యులను సాయి తన కారులో ఎక్కించుకుని హైదరబాద్కు ప్రయనమైయ్యాడు. కాగా దేవరాజ్, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సాయి, ఆమె కుటుంబ సభ్యలను విచారించిన తరువాతనే కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సాయి, శ్రావణికి సంబంధించిన ఓ వీడియో సైతం తాజాగా వెలుగులోకి రావడంతో అతని పాత్రపై మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం నాటి విచారణ కేసు దర్యాప్తులో కీలకం కానుంది. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) -
ఏది నిజం..?
-
శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు.. కానీ కేసు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడిని అని చెప్పుకున్న సాయి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దేవరాజ్ అందించిన సాక్ష్యాలు కేసును కీలక దశకు తీసుకువెళ్లింది. సాయి, అశోక్ రెడ్డిల విచారణ తరువాత కేసులో అరెస్ట్ పర్వం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు సినిమాలా ఉంది శ్రావణి కేసు. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్ట్ లమీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదటి రెండు రోజులు దేవరాజ్ చుట్టూ తిరిగితే ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు చాలా కీలకమైన సాక్ష్యాలు అందించాడు. హోటల్ లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా శ్రావణిపై సాయి దాడి చేసిన సీసీ ఫుటేజ్ బయటపడింది. ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్లో శ్రావణిని దేవరాజ్ను కలిసేందుకు రాగా.. అక్కడే ఉన్న సాయి శ్రావణిపై దాడికి పాల్పడ్డాడు. అయితే శ్రావణి ఆత్మహత్య కేసులో ఈ సీసీ ఫుటేజ్ కీలకం కానుంది. ప్రస్తుతం విచారణలో భాగంగా పోలీసులు ఆ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య కు ముందు రోజు శ్రావణి సాయి ల మధ్య జరిగిన వివాదం కూడా విచారణలో కీలకం కానుంది. మరోవైపు సాయి, దేవ్ రాజ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటికొచ్చింది. ఆ ఆడియోలో శ్రావణి కోసం వీరిద్దరు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు, సాయి కలిసి శ్రావణి బెదిరిస్తున్న సమయంలో దేవరాజ్ ఆ ఆడియోను రికార్డు చేశాడు. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) సాయి, దేవ్ రాజ్ మధ్య సంభాషణ దేవ్ రాజ్.. సాయి నీ వళ్లే ఈ సమస్యలన్నీ శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు కామ్ గా ఉన్న ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కేలా చేశావ్ శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు సాయి : ఐదేళ్లుగా నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటే నువ్ ఇప్పుడు వచ్చావు ఆ అమ్మాయి నన్ను కూడా ప్రేమించింది దేవ్ రాజ్ : ఇప్పుడే ఆ అమ్మాయిని అడుగు ఎవరిని లవ్ చేస్తుందో?? శ్రావణి నువ్ ఎవరిని లవ్ చేస్తున్నావ్?? నన్ను లవ్ చేస్తున్నావా లేదా?? శ్రావణి : చేస్తున్న దేవ్ రాజ్ : సాయి నువ్ ఇప్పటికైనా మధ్యలో ఉండి డ్రామా చేయకు ఇప్పటికైనా ఆ అమ్నాయి కి ఎవరు కావాలంటే వారికే ఇచ్చి చేయండి గొడవలు అవసరం లేదు.. సైలెంట్ గా ఉండు.. శ్రావణి ఇష్టప్రకారం జరగని శ్రావణి తమ్ముడు శివ్తో దేవ్ రాజ్ ఇప్పటికైనా మీ శ్రావణికి ఏం కావాలో అది చెయ్యు సాయి కుట్రల వల్ల ఇదంతా జరుగుతుంది నువ్వు మీ అక్క తీసుకుని రా.. మీ అక్క మనసులో ఏం ఉందో నిరుపిస్తా.. మిమ్మల్ని ఎవరు చెడగొడుతున్నారో నిరూపిస్తా.. అయితే శ్రీ కన్య హోటల్ కి వెళ్లిన పోలీసులు సిసి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవరాజ్ పై దాడి, శ్రావణిపై చేయి చేసుకున్న వ్యవహారం స్పష్టంగా ఉంది. అంతేకాదు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణిని విఫరితంగా వేధించినట్లు తెలిసింది. అందుకే అడ్డుగా ఉన్న దేవరాజ్ ని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేశాడు సాయి అని తెలుస్తోంది. శ్రావణి దేవరాజ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సాయి ఒక ఆడియో టేప్ బయట పెట్టాడు. అయితే ఆ వేధింపుల వ్యవహారంలోనే దేవరాజ్ ని గతంలో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాయి బయట పెట్టిన ఆడియో పాతదిగ గుర్తించారు. కేసు తరువాత కూడా శ్రావణి దేవరాజ్ ని ప్రేమిస్తూనే ఉంది. టిక్ టాక్ ద్వారా దేవరాజ్ బర్త్ డే రోజు శ్రావణి ప్రపోజ్ చేసింది. వీరి కలయిక నచ్చక సాయి శ్రావణిని వేధించినట్లు దర్యాప్తులో తేలింది. నలుగురిలో కొట్టడం, ఈ విషయం ఇంట్లో చెప్పి గొడవలు రేకెత్తించడంతో శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సాయి ని, నిర్మాత అశోక్ రెడ్డి ని కూడా విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరు అని తేలిపోతుంది. మూడు రోజుల దర్యాప్తులో హోటల్ లో సాయి దాడి, ఇంట్లో వారి గొడవే కారణమని కేసు ఓ కొలిక్కి వచ్చింది. సాయి, అలాగే శ్రావణి ఆత్మహత్య జరిగిన రోజు సాయి దేవ్ రాజ్ శ్రావణి కోసం గొడవపడిన ఆడియో సైతం బయటపడింది. దీంట్లో శ్రావణి దేవ్ రాజ్ ను ప్రేమిస్తున్నట్లు సాయి ఎదుటే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉజ్వల భవిష్యత్తుతో కొనసాగాల్సిన శ్రావణి జీవితం చివరకు విషాదంగా మిగిలింది. సాయి దేవ రాజుల మధ్య నలిగిపోయి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులో ప్రధానంగా శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి ఒత్తిడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు దేవరాజ్ పోలీసులకిచ్చిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేసులో ఇంకా సాయిని అలాగే నిర్మాత అశోక్ రెడ్డి ని శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించాల్సి ఉంది. ఈ విచారణ అనంతరం ఈ కేసులో అసలు నేరస్తుడిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. -
నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి: శ్రావణి
-
ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో గంటకో ఆస్తకరమైన విషయం వెలుగులోకి వస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు, పోలీసుల దర్యాప్తు ద్వారా తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఓ వైపు సాయి, మరోవైపు దేవరాజుతో ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. తొలుత శ్రావణి సాయితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే దేవరాజు పరిచయం కావడంతో సాయిని పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. దేవరాజు పరిచయం అయినా కొద్దీ రోజులకే పీకల్లోతు ప్రేమలో శ్రావణి మునిగిపోయింది. ఈ విషయం కాస్తా ఇంట్లో వారికి తెలియడంతో గొడవలు ప్రారంభం అయ్యేయి. అయినా ఎవరికీ తెలియకుండా దేవరాజును కలిసేది. ఈ క్రమంలోనే ఓ రోజు కుటుంబ సభ్యులు, సాయి, శ్రావణికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలో దేవరాజుపై ఉన్న ప్రేమను కుటుంబ సభ్యులకు వ్యక్తపరిచింది. (శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు) ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ మరో వైపు ఏమి తెలియనట్టుగా దేవరాజుకు కాల్ చేసి జరుగుతున్న గొడవను వినిపించింది. అయితే దేవరాజు తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేశాడు. సుమారు అరగంట జరిగిన గొడవను రికార్డ్ చేసి తన ఫోన్లో ఉంచుకున్నాడు. అయితే ఈ గొడవ జరిగిన తరువాత ఏం అయ్యిందో తెలీదు కానీ దేవరాజుకు ఫోన్ చేసిన శ్రావణి తన చావుకు సాయి కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం దేవరాజును అదుపులోకి తీసుకోవడంతో ఆడియో మీడియాకు లీక్ అయింది. ఈ ఆడియో ప్రకారం.. తనను సాయి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తల్లిని శ్రావణి నిలదీసింది. రెస్టారెంట్లో అందరి ముందు కొట్టడం ఎంతవరకు సరైనదని నిలదీసింది. అయితే సాయి బాధితురాలిని ఎందుకు కొట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరితో ప్రమాయణమే శ్రావణి కొంప ముంచిందా అనే అనుమానం కూడా కలుగుతోంది. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్) -
శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. టిక్టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడు గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో భాగంగా దేవరాజ్రెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించాడు. దీంతో ఈ కేసులో మరో అనుమానితుడిగా ఉన్న సాయికృష్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.(చదవండి: నటి శ్రావణి ఆత్మహత్య కేసు: అనేక మలుపులు) ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారంటూ, శ్రావణి దేవరాజ్తో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు బయటకు వచ్చాయి. ఇందులో తన చావుకు సాయి కారణమని శ్రావణి చివరిసారిగా మాట్లాడిన మాటలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో గతంలోనూ దేవరాజ్ను, సాయి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా సాక్ష్యాలు బయటపడ్డాయి. ఇక సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపించిన దేవరాజ్.. శ్రావణిని కూడా ఇలాగే ట్రాప్ చేసినట్లు తెలిపాడు. తన నుంచి విడిపోవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ కేసులో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.(చదవండి: నటి శ్రావణి- ఆర్ఎక్స్100 నిర్మాత ఆడియో లీక్) నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి: శ్రావణి ఈ కేసు విచారణ నేపథ్యంలో గతంలో దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ‘‘నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి.. ఎంతోమంది పరిచయమైనా నువ్ మాత్రమే స్పెషల్.. నీలో నాకు ఎప్పుడూ మిస్టేక్ అనిపించలేదు.. నా ఫ్యామిలీ మెంబర్ లా నువ్ నాతో ఉన్నావ్. నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెప్తాను. నేను చాలాసార్లు హర్ట్ చేశాను. నేను ఎవరికీ సారీ చెప్పను నీకు మాత్రమే చెప్తున్నాను. నిన్ను ఏమన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనవ్. నాకు ఫోన్ చెయు అప్పుడపుడు’’అంటూ శ్రావణి దేవరాజ్పై తనకున్న అభిమానం చాటుకుంది.(చదవండి: నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) -
నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు
హైదరాబాద్/పిఠాపురం: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. దేవరాజ్రెడ్డి, సాయి, అశోక్రెడ్డి.. ఈ ముగ్గురి మధ్యే కథ నడుస్తోంది. వీరితో శ్రావణి మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. దేవరాజ్రెడ్డి, సాయితో శ్రావణి చేసిన టిక్టాక్ వీడియోలు కూడా బయటికొచ్చాయి. దేవరాజ్రెడ్డి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దేవరాజ్రెడ్డి గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు. ఇద్దరూ ప్రేమించుకున్నట్టు చెప్పాడు. అయితే ఈ కేసులో తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్రెడ్డి పేరు తెరపైకొచ్చింది. శ్రావణి, అశోక్రెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వివరాలు బయటికొచ్చాయి. దేవరాజ్రెడ్డి వద్ద శ్రావణి, అశోక్రెడ్డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలున్నాయని.. వాటిని అడ్డం పెట్టుకుని అతను బెదిరిస్తున్నట్టుగా ఫోన్ సంభాషణల్లో ఉంది. సాయితో పాటు అశోక్రెడ్డిని కూడా విచారిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) నిలదీయడంతో వేధింపులు దేవరాజ్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. టిక్ టాక్ ద్వారా యువతులను ఆకర్షించి ప్రేమ పేరుతో దేవరాజ్ పలువురిని మోసం చేసినట్టు తెలిసింది. శ్రావణిని కూడా అలానే ప్రేమలోకి దించి, ఆమెకు తెలియకుండా ఆమె సెల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారం తీసుకున్నాడు. ప్రేమ పేరుతో దేవరాజ్ పలువురిని మోసం చేసినట్టు ఆలస్యంగా తెలుసుకున్న శ్రావణి అతడిని నిలదీసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు పాల్పడటంతో జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు వాపస్ తీసుకోవాలని, లేదంటే అశోక్రెడ్డి, సాయితో మాట్లాడిన ఆడియోలను సోషల్ మీడియాలో పెడతానని దేవరాజ్ బెదిరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలోని శ్రావణి స్వగ్రామం గొల్లప్రోలులో గురువారం ఆమె అంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా తెల్లవారుజామున ఆమె మృతదేహం వెంట గొల్లప్రోలుకు వచ్చారు. తనకు, శ్రావణి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని టిక్టాక్ ద్వారా పరిచయమైన కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డే శ్రావణి మృతికి కారకుడని ఆరోపించారు. (చదవండి: కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్తో దాడి) -
శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి..
-
శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి..
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి గురించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్ టిక్టాక్ను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతులను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్టుగా టిక్టాక్ వీడియోల ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్లేబాయ్ అవతారం ఎత్తిన దేవరాజ్ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తోంది. (శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’) అదే మాదిరిగా నటి శ్రావణిని కూడా దేవరాజ్ ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపాడు. అయితే తనతో పాటు మరికొంతమంది యువతులతో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే సమయంలో శ్రావణికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఆమెకు చూపించిన దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన ఫోటోలు, వీడియోలు అతడి మొబైల్లో ఉండటంతో ఆమె కంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవరాజ్ శ్రావణిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆరోపించారు. ఈ ఏడాది జూన్లో దేవరాజ్పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ శ్రావణి, దేవరాజ్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం ) ఈ కేసు విచారణపై ఎస్సార్ నగర్ సీఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ సరెండర్ అయ్యాడని, శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రావణి స్నేహితుడు సాయిని కూడా విచారణ చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఆడియోలు, టిక్టాక్ వీడియోలు , సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నామన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్ రెడ్డిని కూడా విచారణ చేపడతామని తెలిపారు. (నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) -
నటి శ్రావణి- ఆర్ఎక్స్100 నిర్మాత ఆడియో లీక్
-
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రావణి మృతికి దేవరాజు వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది. కాగా శ్రావణిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుకు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టిక్టాక్లో అమ్మాయిలను ఫ్రెండ్స్ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని, డబ్బు వసూలు చేసేవాడని అతడిపై శ్రావణి గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.(చదవండి: వేధింపులు.. సీరియల్ నటి ఆత్మహత్య) -
స్వస్థలానికి చేరుకున్న టీవీ నటి శ్రావణి భౌతికకాయం
-
శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’
అమీర్పేట(హైదరాబాద్): టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మధురానగర్లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రావణి ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి పాపులర్ సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్మెంట్లో శ్రావణి కుటుంబం ఉంటోంది. టిక్ టాక్ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డి అలియాస్ సన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దేవరాజ్ వారి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో యువతిని మోసం చేయడంతో.. శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. శ్రావణి వద్ద నుండి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్.. ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. రెండు రోజుల అనంతరం ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తరువాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్ 22న ఎస్ఆర్నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. నాకేం సంబంధం లేదు.. తన కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్రెడ్డి దీనిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, కుటుంబ సభ్యులు కొట్టారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. డబ్బుల కోసం తానేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ అన్నాడు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని తెలిపాడు. దేవరాజ్వల్లే..: సాయి ఇదిలా ఉండగా.. దేవరాజ్రెడ్డి శ్రావణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపించాడు. శ్రావణి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి సమాచారం రాగానే వెంటనే వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తానే ఆసుపత్రికి తీసుకువెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రావణిని దేవరాజ్రెడ్డి ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడినట్టు చెబుతు న్న ఆడియోను విడుదల చేశాడు. ప్రతి పండుగకు గొల్లప్రోలుకు వచ్చేది.. పిఠాపురం: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదా వరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన టీవీ సీరి యల్ నటి శ్రావణి ఆత్మహత్యతో ఆమె కు టుంబంలో విషాదం నెలకొంది. తమ తం డ్రి కొండపల్లి భాస్కరావు వ్యవసాయ కూలీ అని, చిన్ననాటి నుంచి సెలబ్రిటీగా ఎదగా లని శ్రావణి తపన పడేదని మృతురాలి అక్క విమల తెలిపారు. మృతురాలికి విమ ల, మహేశ్వరి అనే ఇద్దరు అక్కలు, శివ అనే సోదరుడు ఉన్నారు. తమ చెల్లి శ్రావణి ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లి తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్లో నటించే అవకాశం సంపాదించిందని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని విమల తెలిపారు. సీరియల్స్లోనే కాకుండా ఆర్ఎక్స్ 100తోపాటు 30 సినిమాల్లో కూడా శ్రావణి నటించిందని ఆమె వెల్లడించారు. ఇటీవలే గొల్లప్రోలులో శ్రావణి సొంతంగా ఇల్లు కొనుగోలు చేసిందని, మూడేళ్ల కిందట తమ తల్లిదండ్రులను గొల్లప్రోలు నుంచి హైదరాబాద్లో తన వద్దకు తీసుకువెళ్లడంతో అక్కడే ఉంటున్నారని విమల చెప్పారు. ప్రతి పండుగకు గొల్లప్రోలు వచ్చి తమతో ఆనందంగా గడిపి వెళ్లేదని, ఇటీవల వరలక్ష్మి వ్రతానికి కూడా వచ్చిందని.. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె విలపించారు. -
శ్రావణిని ఫోన్లో బెదిరించిన దేవరాజ్
-
నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు
సాక్షి, హైదరాబాద్: నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం టీవీ సీరియల్లాగానే పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవం అని సాయి అనే వ్యక్తి మరో వీడియో విడుదల చేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్నని చెప్పాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశాడు. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం ) కాగా శ్రావణి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను తాను బెదిరించలేదంటూ దేవరాజ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శ్రావణి - దేవరాజ్ ఫోన్ సంభాషణలు ‘సాక్షి టీవీ’కి చిక్కాయి. ఆ ఫోన్ సంభాషణలో శ్రావణిని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మర్యాదగా వచ్చి గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవని దేవరాజ్ బెదిరించగా, ‘ఇంతటితో ఆపేయ్.. నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు.. నీతో మాట్లాడను సారీ దేవ’ అంటూ శ్రావణి మాట్లాడింది. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య) మౌనరాగం, మనసు మమత వంటి ప్రేక్షకాదరణ పొందిన టీవీ సీరియళ్లలో నటించిన శ్రావణి హైదరాబాద్ ఎస్సార్ నగర్లోని మధురానగర్లోని నివాసంలో నిన్న రాత్రి ఉరి వేసుకుంది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దేవరాజ్ అనే యువకుడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
-
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి పేర్కొన్నాడు. శ్రావణి ఫోన్ కాల్ రికార్డింగ్ మొత్తం బయటపెడతానని, పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కూడా తాను సిద్ధమని తెలిపాడు. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య) శ్రావణి తల్లిదండ్రుల ఒత్తిడితోనే గతంలో తనపై కేసు పెట్టిందని దేవరాజ్ రెడ్డి తెలిపాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో తనను పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందని, అందుకు తాను ఒప్పుకోకపోయేసరికి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. గతంలో తనపై పెట్టిన పోలీస్ కేసు వెనక్కి తీసుకుంటానని శ్రావణి చెప్పిందని, రెండు రోజుల క్రితం తామిద్దరం శ్రీకన్య రెస్టారెంట్కు వెళ్లినట్లు దేవరాజ్ రెడ్డి పేర్కొన్నాడు. ఆ సమయంలో సాయి ...ఆమెను కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడని తెలిపాడు. డబ్బుల కోసం తాను శ్రావణిని ఎప్పుడూ బ్లాక్మెయిల్ చేయాలేదని దేవరాజ్రెడ్డి స్పష్టం చేశాడు. తనకు శ్రావణి చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు తనను సాయి, కుటుంబ సభ్యులు హింసిస్తున్నారంటూ అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పిందని పేర్కొన్నాడు. చావు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని తాను శ్రావణికి చెప్పానంటూ, అందుకు సంబంధించిన కాల్ రికార్డ్ను అతడు బయటపెట్టాడు. మరోవైపు శ్రావణి మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్ట్మార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం విజయవాడ తరలించారు. -
తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య
-
తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : టిక్టాక్లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపుల కారణంగా టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. మౌన రాగం, మనసుమమత వంటి పలు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్ ఫ్లోర్లో నివాసముంటున్నారామె. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో టిక్ టాక్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను. అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు. అతడి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు చేసుకుంది. కుమార్తె ఆత్మహత్యపై ఆమె తల్లి దండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు. మెంటల్ టార్చర్ పెట్టేవాడు తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమని శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. భాగ్య రేఖ సీరియల్లో నటిస్తున్న దేవరాజ్.. తన కూతురు శ్రావణి ద్వారానే సీరియల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు. ‘పరిచయమైన దగ్గరి నుంచి వేధింపులకు గురిచేశాడు. పడుకున్నప్పుడు శ్రావణి సెల్ ఫోన్ ఫింగర్ లాక్ తీసుకుని అందరికి ఫోన్లు చేసేవాడు. నా కూతురిని దేవరాజ్ మెంటల్ టార్చర్ పెట్టేవాడు. గతంలో ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం. అయినా దేవరాజ్ మారలేదు. పోలీసులు దేవరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాల’ని పాపారత్నం పేర్కొన్నారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను దేవరాజ్ రెడ్డి తోసిపుచ్చాడు. -
శ్రావణిని చంపేశారా!?
కదిరి అర్బన్: గత ఏడాది తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణిని హతమార్చారా? ప్రస్తుతం లభ్యమైన మానవ అవశేషాలు, పర్సు, సెల్ఫోన్ శ్రావణివేనా? తదితర ప్రశ్నలకు సమాధానం అవుననే సమాధానం వస్తోంది. తొమ్మిది నెలలుగా కొనసాగుతూ వచ్చిన పోలీసు దర్యాప్తు.. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి 2019, అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయింది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. పట్టణ సమీపంలోనే ఆధారాలు లభ్యం ఈ నెల 22న స్థానిక మున్సిపల్ పరిధిలోని సోమేష్ నగర్ సమీపంలో శ్రావణికి సంబంధించి ఆధారాలు ఓ గొర్రెల కాపరికి కంటపడ్డాయి. అనుమానం వచ్చిన ఆ కాపరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీక్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్ఫోన్, ఏటీఎం కార్డు, చిన్న మొత్తంలో నగదు లభ్యమయ్యాయి. పర్సు పడి ఉన్న చోటుకు కొద్దిదూరంగా ఓ పుర్రె, రెండు ఎముకలను గుర్తించారు. ఇవి శ్రావణివేనా లేక మరెవరివైనా అనేది తేలాల్సి ఉంది. లభ్యమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. కాగా, శ్రావణిపై అత్యాచారం జరిపి హతమార్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం
మేడిపల్లి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దల నిర్ణయాన్ని అడిగారు. వివాహానికి వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బుధవారం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో నివసిస్తున్న బోరెండల్ కిరణ్కుమార్ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్బజార్ సేల్స్ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్ ఉప్పల్లోని బజాజ్ వెహికల్ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.(మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!) శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బాత్రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్ సిబ్బంది డోర్ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ డోర్ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్ను చికిత్స నిమిత్తం ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వారి జీవితాల్లో నిజమైన పరివర్తన
‘‘నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కృష్ణాజిల్లా ఎస్పీ సారు నిర్వహించిన జాబ్ మేళాలో నాకు కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది’’ అంటోంది శ్రావణి. కృష్ణాజిల్లా పోలీసులేమిటి, జాబ్మేళా నిర్వహించడం ఏమిటీ అని అనుమానం వస్తోంది కదా... అదేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా ఆ జిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో ఏం జరుగుతోందో, అటువంటి వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందో తెలుసుకుందాం. కృష్ణాజిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని దశాబ్దాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దొరికిన ప్రతిసారి కటకటాల పాలవడం... బయటకు రాగానే మళ్లీ సారా తయారీ చేయడం.. అమ్ముకోవడం వారికి కులవృత్తిగా మారిపోయింది. దీంతో ఆ గ్రామాల నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు చివరకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాని వివక్షకు గురయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇలాంటి వారు పడిన వెతలకు చెక్ పెడుతూ వారి జీవితాల్లో ‘నవోదయం’ తెచ్చేందుకు ప్రభుత్వం ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మిగిలిన జిల్లాలకు భిన్నంగా కృష్ణాజిల్లా పోలీసులను ఆలోచింపజేసేలా చేసింది. అరెస్టులు, కేసుల కంటె వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమార్గంగా తలచి ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో మార్పునకు బీజం వేశారు. సైనికుల్లా పనిచేసిన ఆ పోలీసుల కథేమిటో.. వారి కృషివల్ల వీరి జీవితాల్లో వచ్చిన ‘పరివర్తన’ ఏమిటో చూద్దాం. వారిలో ‘పరివర్తన’కు బీజం పైన చెప్పుకున్నట్లుగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రావణి ఒక్కతే కాదు, ఆ పల్లెల్లో వందలాది నిరుద్యోగ యువత రేపటి భవిష్యత్ కోసం ఆశగా అడుగులు వేస్తోంది. చీకట్లను చీల్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.‘సారా’ గ్రామాలుగా ముద్రపడిన ఆ పలెల్లో ‘పరివర్తన’ తెచ్చే దశగా ఏడాది క్రితం అడుగులు పడ్డాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది మొదలు రవీంద్రనాథ్బాబు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని నిర్ణయించుకున్నారు. వారిలో పరివర్తనకు బీజం వేశారు. వారిచ్చిన భరోసాతో చాట్రాయి, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో నాలుగు దశాబ్దాలుగా సారానే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఏడు గ్రామాల్లోని 431 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సారాకు దూరంగా ఉంటామని ప్రతిన బూనారు. గిరిజనులకు భూములు.. యువతకు ఉద్యోగాలు సారాకు దూరంగా ఉంటామని ముందుకొచ్చిన 200 గిరిజనకుటుంబాలకు గిరిజన భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చదువులేని నిరుద్యోగులకు, పనులు చేయగలిగే మహిళలకు స్థానిక కంపెనీల్లో దినసరి వేతన కూలీలుగా అవకాశాలు కల్పించారు. ఇక కొద్దో గొప్పో చదువుకున్న నిరుద్యోగ యువత కోసం పీవీఎన్ఆర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు 12కు పైగా కార్పొరేట్ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెగా జాబ్మేళాలు నిర్వహించారు. అలా సారా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతలో దాదాపు 150 మందికి వారు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కలలో కూడా ఊహించని రీతిలో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్లు చేతికి రావడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన పరివర్తనతో ఆ పల్లెల్లో వెలుగు పూలు పూస్తున్నాయి. – పంపాన వరప్రసాదరావు, ఫొటోలు: అజీజ్ జుజ్జవరపు సాక్షి, మచిలీపట్నం మా జీవితాల్లో వెలుగులు నింపారు.. మా తాతముత్తాల నుంచి గత్యంతరం లేక ఈ పని చేస్తున్నాం. మా అబ్బాయి ఏడుకొండలును డిగ్రీ వరకు చదివించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మా పని వల్ల వాడికి ఉద్యోగం రాలేదు. జిల్లా ఎస్పీ దొరగారు నిర్వహించిన జాబ్మేళాలో మా అబ్బాయికి చెక్ పోస్టులో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – మల్లవోలు శ్రీనివాసరావు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం -
వైద్య విద్యార్థిని దుర్మరణం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్య కళాశాలలో చదువుతున్న మెడికో సాయంత్రం ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాశయ్య స్థానిక రేడియో స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆ దంపతులకు పెళ్లయిన పదేళ్లకు కుమార్తె బి. శ్రావణి జన్మించింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా శ్రావణి చదువులో రాణించారు. ఎంసెట్లో ర్యాంక్ సాధించి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ప్రస్తుతం ఆమె ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం కళాశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బళ్లారి చౌరస్తా దాటిన తర్వాత హనుమాన్ కాటా సమీపంలో వెనుక నుంచి ఏపీ 21టిఈ 6489 నెంబరు గల లారీ ఢీకొంది. ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్థానికులు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ, వైద్యులు, విద్యార్థుల సంతాపం ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బి. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్ది నిమిషాల ముందు తమతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడిన ఆమె విగతజీవురాలై కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. కొద్దిసేపటికే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సైతం మార్చురీకి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చి సంతాపం ప్రకటించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనువు చాలించడంతో కాశయ్య తట్టుకోలేకపోయారు. అతని ఓదార్చడం సహ ఉద్యోగులకు వీలుకాలేదు. కాశయ్య కుటుంబం మొన్నటి వరకు పోలీస్క్వార్టర్స్లో నివాసం ఉండేది. ఇటీవలే వారు రేడియోస్టేషన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో చేరారు. శ్రావణికి సైతం వారం క్రితమే కొత్త స్కూటీని తండ్రి కొనిచ్చారు. ఈ విషయాలను తలచుకుని మార్చురీకి చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. శ్రావణి మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైద్యులు సందర్శించి సంతాపం ప్రకటించారు. -
తొందరపడి రెండో పెళ్లి చేసుకున్నా..
అమీర్పేట: జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్నగర్కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్ 1న శ్రీనివాస్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ ఉద్యోగం చేసేందుకు తమిళనాడు వెళ్లగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె బాత్రూమ్లో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఆమె తల్లి తలుపులు తట్టినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు విరగొట్టి చూడగా శ్రావణి ఉరికి వేలాడుతూ కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తొందరపడి రెండో వివాహం చేసుకున్నానని, అతడు ఎలా చూసుకుంటాడో తెలియదని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో పేర్కొంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాపురం ఇష్టం లేకే శ్రావణి ఆరోపణలు
లాలాపేట: తనతో కాపురం చేయడం ఇష్టం లేకే శ్రావణి ఆరోపణలు చేస్తోందని, ఏదో ఆశించి ఆమె తన ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నదని శ్రావణి భర్త ప్రవీణ్కుమార్ అన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రావణి అనే మహిళ అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటనపై బుధవారం ఆమె భర్త ప్రవీణ్కుమార్ తండ్రి రుక్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రావణిని వేధించారనడం అవాస్తవమన్నారు. పెళ్లయిన ఐదేళ్ల కాలంలో శ్రావణి తనతో కనీసం ఆరు నెలలు కూడా కలిసి ఉండలేదన్నారు. అప్పుడప్పుడు వచ్చి గొడవ పడి తల్లిగారి ఇంటికి వెళ్లేదన్నారు. తాము కలిసి ఉండలేమని భావించి విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. అయినా తన నుంచి మరేదో ఆశించి తరచూ తనపై ఒత్తిడి చేస్తోందన్నారు. శ్రావణికి కోర్టు ద్వారా విడాకుల నోటీసు సైతం పంపించామన్నారు. తన తల్లిదండ్రులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. తమ ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న శ్రావణిని అక్కడి నుంచి పంపించాలని కోరుతూ లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బాత్రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి
కీసర: అనుమానస్పద స్థితిలో ఓ నవవధువు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్ఎల్నగర్ సమీపంలో జరిగింది. వివరాలు.. ఒంగోలు జిల్లాకు చెందిన నర్సింహ్మా, అంజమ్మదంపతులు కాప్రాలో స్థిరపడ్డారు. తమ కూతురు శ్రావణి(20)ని గత 5 మాసాల క్రితం ఆర్ఎల్నగర్లో నివాసం ఉంటున్న రామంజనేయులకు ఇచ్చి వివాహం చేసారు. పెళ్లి సమయంలోబంగారు ఆభరణాలను రూ.5 లక్షల మేర కట్నం వరుడి కుటుంబానికి అప్పగించారు. వివాహం జరిగిన కొన్ని రోజులనుండే అదనపు కట్నం కోసం భర్త ఆంజనేయులు, అత్త రేణుకమ్మ, మామవెంకట్రావు,మరిది, ఆడ పడచు, , తరచూ శ్రావణిని వేదిస్తుడేవారు. అదనపు కట్నం కోసం అత్తమామ భర్త వేదింపుల విషయాన్ని శ్రావణి తన తల్లిదండ్రులకు కుడా తెలపడంతో తల్లిదండ్రులు మరో రూ.5 కుడా ఇచ్చేందుకు అంగికరీంచారు. గురువారం ఉద యం శ్రావణి,రామంజనేయులు ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త, కుటుం బసభ్యులు శ్రావణిని నాగారంలో ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శ్రావణిని పరిక్షించి అప్పటికే శ్రావణి మృతిచెందిందని నిర్థారించారు. మెడపైనల్లగా కమిలిన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి కీసర పోలీసులకు సమాచారం అందించారు. కీసర సీఐ నరేందర్గౌడ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించారు. శ్రావణి భర్త రామంజనేయు లు, అత్త మామలను అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు. అదనపుకట్నం కోసం అత్తమామ, భర్త రామంజనేయులు కలిసి తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు నర్సింహ్మ,అంజమ్మలు బోరున విలఫించారు. -
వరంగల్ సెంట్రల్ జైల్లో సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డి
-
రాత్రి తన గదిలో పడుకుంది ఉదయం లేచేసరికి..
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుధీర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్గూడ, శ్రీకృష్ణానగర్కు చెందిన మల్లె రాజ్యలక్ష్మి, రమణయ్య దంపతుల కుమార్తె శ్రావణి(21) ఈ నెల 1న రాత్రి తన గదిలో నిద్రకు ఉపక్రమించింది. ఉదయం ఆమె గదిలో కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. -
హాజీపూర్ గ్రౌండ్ రిపోర్ట్
-
ఎమ్మెల్యే సునీతను అడ్డుకున్న హాజీపూర్ గ్రామస్తులు
-
ముగ్గురినీ హతమార్చాడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. 2015లో కల్పన హత్యను చేసిందీ శ్రీనివాస్ రెడ్డేనని పోలీసులు స్పష్టం చేశారు. శ్రావణి, మనీషాతో పాటు కల్పననూ తానే హత్య చేశానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. దీంతో కల్పన కేసులో చిక్కు ముడి వీడినట్లయింది. గ్రామస్తులపై ప్రతీకారం కోసమే కామాంధుడు, సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్రెడ్డి.. మైనర్ బాలికలే లక్ష్యంగా క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చాడని సీపీ తెలిపారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలు, మహిళల కదలికలపై శ్రీనివాస్ రెడ్డి రెక్కీ నిర్వహించేవాడని.. వారిని అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసిన తర్వాతే అత్యాచారం చేసి చంపేసేవాడని వెల్లడైంది. కాగా.. బంధువుల ఇంట్లో దాక్కున్న సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డిని స్పెషల్పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, లిఫ్ట్ రిపేరు టూల్కిట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ ఘటన వివరాలను మహేష్ భగవత్ వెల్లడించారు. వివరాలు.. సీపీ మాటల్లోనే.. 2015 నాటి ఘటనలో.. 2015లో బొమ్మల రామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని కల్పన (11) స్కూలు తర్వాత తన ఊరికి వెళ్తుండగా నిందితుడు శ్రీనివాస్రెడ్డి ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను హతమార్చి గన్నీబ్యాగ్లో మృతదేహాన్ని పెట్టి సీతారామ్రెడ్డి వ్యవసాయ బావిలో పడేశాడు. దీనిపై బొమ్మలరామారం పోలీసుస్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. ఈ ఘటనలోనూ శ్రీనివాస్రెడ్డిపైనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవు. అయితే శ్రావణి, మనీషాల హత్య కేసు విచారణ సందర్భంగా కల్పనను కూడా హతమార్చింది తానేనని శ్రీనివాస్ రెడ్డి.. అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి9న కీసర మండలం చీర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హాజీపూర్కు చెందిన విద్యార్థిని మనీషా (17) కళాశాల నుంచి ఇంటికొచ్చే క్రమంలో శ్రీనివాస్రెడ్డి బైక్పై లిఫ్ట్ పేరుతో ఎక్కించుకొని బావి వద్దకు తీసుకువెళ్లి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసి అత్యాచారం చేసి, అంతమొందించాడు. తరువాత మృతదేహాన్ని తన బావిలో పూడ్చిపెట్టాడు. అప్పట్లో స్థానిక పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈనెల 29వ తేదీన శ్రావణి హత్యకేసు విచారణ సందర్భంగా.. బావి వద్ద దుర్వాసన వచ్చింది. ఘటనాస్థలంలో దొరికిన ఆధార్కార్డు. అక్కడ లభించిన మృతదేహాం (ఎముకలు) ఆధారంగా ఆమెను మనీషాగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో శ్రీనివాస్రెడ్డి నిందితుడిగా తేలింది. చితకబాదిన గ్రామస్తులపై కోపంతో.. హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డి (28) సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలను చూడటంతోపాటు మద్యం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. 2015లో మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బొమ్మల రామారం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం గ్రామస్తులు శ్రీనివాస్రెడ్డికి దేహశుద్ధి చేశారు. తనను చితకబాదిన గ్రామస్తులపై ఆయన పగ పెంచుకున్నాడు. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారం చేస్తూ హతమార్చాలని నిర్ణయించుకుని ఉన్మాదిగా మారాడు. హాజీపూర్ గ్రామం ప్రారంభంలోనే తన ఇల్లుండడంతో.. బయటకు వెళ్లే బాలికలు, మహిళల రాకపోకలు గమనిస్తుండేవాడు. శ్రావణి ఘటనతో దారుణాలు వెలుగులోకి ఈనెల 25న 9వ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి (14) పాఠశాల నుంచి వచ్చి.. హాజీపూర్ వెళ్లేందుకు చెట్టుకింద బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ ఇస్తానని బైక్పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై కొట్టి అపసార్మక స్థితికి వెళ్లిన తరువాత బావిలో పడేశాడు. తరువాత శ్రీనివాస్రెడ్డి బావిలోకి దిగి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అంతమొందించాడు. బావి నుంచి తిరిగివచ్చే క్రమంలో శ్రావణి స్కూల్బ్యాగ్ కనబడడంతో అనుమానం రాకుండా బ్యాగ్ను వ్యవసాయ బావి వద్ద పడేసి వెళ్లిపోయాడు. శ్రావణి హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఈనెల 26వ తేదీన భువనగిరిలో స్నేహితుని పెళ్లికి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యాడు. పోలీసుల రాకతో పారిపోయాడు ఏప్రిల్ 26న పోలీసుల ప్రత్యేక బృందం హాజీపూర్ గ్రామానికి చేరుకొని బాలిక అదృశ్యం కేసుపై విచారణ చేస్తున్నట్టు గుర్తించిన శ్రీనివాస్రెడ్డి ఊరొదిలి పారిపోయాడు. విచారణలో భాగంగా వ్యవసాయ బావి వద్ద స్కూల్ బ్యాగ్, స్కూల్ ఐడీ కార్డు లభించడంతో శ్రావణి అదృశ్యం మిస్టరీ వీడింది. అత్యాచారం చేసి, హత్య చేశారని విచారణలో తేలడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతంగా చేశారు. గ్రామంలో గంజాయి, మద్యం సేవించే వారిని విచారించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్రెడ్డిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది. ప్రత్యేక పోలీసు బృందాలు, భువనగిరి పోలీసులు, బోమ్మల రామారం పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఘట్కేసర్ సమీపంలోని రావిరాల గ్రామంలోని బంధువుల ఇంట్లో శ్రీనివాస్రెడ్డి ఉన్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా శ్రావణి, మనీషాల హత్యపై నోరువిప్పిన శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత కల్పనను చంపిన విషయాన్నీ వెల్లడించాడు. అంతా సింగిల్గానే చేశాడు బాలికల సీరియల్ అత్యాచారాలు, హత్యలు శ్రీనివాస్రెడ్డి ఒక్కడే చేశాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. గతంలో శ్రీనివాస్రెడ్డి పని చేసిన ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మనీషా, కల్పనల ఎముకలు మాత్రమే లభించడంతో వీటిని డీఎన్ఏ ద్వారా నిర్ధారించుకుంటామని పోలీసులు వెల్లడించారు. కల్పన మిస్సింగ్ సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలనూ విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఫేస్బుక్లో శ్రీనివాస్రెడ్డికి వేములవాడకు చెందిన యువతితో వివాహాం జరిగినట్టు తెలియడంతో దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. ‘శ్రావణి తండ్రికి ప్రభుత్వోద్యోగం కోసం కలెక్టర్ పరిశీలిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయంపైనా ప్రభుత్వంతో కలెక్టర్ మాట్లాడుతున్నారు. గ్రామంలో గంజాయి విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. బెల్టుషాపులను మూసివేయించాం. నిందితుడు శ్రీనివాస్రెడ్డికి జీవిత ఖైదు పడేలా కేసులు నమోదు చేస్తాం’అని సీపీ తెలిపారు. -
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
-
కల్పన మృతదేహం వెలికితీత!
సాక్షి, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లోని బావి నుంచి చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో వెతికిన పోలీసులు.. ఎట్టకేలకు కల్పన ఆస్తికలను గుర్తించారు. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు శ్రీనివాస్రెడ్డికి చెందిన ఒకే బావిలో లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన మరో బావిలో కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదేవిధంగా శ్రావణి, మనీషాలను కూడా అత్యాచారం చేసి.. శ్రీనివాస్రెడ్డి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటు హజీపూర్ వరుస హత్యల కేసులో దర్యాప్తు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. భువనగిరి ఇన్స్పెక్టర్తోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఈ సిట్లో నియమించారు. -
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
సాక్షి, బొమ్మలరామారం : ముగ్గురు ఆడపిల్లలను హతమార్చి ఏం ఎరుగనట్టు తమ మధ్యే తిరిగిన మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని గుర్తించలేకపోయామని హజీపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో చోటుచేసుకున్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి విచారణలో వెల్లడవుతున్న విషయాలతో గ్రామస్థులు అవాక్కవుతున్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి గురించి అంతగా ఎవరికీ తెలియదని, అతను ఎక్కువగా ఊరిలో ఉండేవాడు కాదని, ఎవరితో అంతగా మాట్లాడేవాడు కాదని, ఇంత దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేదంటున్నారు. వరంగల్, కర్నూల్లో అతనిపై కేసులు నమోదైన విషయం కూడా తెలియదంటున్నారు. తొలుత శ్రావణి ఉదంతం బయటపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి అందరిలానే ప్రవర్తించాడన్నారు. శ్రావణి మృతదేహం తన బావిలో ఉందని తెలిసి అందరిలానే చుట్టూ నిలబడి చూశాడని, పైగా బావిలోకి ఎలా దిగాలో కూడా సలహాలిచ్చాడని వాపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? ఇంకెవరైన హస్తం ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యల సంఘటనలు పరిశీలిస్తే ఒక్కడి వల్ల సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్కడికి బావిలోకి దిగడం సాధ్యమే కాదు. ఐదేకరాల నిర్మానుష్య ప్రాంతం కావడం.. ఇక్కడ ఏం జరిగినా.. కనపడని, అరిచినా.. వినపడని నిర్మానుష్య ప్రాంతం కావడంతో శ్రీనివాస్ రెడ్డి తన నేరాలకు అనువుగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గరు అమయాక ఆడపిల్లలను బలి తీసుకున్న అతన్ని చంపేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. -
బొమ్మలరామారం వరుస హత్యలు.. కీలక నిజాలు!
-
హజీపూర్ వరుస హత్యలు.. సంచలన నిజాలు!
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో చోటుచేసుకున్న వరుస హత్యల మిస్టరీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డి తాజాగా విచారణలో తన దారుణాల గుట్టు విప్పాడు. శ్రావణి, మనీషా, కల్పన.. ఇలా ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేశానని, వారిపై కిరాతకంగా లైంగిక దాడులు జరిపి మరీ చంపేసినట్టు శ్రీనివాస్రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాకపోవడంతో శ్రీనివాస్రెడ్డి సైకోగా మారిపోయాడని, అతనికి తరచూ పోర్న్ వెబ్సైట్లు చూసే అలవాటు ఉందని, ఈ క్రమంలో అమాయకులైన ఆడపిల్లలపై కన్నేసిన అతను.. రాక్షసుడిగా మారి.. అమ్మాయిలపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హాజీపూర్లో వెలుగుచూసిన మూడు హత్యలు తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు ఒకే బావిలో లభించగా.. నెలరోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు అమ్మాయిలను శ్రీనివాస్రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన(11)పై కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు నిందితుడు తాజాగా అంగీకరించాడు. దీంతో కల్పన మృతదేహం కోసం మరో బావిలో పోలీసులు వెతుకుతున్నారు. శ్రావణి, మనీషాను హత్య చేసి.. బావిలో విసిరేసినట్టే.. కల్పనను కూడా అదేవిధంగా మరో బావిలో విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఇప్పటికే గ్రామస్తులు దాడి చేసి.. నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని తగలపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు. శ్రీనివాస్రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వరుస హత్యలు.. హాజీపూర్లో టెన్షన్ శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?